
తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 805 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,69,223 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,455గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,57,278 మంది కోలుకోగా ప్రస్తుతం 10,490 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాతావరణంలోమార్పుల కారణంగా నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు పెరిగాయి.