Homeజాతీయ వార్తలుZojila Tunnel Project: దేశ సరిహద్దులో రహస్య టన్నెల్‌.. నిర్మాణం పూర్తయితే చైనాకు చుక్కలే!

Zojila Tunnel Project: దేశ సరిహద్దులో రహస్య టన్నెల్‌.. నిర్మాణం పూర్తయితే చైనాకు చుక్కలే!

Zojila Tunnel Project: ప్రపంచ దృష్టి పశ్చిమాసియా యుద్ధం, శాంతి చర్చలపై ఉంది. దేశ ప్రజల దృష్టి ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వాటి ఫలితాలపై ఉంది. ఈ సమయంలో కేంద్రం దేశ సరిహద్దులో మొదలు పెట్టిన ఓ పనిని పూర్తిఛేసే దిశగా చర్యలు చేపట్టింది. లద్దాక్‌లో కీలక టన్నెల్‌ పనులను దాదాపు ముగించబోతోంది. బాల్క్‌ నుంచిమీనామార్గ్‌ వరకు 13 కిలోమీటర్ల పొడవైన జోజులా పర్వతాన్ని తవ్వుతూ, రోజుకు 4 మీటర్ల వేగంతో పనులు జరుగుతున్నాయి. మే 30 […]

Zojila Tunnel Project: ప్రపంచ దృష్టి పశ్చిమాసియా యుద్ధం, శాంతి చర్చలపై ఉంది. దేశ ప్రజల దృష్టి ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వాటి ఫలితాలపై ఉంది. ఈ సమయంలో కేంద్రం దేశ సరిహద్దులో మొదలు పెట్టిన ఓ పనిని పూర్తిఛేసే దిశగా చర్యలు చేపట్టింది. లద్దాక్‌లో కీలక టన్నెల్‌ పనులను దాదాపు ముగించబోతోంది. బాల్క్‌ నుంచిమీనామార్గ్‌ వరకు 13 కిలోమీటర్ల పొడవైన జోజులా పర్వతాన్ని తవ్వుతూ, రోజుకు 4 మీటర్ల వేగంతో పనులు జరుగుతున్నాయి. మే 30 నాటికి మిగిలిన 300 మీటర్లు పూర్తి చేయబోతున్నారు. దీనికి న్యూ ఆస్ట్రియన్‌ టన్నెలింగ్‌ పద్ధతి వాడుతున్నారు.

365 రోజుల కనెక్టివిటీ కోసం..
అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు జోజులా పాస్‌ మంచుతో కప్పిపోతూ, శ్రీనగర్‌–లద్దాక్‌ మార్గం మూసుకుపోతుంది. స్థానికులు ఆహారం, మందులు నిల్వ చేసుకుంటారు; సైన్యం ఇంటర్‌–కంటినెంట్‌ ప్లాన్లతో స్వయం సమృద్ధిగా ఉంటుంది. ఈ టన్నెల్‌ పూర్తయితే, 365 రోజులు వాహనాలు, భారీ ఆయుధాలు తరలింపునకు వీలవుతుంది. ప్రస్తుతం 29 కి.మీ./గం వేగం 70 కి.మీ./గం అవుతుంది. దూరం, ఖర్చు గణనీయంగా తగ్గుతాయి.

చైనా సవాళ్లకు దీటుగా..
2018 నుంచి చైనా లద్దాక్‌ భూభాగాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది, భారత్‌ ధైర్యంగా తిప్పికొట్టింది. ఈ ప్రాజెక్ట్‌ చైనా–పాక్‌ సరిహద్దుల్లో సైనిక ఉద్దీపనను బలోపేతం చేస్తుంది. హిమాచల్‌ నుంచి దక్షిణ లద్దాక్‌కు ఆధార మార్గం (నిము–పదుమ్‌–దార్చా) జోజులాను మరింత కీలకం చేస్తుంది. శింకు లా టన్నెల్‌ (4.1 కి.మీ., 15,800 అడుగుల ఎత్తు) కూడా హిమాచల్‌–లద్దాక్‌ కనెక్ట్‌ను లింక్‌ చేస్తుంది.

ఈ ఇన్‌ఫ్రా పుష్‌ రక్షణ భద్రతను పెంచడమే కాక, వాణిజ్యం, పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. బిలాస్పూర్‌–మనాలీ–లెహ్‌ రైలు (రూ.1.31 లక్షల కోట్లు), లెహ్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ (రూ.640 కోట్లు)లతో కలిపి లద్దాక్‌ ’ట్సునామి ఆఫ్‌ డెవలప్‌మెంట్‌’కు సాక్షియైంది. రూ.20,660 కోట్లు రోడ్లకు కేటాయించారు. బీఆర్‌వో ప్రాజెక్ట్‌ విజయక్‌లో లెహ్‌–చాలుంకా, కార్గిల్‌–డుమ్గిల్‌ మార్గాలు మెరుగయ్యాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper