తెలంగాణలో దుబ్బాక ఎన్నికల సమయం నుండి పోలీసులు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. అప్పటి నుండి ఏదో ఒక విషయంలో పోలీసులను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్కు మరోసారి సవాల్ విసిరారు. ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. రోజుకు 10 నుంచి 15 ట్రక్కుల్లో గోవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.