
అనారోగ్యం కారణంగా బాధపడుతూ మెరుగైన వైద్య సేవలు పొందుతున్న బాధితులకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందన్నారు. దీనిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.