ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గురువారం మధ్యాహ్నం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్కు ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ తదితరులు బుధవారం సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో వాటి నిమిత్తమై సీఎం కేసీఆర్ సోమాజిగూడలోని యశోదకు వెళ్లనున్నారు.