Homeఅంతర్జాతీయంAmerica Iran: అమెరికా–ఇరాన్‌ దాడులు నిలిపివేత.. ఖతార్‌ కేంద్రంగా కీలక సమావేశం!

America Iran: అమెరికా–ఇరాన్‌ దాడులు నిలిపివేత.. ఖతార్‌ కేంద్రంగా కీలక సమావేశం!

America Iran: శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత పశ్చిమాసియా ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌ దేశాలు పరస్పరం సైనిక చర్యలను వెంటనే ఆపివేయాలని నిర్ణయించాయి. ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని కొనసాగించి ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు మంగళవారం ఖతార్‌లో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చర్చలు హర్మూజ్‌ జలసంధి సమస్యపై సాంకేతిక స్థాయిలో కొనసాగుతున్నంత వరకు దాడులు చేయకూడదని ఇరు దేశాలు అంగీకరించాయి. అమెరికా సీనియర్‌ అధికారులు సైనిక కార్యకలాపాలను తక్షణం […]

America Iran: శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత పశ్చిమాసియా ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌ దేశాలు పరస్పరం సైనిక చర్యలను వెంటనే ఆపివేయాలని నిర్ణయించాయి. ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని కొనసాగించి ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు మంగళవారం ఖతార్‌లో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చర్చలు హర్మూజ్‌ జలసంధి సమస్యపై సాంకేతిక స్థాయిలో కొనసాగుతున్నంత వరకు దాడులు చేయకూడదని ఇరు దేశాలు అంగీకరించాయి. అమెరికా సీనియర్‌ అధికారులు సైనిక కార్యకలాపాలను తక్షణం నిలిపివేయడానికి సమ్మతించినట్లు వెల్లడించారు. హర్మూజ్‌ జలసంధిలో నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించగలవని వారు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ఆ జలసంధి మార్గం సురక్షితంగా కొనసాగుతుందని నమ్మకం వ్యక్తమవుతోంది.

ఇరాన్‌ అణు కార్యక్రమంపై చర్చలు..
ఇరాన్‌ అణు కార్యక్రమాలపై మొదట స్విట్జర్లాండ్‌లో జరపాలని భావించినప్పటికీ, ఇటీవలి ఉద్రిక్తతల కారణంగా వేదికను ఖతార్‌ రాజధాని దోహాకు మార్చారు. ఈ సమావేశాల గురించి అమెరికా వైపు నుంచి అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే రెండు దేశాలు ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని కాపాడుకునేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే రెండు దేశాల డీల్‌..
అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఇటీవల ఒప్పందం కుదిరింది. దీంతో హర్మూజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా తిరిగి ప్రారంభమైంది. కానీ రెండు రోజుల క్రితం ఇరాన్‌ బలగాలు చమురు తీసుకెళ్తున్న ఖరీదైన వాణిజ్య నౌకపై డ్రోన్‌లతో దాడి చేశాయి. ఒక డ్రోన్‌ కార్గో నౌకను తాకడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దీంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అమెరికా ఇరాన్‌ యొక్క క్షిపణి, డ్రోన్‌ నిల్వ స్థావరాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్‌ కూడా గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకార చర్యలు తీసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పరస్పర చర్యలతో యుద్ధం మళ్లీ మొదలవుతుందనే ఆందోళన వ్యక్తమైంది. అయితే ఇరు దేశాలు నష్టాలను అరికట్టేందుకు, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకున్నాయి.

హర్మూజ్‌ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణం కొనసాగించడం, ఇటీవలి ఒప్పందాన్ని రక్షించడం రెండు దేశాలకు ప్రాధాన్యత అని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper