Telangana Vimochana Dinothsavam : భారత దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17 వరకు నిజాం పాలనలోనే కొనసాగింది. అయితే ఈ సమయంలో రజాకార్లు సాగించిన దాష్టీకాలనికి తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో కలిపేందుకు కేంద్ర తొలి హోం మంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ నిర్ణయించారు. ఈమేరకు ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టారు. రంగంలోకి దిగిన భారత సైన్యానికి నిజాం తల వచ్చారు. దీంతో 1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. దీనిని తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని ఏటా.. ఉద్యమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కూడా డిమాండ్ చేసింది. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విమోచన దినం అనే పదం ఎత్తడానికి కూడా సాహసించలేదు. పదేళ్లు తెలంగాణ విమోచన దినం నిర్వహించలేదు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More