Homeఅంతర్జాతీయంCOVID-19 Lab Leak Theory: కరోనాను అమెరికా సైంటిస్ట్ సృష్టించాడా.. వ్యాక్సిన్ వ్యాపారం కోసం ఘాతుకం.....

COVID-19 Lab Leak Theory: కరోనాను అమెరికా సైంటిస్ట్ సృష్టించాడా.. వ్యాక్సిన్ వ్యాపారం కోసం ఘాతుకం.. వెలుగులోకి విస్తు పోయే దారుణం..

COVID-19 Lab Leak Theory: కరోనా.. ఈ వ్యాధి వల్ల ప్రపంచం మొత్తం నాలుగు సంవత్సరాల పాటు నరకం చూసింది. చాలామంది చనిపోయారు. అంతే సంఖ్యలో అయిన వాళ్ళని కోల్పోయారు. కొంతమంది అయితే ఇళ్లలోనే ఉండి.. స్వీయ నరకాన్ని అనుభవించారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది కన్ను మూయడంతో ప్రపంచం మొత్తం శోక సంద్రంగా మారిపోయింది.

కరోనా వ్యాధికి సంబంధించిన వైరస్ చైనాలోని వూహన్ ల్యాబ్ నుంచి బయటికి విడుదలైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. చైనా దేశం మీద ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతేకాదు, చైనా కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు లాక్ డౌన్ విధించింది. చాలా నగరాలలో ప్రజలను బయటికి రానీయకుండా ఎక్కడికక్కడ స్వీయ నియంత్రణ విధించింది. కరోనా తొలగిపోయింది. ఆ స్థాయిలో మరణాలు నమోదు అయిన తర్వాత ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నది. అయితే ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి కీలక విషయాలను బయటపెట్టారు అమెరికా జాతీయ నిఘా సంస్థ మాజీ సంచాలకురాలు తులసి గబ్బార్డు.

ఆమె తన పదవి నుంచి వై దొలుకుతూ సంచలన విషయాలను వెల్లడించారు. చైనాలో ఉన్న వూహాన్ ప్రయోగ కేంద్రానికి ఆంతోని పౌచి అనే వ్యక్తి నిధులు ఇచ్చారని ఆరోపించారు. కరోనా వ్యాధికి సంబంధించిన అసలు నిజాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటూ ఆమె మండిపడ్డారు. ఇప్పటికే కరోనా వైరస్ పుట్టుక.. ఆ వ్యాధికి సంబంధించిన వ్యాప్తి వంటి వాటిపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇది ఇలా ఉండగానే తులసి ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం విశేషం.

నాడు పౌచి అమెరికా అప్పటి అధ్యక్షుడు బైడన్ కు చీఫ్ మెడికల్ అడ్వైజర్ గా పని చేసేవారు. పౌచి చైనాలోని వూహాన్ ల్యాబ్ కు నిధులు పంపించారు. ఇక్కడి నుంచి కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందిందని విమర్శలు ఉన్నాయి. అయితే నాడు పౌచి అనేక రకాలుగా వ్యూహాలు రూపొందించారని.. అవన్నీ కూడా డీప్ స్టేట్ ప్లే బుక్ నుంచి వచ్చాయని ఆమె ఆరోపించారు. డీప్ స్టేట్ బుక్ అంటే తెరవెనక బలమైన శక్తులు ఉన్నాయని.. అని అర్థం.

తులసి ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలను చెప్పారు.. 2020లో అమెరికాలో కోవిడ్ వ్యాపి చెందినప్పుడు పౌచి వూహన్ ప్రయోగ కేంద్రంలో గబ్బిలాలకు ఇట్స్ ఓకే కరోనా వైరస్ లపై ప్రమాదకరమైన గేయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనల కోసం డబ్బులు చెల్లించాలని.. వీటిని అమెరికా పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించాలని తులసి ఆరోపించారు. వైరస్ లీకైన విషయాన్ని దాచడానికి పౌచి.. వేరే వ్యక్తులతో కలిసి పని చేశారని తులసి మండిపడ్డారు. మరోవైపు ఈ పరిశోధనల గురించి అధికారులతో జరిపిన చర్చలపై అమెరికన్ పార్లమెంటు ముందు పౌచి అబద్ధాలు చెప్పారని తులసి విమర్శించారు.

పౌచి వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలు.. ఈయన 38 సంవత్సరాల పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫక్షయస్ డిసీజెస్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఈయన పెద్ద పెద్ద సంస్థలతో చేతులు కలిపి రిస్కీ కరోనా వైరస్ పరిశోధనలకు డబ్బులు ఇచ్చారు. యూనివర్సల్ వ్యాక్సిన్ ల కోసం ఇదంతా చేశారని తులసి ఆరోపించడం విశేషం. అయితే తులసి ఈ స్థాయిలో ఆరోపణలు చేసినప్పటికీ ఇంతవరకు పౌచ్ నుంచి ఎటువంటి ఖండన రాకపోవడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular