spot_img
Homeటాప్ స్టోరీస్KCR and KTR: కెసిఆర్ బస్సు మీద.. కేటీఆర్ రోడ్డు మీద.. చివరికి గులాబీ పార్టీ...

KCR and KTR: కెసిఆర్ బస్సు మీద.. కేటీఆర్ రోడ్డు మీద.. చివరికి గులాబీ పార్టీ పరిస్థితి ఇలా మారింది

KCR and KTR: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. జాతీయ పార్టీగా ఎదిగేందుకు కలలు కన్నది. ఆంధ్ర ప్రదేశ్లో శాఖను కూడా ఏర్పాటు చేసింది. తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిని చేసింది. ఏపీలో కార్యాలయం కూడా ప్రారంభించింది. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేయడానికి కూడా సింగరేణి ముందు వరుసలో నిలిపింది. ఇలా ఎన్నో చేసింది. కానీ సొంత రాష్ట్రంలోని గెలవలేకపోయింది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పంజాబ్, బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించారు. అక్కడి రైతులకు చెక్కులు కూడా ఇచ్చారు. ఇలా ఎన్నో రకాలుగా జాతీయ వాదాన్ని ఆయన వినిపించారు.

చివరికి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి భారతదేశంలో అధికారంలోకి రాలేకపోయింది. సొంత రాష్ట్రమైన తెలంగాణలో పట్టు నిలుపుకోలేకపోయింది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితం అయిపోయింది. రాజకీయంగా తీవ్రమైన ఒడిదుడులను ఎదుర్కొంటున్నది. మరోవైపు పార్టీ నుంచి కవిత వెళ్లిపోయింది. గులాబి పార్టీకి బలంగా ఉన్న తెలంగాణ పేరును తన పార్టీకి పెట్టుకుంది. అటు తెలంగాణ వాదాన్ని దూరం చేసుకోవడం.. జాతీయ రాజకీయాల మోజులో పడి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కెసిఆర్ పరిస్థితి దారుణంగా మారింది.

2027 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి గులాబీ పార్టీ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసిఆర్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఇప్పుడు పాదయాత్ర చేసే అవకాశం లేదు. అప్పట్లో తెలంగాణ మూమెంట్ సాగుతున్నప్పుడు ఆయన కొద్ది రోజులపాటు పాదయాత్ర చేశారు. అయితే ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి వయసు రీత్యా ఆయన పాదయాత్ర చేసే అవకాశం లేదు.

వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన ఆయన ఇప్పుడు బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. కార్యకర్తలను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలబృతం చేసేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. దీనికోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మన వైపు కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తారని సమాచారం. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు.

అటు తండ్రి.. ఇటు కొడుకు రెండు వ్యూహాలతో ఒకేసారి జనంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యాత్రలకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ వస్తుందని సమాచారం. ఇప్పటికే పార్టీలోని కీలక నాయకులకు కేసిఆర్.. కేటీఆర్ వర్తమానం పంపారని.. కొద్దిరోజులుగా దీని గురించి చర్చలు జరుగుతున్నాయని.. సమాచారం. ఇటీవల కేటీఆర్ మలేషియా వెళ్లారు. అక్కడ జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.. గతంలో కూడా కేటీఆర్ తన పాదయాత్ర గురించి బయటకు చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా కెసిఆర్ నుంచి మీడియాకు లీకులు వస్తున్న నేపథ్యంలో.. కచ్చితంగా పాదయాత్ర.. బస్సు యాత్ర ఉంటుందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper