Homeట్రెండింగ్ న్యూస్రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు.. ఈ వింత ఎక్కడ జరిగిందంటే..?

రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు.. ఈ వింత ఎక్కడ జరిగిందంటే..?

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. రాముడి విగ్రహం నుంచి కన్నీళ్లు వచ్చాయి. కారేపల్లి మండలం వెంకటయి తండాలోని రామాలయంలో ఉన్న రాముడి విగ్రహం నుంచి కన్నీళ్లు రావడం గమనార్హం. ఈ విషయం తెలిసిన ప్రజలు తండోపతండాలుగా ఆ గ్రామానికి వెళుతున్నారు. రాముడి కంటినుంచి కన్నీళ్లు రావడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలను ప్రస్తుతం కరోనా మహమ్మారి పీడిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి సమయంలో మున్ముందు మాన‌వజాతికి రాబోతున్న‌ మ‌రిన్ని క‌ష్టాల‌కు రాముడి కన్నీళ్లే సాక్ష్యమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన జరిగిన గ్రామంలో నివశించే తండా వాసులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ ఘటన వల్ల గ్రామానికి ఏదైనా అరిష్టం జరగవచ్చని గ్రామస్తులు భావిస్తుండటం గమనార్హం. మరి కొందరు రాముల వారికి ప్రత్యేక పూజలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

రాముడి విగ్రహం నుంచి కన్నీళ్లు వస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. గతంలో కూడా ఈ తరహా ఘటనలు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు తండాకు పెద్దఎత్తున వస్తున్నారు. ఈ ఘటన వల్ల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉండటం గమనార్హం. అయితే ఈ వింత ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు.

శ్రీరాముని మహిమల వల్లే కంటి నుంచి కన్నీళ్లు వస్తున్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామమైన వెంకటాయితండా పేరు ఈ ఘటన వల్ల మారుమ్రోగుతుండటం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular