
ఎంత చదువుకుంటే ఏం లాభం.. అమ్మాయి సొల్లు కబురు చెప్పగానే సొల్లు కార్చుకుంటూ వెళ్లిపోయే అబ్బాయిలు ఎందరో.. ఉన్నది పోయి.. పైసలు పోయి తరువాత లబోదిబోమనే వారు ఉన్నారు. అబ్బాయిలే కాదు.. ఇప్పుడు అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు. పెళ్లి సంబంధాల సైట్లలో మంచి బడాబాబులను చూసి ఎరవేసి దెబ్బ తీస్తున్నారు.
Also Read: ట్విట్టర్ ట్రెండింగ్స్: ఈ ఏడాది దీని గురించే వెతికారు
పేరుపొందిన కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరి చేతినిండా డబ్బు సంపాదించి యువకులు వైవాహిక జీవితంపై చాలా కలలుగంటారు. కుటుంబసభ్యులు, బందువుల మాటలను లెక్కచేయకుండా వెబ్సైట్లలో సంబంధాలను గాలిస్తూ వంచకుల చేతుల్లో మోసపోతున్నారు. అమాయక యువకులకు అర్ద నగ్న ఫోటోలు సేకరించి, వాటిని ఇంటర్నెట్లో పెడతామని బెదిరించడం, సాధ్యమైనంత దండుకోవడం వంటి కేసులు ఇటీవల తరుచూ పెరిగిపోతున్నాయి.
Also Read: కరోనా బారినపడ్డ స్టార్ హీరోయిన్
బర్కత్పురా ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఓ విదేశీ వధువు చేతిలో దారుణంగా మోసపోయాడు. వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కొన్నాళ్ల క్రితం సంగం.కామ్ అనే మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈయనకు ఇటీవల రీటాగా చెప్పుకున్న, ఆ పేరుతో రిజిస్టర్ చేసుకున్న యువతితో ఈ సైట్ ద్వారా పరిచయమైంది. రీటా అమెరికాలో డాక్టర్గా పని చేస్తున్నానంటూ చాటింగ్లో చెప్పింది. ఇలా వీరి పరిచయం పెరిగింది.
మరిన్ని వార్తల కోసం: వైరల్
ఆ తర్వాత రీటా.. నగర వాసి దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చింది. హఠాత్తుగా ఓ రోజు మన పరిచయానికి గుర్తుగా కొన్ని గిఫ్ట్లు పంపిస్తున్నానంటూ సందేశం పంపింది. ఆపై రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులుగా చెప్పుకుంటూ కొందరు నగర వాసికి కాల్ చేశారు. అమెరికా నుంచి మీ పేరుతో ఓ పార్శిల్ వచ్చిందని చెప్పారు. అందులో ఖరీదైన గిఫ్ట్లతో పాటు కొన్ని డాలర్లు సైతం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని హైదరాబాద్కు పంపాలంటే కస్టమ్స్ క్లియరెన్స్ తప్పనిసరని చెప్పారు. దానికోసం కొన్ని ట్యాక్సులు కట్టాల్సి ఉంటుందంటూ దఫదఫాలుగా బాధితుడి వద్ద నుంచి రూ.5 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో బాధితులు లబోదిబోమన్నాడు.
తాను మోసపోయాననే విషయం గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రీటాగా చెప్పుకున్న మహిళ +11తో మొదలయ్యే నంబర్తో వాట్సాప్ చాటింగ్ చేసింది. బాధితుడు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలన్నీ ఢిల్లీలో, సోనియా శర్మ పేరుతో ఉన్నాయి. వీటి ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.