Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్జియాగూడలో భారీగా ఓట్ల గల్లంతు..!

జియాగూడలో భారీగా ఓట్ల గల్లంతు..!

GHMC ELECTION-2020

జీహెచ్ఎంసీ పోలింగ్ ఇప్పటి వరకు సాఫీగా జరుగుతోంది. జియాగూడ పోలింగ్ బూత్ నెంబర్ 38 లో ఓట్లు గల్లంతయ్యాయి. ఆ బూత్ పరిధిలో 914 ఓట్లు ఉంటే 657 ఓట్లు గల్లంతైనట్లు సమాచారం. ఆర్కేపురంలో
ఆయా పార్టీల నాయకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది. నగరంలోని ఆర్కేపురంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యక్ర్తల మధ్య వాగ్వాదం చోటు చరేసుకుంది. ఓటరు స్లిప్పులు ఇచ్చే చోట టీఆర్ఎస్ నేతలు బ్యానర్ పెట్టి ప్రచారం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మరోవైపు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular