జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.గత అసెంబ్లీ సమావేశాల ముందు కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. మంగళవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన సంజయ్ మరోమారు టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్గా నిర్దారణ అయింది. అయితే నిన్న ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు శుభాకంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్యే సంజయ్ కూడా ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకుల్లో ఆందోళన నెలకొంది.