గ్రేటర్ ఫలితాలు టీఆర్ఎస్కు చెంపపెట్టు : జీవన్రెడ్డి
Written By:
Suresh , Updated On : December 5, 2020 3:22 pm
Follow us on
గ్రేటర్ ఫలితాలు చూసైనా టీఆర్ఎస్ కళ్లు తెరవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సూచించారు. 100 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావాల్సింది.. అకాల వర్షాలతో 50 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేలా లేదన్నారు. ధాన్యం సేకరణలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. రబీ సాగు ప్రారంభమైనా రెండో విడత రైతుబంధు ఊసేలేదని విమర్శించారు. హిందూ వారసత్వ పక్రియను ప్రభుత్వం నిలిపివేసిందని వ్యాఖ్యానించారు.