Homeజనరల్జింకలను కారుతో ఢీ కొట్టి కోటీశ్వరుడైన వ్యక్తి.. ఏం జరిగిందంటే..?

జింకలను కారుతో ఢీ కొట్టి కోటీశ్వరుడైన వ్యక్తి.. ఏం జరిగిందంటే..?

మనిషి లైఫ్ లో అదృష్టం, దురదృష్టం కీలక పాత్రలు పోషిస్తాయి. అదృష్టం ఉన్నవారికి ఓవర్ నైట్ లో కోట్లు సంపాదించే అవకాశం ఉంటే దురదృష్టం వెంటాడితే ఓవర్ నైట్ లో కోట్లు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అమెరికాకు చెందిన వ్యక్తి ఊహించని విధంగా రాత్రికిరాత్రి కోటీశ్వరుడయ్యాడు. జింకను ఢీ కొట్టి కొత్త కారు పాడవటంతో బాధ పడ్డ ఆ వ్యక్తి కొన్ని గంటల్లోనే కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని నార్త్ కరోలినాలో ఆంటోనీ డోవ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగించేవాడు. కొన్ని రోజుల క్రితం డబ్బులను పొదుపు చేసి ఆ వ్యక్తి బ్రాండ్ న్యూ కారును కొనుగోలు చేశాడు. కొత్త కారును కొన్నానన్న ఆనందంలో కారును ఆంటోనీ వేగంగా డ్రైవ్ చేయగా అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన జింకలను కారు ఢీ కొట్టింది. జింకలకు గాయాలు కావడంతో పాటు కొత్త కారు పాడవటంతో ఆంటోనీ చాలా బాధ పడ్డాడు.

అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తరువాత ఆంటోనీ అంతకు ముందే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు ఫ్రైజ్ మనీ వచ్చింది. ఆ ఫ్రైజ్ మనీని తీసుకోవడానికి వెళ్లిన ఆంటోని అక్కడ మరో లాటరీ టికెట్ ను కొనుగోలు చేయగా ఆ టికెట్ కు కూడా ఫ్రైజ్ మనీ వచ్చింది. రెండు లాటరీ టికెట్లకు రెండు మిలియన్ డాలర్లు రావడంతో ఓవర్ నైట్ లో అతని జీవితమే పూర్తిగా మారిపోయింది.

పన్నులు, ఇతర ఖర్చులు పోగా అతని చేతికి 1.4 మిలియన్ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో 10.2 కోట్ల రూపాయలు వచ్చాయి. నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ ఈ వివరాలను మీడియాకు తెలిపింది. వచ్చిన డబ్బుతో తన తల్లిదండ్రుల ఇంటిని రిపేర్ చేయిస్తానని.. కారును రిపేర్ చేయించుకుంటానని ఆంటోనీ తెలిపారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular