riva
”ఆ భూమిని మర్చిపో లేదంటే కాల్చి చంపుతాం.’ అంటూ అర్ధరాత్రి ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కొందరు గన్తో బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి మరుసటి ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని నిదానపురం దేవయ్య పోలీసులకు తనను అర్ధరాత్రి తుపాకితో బెదరించారని తెలపడంతో పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. వేగంగా స్పందించిన వారు కొందరిపై అనుమానించి వాళ్లను విచారించగా నిజం బయటపెట్టారు. ఆ ఆగన్ ఎక్కడిదని అడగగా బొమ్మ తుపాకీ అని చెప్పారు. అయితే పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టుల సంచరిస్తురన్నారన్న నేపథ్యంలో ఈ ఘటన వెనుక ఇంకెవరైనా ఉన్నారా అని విచారణ జరుపుతున్నారు.