Homeక్రీడలుక్రికెట్‌Zimbabwe vs India : తిప్పేసిన వాషింగ్టన్ సుందర్..భారత్ కు మరో విజయం

Zimbabwe vs India : తిప్పేసిన వాషింగ్టన్ సుందర్..భారత్ కు మరో విజయం

Zimbabwe vs India : ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా.. వరుస విజయాలు సాధిస్తోంది. బుధవారం హారారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్లో సమష్టిగా రాణించి.. 23 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టును ఓడించింది. ఈ గెలుపు ద్వారా టీమిండియా ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తేడాతో లీడ్ లో కొనసాగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది.. కెప్టెన్ గిల్ (49 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్ లతో 66) అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. రుతు రాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లతో 36) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.. జింబాబ్వే బౌలర్లలో ముజరబని(2/25), సికిందర్ రజా(2/24) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 రన్స్ చేసింది. మైర్స్(40 బంతుల్లో ఐదు ఫోర్ లతో 43*) మదండే(26 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో 37) టాప్ స్కోరర్ లుగా నిలిచారు. మిగతా ఆటగాళ్లు మొత్తం పూర్తిగా నిరాశపరిచారు. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. ఆవేష్ ఖాన్(2/22) రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఖలీల్ అహ్మద్ (1/15) ఒక వికెట్ పడగొట్టాడు.

భారత్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన జింబాబ్వే జట్టుకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది.. ఆవేష్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో మధేవెర్( 1) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ ఖలీల్ అహ్మద్ వేశాడు. అతడి ఓవర్లో మారుమని(13) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన బెన్నెట్(3) ను ఆవేష్ ఖాన్ పెవిలియన్ పంపించాడు. దీంతో నిండా 20 పరుగులు చేయకముందే జింబాబ్వే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మైర్స్, సికిందర్ రజా(15) స్థిరంగా ఆడారు. ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసే నాటికి జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయి, 37 రన్స్ చేసింది.

ఈ దశలో బంతి అందుకున్న సుందర్ ఒకే ఓవర్లో మ్యాజిక్ చేశాడు.. ప్రమాదకరంగా మారుతున్న సికిందర్ రజా(15), కాంప్ బెల్(1) ను అవుట్ చేశాడు. ఈ దశలో 39 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జింబాబ్వే దారుణమైన ఓటమి అంచనా నిలిచింది. ఈ పరిస్థితిలో మదండే, మైర్స్ భారత బౌలర్లను బలంగా ప్రతిఘటించారు. ఏకంగా ఆరో వికెట్ కు 77 పరుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో మదండే ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు.. మదండే ఔట్ అయినప్పటికీ.. మరో ఎండ్ లో ఉన్న మైర్స్ ఒంటరి పోరాటం చేశాడు.. అప్పటికే సాధించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడం.. ఓవర్లు కరిగిపోవడంతో.. జింబాబ్వే జట్టుకు మరో ఓటమి తప్పలేదు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular