CM Revanth Reddy: మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్న నినాదం తెలంగాణలో వర్కవుట్ అయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐదు రోజుల క్రితం రేవంత్ సీఎంగా ప్రమాణం చేశారు. 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఫైర్బ్రాండ్ రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు పాలన చూసుకుంటూనే.. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు.
పిలవగానే వచ్చి..
ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్రెడ్డి.. ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే ఓ మహిళా తెలుగు జర్నలిస్టు రేవంత్సార్.. ఒక్క ఫొటో అని కోరింది. స్పందించిన సీఎం వెంటనే కారు ఎక్కకుండానే వెనక్కి వచ్చారు. ఆమెతో ఫొటో దిగి కారులో వెళ్లిలపోయారు.
తాజాగా నడిచి వచ్చిసాయం..
తాజాగా ’రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలి’ అంటూ ఓ మహిళ పిలవగానే సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించారు. యశోద ఆస్పత్రిలో ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. తిరిగి వెళ్తుండగా మహిళ రేవంత్ రెడ్డిని పిలిచారు. వెంటనే ఆమె దగ్గరకి వెళ్లి సమస్య ఏంటో చెప్పాలని అడిగారు. తన పాపకు ఆస్పత్రి ఖర్చు చాలా అవుతోందని, సాయం చేయాలని కోరింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఈ వీడియో వైరల్ అవుతోంది.
సీఎంగా, పార్టీ చీఫ్గా ప్రస్తుతం రెండు విధులు నిర్వహిస్తున్న రేవంత్ ఇప్పుడు ప్రజల పిలుపుకు స్పందించడం, ఆవీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. దటీజ్ రేవంత్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
CM Revanth Responded to the Grievance of Common People Issue Quickly
రేవంత్ అన్న అంటూ పిలిచి సమస్య చెప్పుకున్న మహిళ.
— వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.Revanth was called by a women Quoted him ‘Revanth Anna’ and told her the… pic.twitter.com/p0zML3KrWW
— Congress for Telangana (@Congress4TS) December 10, 2023