spot_img
Homeఆధ్యాత్మికంAmarnath Shivling : పౌర్ణమికి పెరుగుతుంది.. అమావాస్యకు తగ్గుతుంది.. అమర్నాథ్ మంచు శివలింగం వెనక అంతు...

Amarnath Shivling : పౌర్ణమికి పెరుగుతుంది.. అమావాస్యకు తగ్గుతుంది.. అమర్నాథ్ మంచు శివలింగం వెనక అంతు చిక్కని మిస్టరీ

Amarnath Shivling : మనదేశంలో స్వయంభు శైవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ శివుడిని రకరకాల పేర్లతో భక్తులు పిలుస్తారు. ఇక్కడ ఏర్పడిన శివలింగాల వెనుక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వీటి స్థల పురాణాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రతి స్థల పురాణానికి బలమైన నేపథ్యం ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి.. ఆయా క్షేత్రాలలో కైలాస వాసుడికి ఘనమైన పూజలు జరుగుతుంటాయి.

శైవ క్షేత్రాలలో శివుడు స్థిరమైన రూపంతో కలిగి ఉంటాడు. కానీ మనదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని అమర్నాథ్ ప్రాంతంలో మాత్రం శివుడి రూపం కేవలం కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. వర్షాకాలం సీజన్ పరమైన తర్వాత అమర్నాథ్ ప్రాంతంలో శివుడి లింగం ఏర్పడుతూ ఉంటుంది. అది కూడా అత్యంత సహజంగా ఉంటుంది.. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కైలాస క్షేత్రం ఉందని.. అక్కడ శివుడు ధ్యానముద్రలో ఉంటాడని.. ఆ క్షేత్రానికి వెళ్లడం సాధ్యం కాదని.. ఇప్పటికే అనేక పర్యాయాలు చాలామంది ప్రయత్నించినప్పటికీ కఠినమైన వాతావరణం వల్ల వెనక్కి తిరిగి వచ్చారని వార్తలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఇప్పటికీ మంచు రూపంలో శివలింగం ఏర్పడే విధానం ఒక మిస్టరీగానే ఉంటుంది. జమ్ము కాశ్మీర్లోని అమర్నాథ్ గుహ ప్రాంతంలో ఈ శివలింగం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడి అమర్నాథ్ గుహ సముద్రమట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏ గుహ పైకప్పు భాగం దృఢంగా ఉంటుంది. ఈ భాగంలో సున్నపురాయి.. జిప్సం వంటి శిలలు ఉంటాయి. హిమాలయ ప్రాంతాల్లో ప్రవహించే నదులు.. కొండల ప్రాంతంలో ఉన్న మంచు కరిగిపోతున్నప్పుడు.. ఆ నీరు మొత్తం బండరాళ్ల పగుళ్ల మీదుగా గుహలోకి వెళ్తూ ఉంటుంది. అధి కాస్త చుక్కలు చుక్కలుగా కారి.. శివుడి లింగం మాదిరిగా ఏర్పడుతూ ఉంటుంది.

అమర్నాథ్ గుహలో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా ఉంటాయి.. ఇవి మైనస్ డిగ్రీలలో ఉంటాయి. అక్కడ నీటి బిందువులు పడగానే.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల వెంటనే గడ్డ మాదిరిగా మారిపోతాయి.

ఇలా చుక్కలు చుక్కలుగా పడిన మంచు బిందువులు ఒకదానిపై ఒకటి వేరుకొని పోతూ ఉంటాయి. అలా పైకి లింగం మాదిరిగా ఎదుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజులపాటు జరుగుతూ ఉంటుంది. ఫలితంగా అది ఒక మంచు స్థంభం మాదిరిగా మారిపోతుంది. అది చూసేందుకు శివలింగంలాగా కనిపిస్తూ ఉంటుంది.

శివలింగం కాలాలకు అనుగుణంగా పెరుగుతుంది. అదే సమయంలో తగ్గిపోతూ ఉంటుంది. సరిగ్గా మే నెల నుంచి ఆగస్టు కాలం వరకు శివలింగం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజుకు మరింత పెద్దదిగా మారుతుంది. అమావాస్య సమయంలో ఆ పరిమాణం తగ్గుతూ ఉంటుంది. అయితే ఆ మంచు శివలింగం పక్కనే చిన్న చిన్న రూపాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని పార్వతి, వినాయకుడు, భైరవుడు అని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆగస్టు నెల తర్వాత అమర్నాథ్ యాత్ర ముగిసిపోతుంది. అప్పటికి శివలింగం క్రమంగా మాయమవుతుంది. అయితే వేలాదిమంది భక్తులు ఒకేసారి గుహలోకి వచ్చినప్పుడు వారి శరీరాల నుంచి వేడి వస్తుంది. ఫలితంగా మంచు కరిగిపోతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular