దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘునందర్ రావు ఈనెల 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య గెలుపొందిన బీజేపీ అభ్యర్థి చివరి వరకు జరిగిన కౌంటింగ్ లో 1,079 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో 18న మధ్యాహ్నం ఒంటి గంటకు దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో అసెంబ్లీలో బీజేపీ సభ్యుల సంఖ్య రెండుకు చేరుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. రఘునందన్ రావు గెలుపుతో తెలంగాణలో బీజేపీకి బలం పెరిగినట్లయింది. త్వరలో జరిగే హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవాలని ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికా రచిస్తోంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం రఘునందన్ రావు సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొననున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Raghunandan rao was sworn as dubbaka mla in 8th
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com