murderd
మద్యం మత్తులో తల్లిని చంపేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామంలో పుట్ట చంద్రమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తన భార్యా పిల్లలతో కలిసి ఉంటుండగా చిన్న కుమారుడు రాములు తల్లితో కలిసి ఉంటున్నాడు. కొన్ని రోజులుగా రాములు మద్యానికి బానిసయ్యాడు. తాజాగా మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో చంద్రమ్మ తల నరికిన రాములు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న కొల్లాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.