Homeజాతీయ వార్తలుZojila Tunnel: కాశ్మీర్, లద్దాఖ్, ఓ జోజిలా.. దేశంలోనే అతిపెద్ద సొరంగాన్ని మోడీ ఎందుకు నిర్మించాడు?

Zojila Tunnel: కాశ్మీర్, లద్దాఖ్, ఓ జోజిలా.. దేశంలోనే అతిపెద్ద సొరంగాన్ని మోడీ ఎందుకు నిర్మించాడు?

Zojila Tunnel
Zojila Tunnel

Zojila Tunnel: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కాశ్మీర్, లద్దాఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. వాటి అభివృద్ధి కోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఆ ప్రాంతాల రూపురేఖలు సమూలంగా మార్చేస్తోంది. భౌగోళికంగా శ్రీనగర్ _ లేహ్ మధ్య ఉన్న ఒకటో నెంబర్ జాతీయ రహదారి భారతదేశానికి అత్యంత ముఖ్యమైనది. అయితే ఈ రోడ్డుపై భారత ప్రభుత్వం 25 వేల కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నది. ఇందులో భాగంగా 19 సొరంగాలను నిర్మిస్తోంది. ఈ సొరంగంలో ఒకదానికి జడ్ మోర్ పేరు పెట్టారు. 6.5 కిలోమీటర్లు పొడవున ఈ సొరంగం ఉంటుంది. 19 సొరంగాలలో ఇది అతి పెద్దది. దీనికోసం 2,680 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు జమ్ము కాశ్మీర్, లద్దాఖ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు జోజిలా టన్నెల్ నిర్మిస్తున్నారు.

జోజిలా టన్నెల్ వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం.. ఇది ఆసియాలోనే అతిపెద్దది. దీని పొడవు 14.15 కిలోమీటర్లు. 7.57 మీటర్ల ఎత్తులో ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. దీనికోసం సుమారు 6,800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో వాహనాలు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని చెబుతున్నారు.

కాశ్మీర్లో భౌగోళిక వాతావరణం దుర్భేద్యంగా ఉంటుంది. ఇలాంటప్పుడు రహదారులు చాలా నాణ్యంగా ఉండాలి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అక్కడ రహదారుల మీద భారీగా ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తోంది.. కాశ్మీర్లోని గాంధార్బల్, లద్దాఖ్ లోని జిల్లా డ్రాస్ పట్టణానికి మధ్యలో జోజిలా పాస్ ఉంది. ఈ పాస్ లోని కొండలను తొలచి జోజిలా టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా జెడ్ మోర్ తమిళ్ మార్గాన్ని జోజిలా టన్నెల్ తో అనుసంధానం చేయవచ్చు. ఈ రెండు టన్నెళ్లకు మధ్య 18.475 కిలోమీటర్ల హైవే అభివృద్ధి చేస్తున్నారు. అవసరం మేరకు మూడు కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరుగుతున్నాయి. మిగతా మార్గాన్ని కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ హైవేలో 5 వంతెనలు, రెండు స్నో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.

Zojila Tunnel
Zojila Tunnel

ఇక ప్రస్తుతం శ్రీ నగర్ నుంచి లద్దాఖ్ లెహ్ చేరుకోవాలంటే 10 గంటల సమయం పడుతుంది. ఈ మార్గంలో వాతావరణం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. పైగా ఎత్తైన జో జి లా పాస్ పర్వత మార్గం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ ప్రయాణానికి దాదాపు మూడు గంటల వరకు సమయం పడుతుంది.. జోజిలా టన్నెల్ అందుబాటులోకి వస్తే 20 నిమిషాలే పడుతుందని అధికారులు చెబుతున్నారు. చలికాలంలో జోజిలా వద్ద మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. కొండ చరియలు విరిగి పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాహనాలు కూడా రోడ్లమీద నుంచి జారీ అదుపుతప్పుతుంటాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలు నిలిపివేస్తారు. దీంతో కనీసం ఐదు నెలల పాటు దేశంలోని మిగతా భూభాగంతో ప్రజలకు సంబంధాలు తెగిపోతాయి. అలాంటప్పుడు ప్రజలకు విమాన ప్రయాణమే దిక్కు. అందుకే ఈ టన్నెల్ ను ప్రతిపాదించారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే అన్ని కాలాల్లోనూ కాశ్మీర్ వాసులు సులభంగా ప్రయాణం సాగించవచ్చు. ఇక ఈ సొరంగ మార్గం నిర్మాణంలో స్మార్ట్ టన్నెల్ వ్యవస్థ వాడుతున్నారు. ఇందులో భాగంగా న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ అనుసరిస్తున్నారు. ఈ విధానంలో సీసీటీవీ, రేడియో కంట్రోల్, నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ సౌకర్యం ఉంటాయి. ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వానికి ఐదువేల కోట్ల వరకు ఆదా అయ్యాయని తెలుస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Oktelugu Epaper