
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,050 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,56,713 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,401గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,38,908 మంది కోలుకోగా ప్రస్తుతం 16,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 13,867 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. కాగా గత రోజుకు పోల్చుకుంటే కేసుల సంఖ్య నిలకడగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు 48,53,169 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యశాఖ తెలిపింది.