
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 873 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,63,526 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,430గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,50,453 మంది కోలుకోగా ప్రస్తుతం 11,643 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 9,345ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. కాగా 24 గంటల్లో 41,646 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు స్వల్పంగా కేసులు తగ్గాయి. పట్టణాలో స్వల్పంగా కేసులు నమోదు కావడంతో జాగ్రత్తలుపాటించాల్సిందేనని వైద్యాధికారులు సూచిస్తున్నారు.