
తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,637 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,44,1436 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,357గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,24,688 మంది కోలుకోగా ప్రస్తుతం 18,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 15,335 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 292 కేసులు నమోదయ్యాయి. కాగా గత రోజులుకు పోల్చుకుంటే కేసుల సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.