Homeఎంటర్టైన్మెంట్IT Attacks On Pushpa 2 Producers: పుష్ప 2 నిర్మాతలపై ఐటీ దాడులకు కారణం...

IT Attacks On Pushpa 2 Producers: పుష్ప 2 నిర్మాతలపై ఐటీ దాడులకు కారణం అదేనా? వందల కోట్ల పెట్టుబడి వెనుక ఎవరున్నారు?

IT Attacks On Pushpa 2 Producers
IT Attacks On Pushpa 2 Producers

IT Attacks On Pushpa 2 Producers: టాలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నివాసాలు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ అధికారుల బృందాలు దాడులు చేశాయి. నేటి ఉదయం నుండి ఈ సోదాలు జరుగుతున్నాయి. వీరి నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న పుష్ప 2 చిత్ర దర్శకుడిగా ఉన్న సుకుమార్ మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. ఆయన కార్యాలయంలో, నివాసంలో సోదాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా అవతరించిన మైత్రీ మూవీ మేకర్స్ పై జరుగుతున్న ఈ దాడులు పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

అధికారుల దాడులకు ప్రధాన కారణం మనీ లాండరింగ్ అని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రాలకు సంబంధించిన పెట్టుబడుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారుల అనుమానిస్తున్నారట. ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అక్రమ సంపాదన మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా సినిమాల్లో పెట్టుబడి పెట్టిస్తున్నారట. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఏపీకి చెందినవారు కాగా మరొకరు తెలంగాణా ఎమ్మెల్యే అట. ఇద్దరిలో ఒకరు మైనింగ్ కింగ్ గా ఉన్నారట. అమెరికాలో కూడా వ్యాపారాలు చేస్తున్నారట.

IT Attacks On Pushpa 2 Producers
IT Attacks On Pushpa 2 Producers

మనీ లాండరింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకే మైత్రీ నిర్మాణ సంస్థ మీద ఐటీ అధికారులు దాడులు నిర్వహించారట. అయితే మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని ఒక సాధారణ తనిఖీగా అభివర్ణిస్తున్నారు. మా సంస్థ అకౌంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఈ సంక్రాంతికి మా నిర్మాణ సంస్థలో తెరకెక్కించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విజయాలు సాధించాయి. అలాగే పుష్ప 2 చిత్ర నిర్మాతలుగా ఉన్నాము.

ఈ క్రమంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మా సంస్థ పెట్టుబడుల్లో ఎలాంటి అవకతవకలు లేవని చెప్పుకొస్తున్నారు. 2015లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ స్థాపించారు. మొదటి చిత్రమే మహేష్ బాబు హీరోగా నిర్మించారు. వీరి ఫస్ట్ వెంచర్ శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. జనతా గ్యారేజ్, రంగస్థలం ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ తో టాప్ పొజిషన్ కి వచ్చారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి భాగస్వాములుగా ఈ సంస్థ ప్రారంభమైంది. ఓ మూడేళ్ళ క్రితం మోహన్ చెరుకూరి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం నవీన్, రవి శంకర్ కలిసి చిత్రాలు నిర్మిస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular