ఆమె పేరు రితిక శ్రీ. పుట్టగానే ఆమె ఆడపిల్ల కాదు. అతడి అసలు పేరు ముత్తు రాజా.. జన్మతహ: పురుషుడు. ముత్తు రాజా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చదివాడు. అప్పట్లో అతడు మొహాలీ ప్రాంతంలో ఒక కాల్ సెంటర్లో పని చేసేవాడు.. అప్పుడప్పుడు ఖాళీ సమయం దొరికితే ఐపీఎల్ మ్యాచులు చూసేవాడు. కరోనా సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో క్రికెట్ అంపైరింగ్ చేయాలని అతనిలో కోరిక కలిగింది. ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి సమాచారాన్ని సేకరించాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా అంపైర్ల కమిటీ చైర్మన్ జయ రామన్ ను కలిశాడు. దీంతో అతని కెరియర్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది.
ముత్తరాజకు అనేకమంది డిస్టిక్ ప్యానల్ లో ఉన్న అంపైర్లు పాటలు చెప్పడం మొదలుపెట్టారు. ముత్తు రాజా చూసేందుకు పురుషుడి లాగా కనిపిస్తున్నప్పటికీ.. అతడు స్త్రీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. అందువల్లే ఆ విషయాలను బయట పెట్టడానికి ముత్తరాజ ఇబ్బంది పడేవాడు. అయితే తన ఇబ్బందిని జయరామన్ కు చెప్పాడు ముత్తు రాజా. దీంతో వారు అతని బాధను అర్థం చేసుకొని.. ఒప్పుకున్నారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ముత్తు రాజా కాస్త రితిక శ్రీగా మారిపోయింది. చికిత్స చేయించుకొని పూర్తి స్త్రీగా మారిపోయింది. ఆ ఏడాది నుంచి రితిక శ్రీ మైదానంలోకి అడుగు పెట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని క్రికెట్ సంఘం స్టేట్ అంపైర్ ప్యానెల్ కు ఆహ్వానం పలికే దరఖాస్తులలో థర్డ్ జండర్ కాలం చేర్చడం తానుపడిన కష్టానికి గుర్తింపు అని రితిక శ్రీ చెబుతోంది.
రితిక శ్రీ మనదేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ అంపైర్. ఈ మధ్య తమిళనాడులోని సేలం జిల్లా. 2021 నుంచి సేలం, కోయంబత్తూరు సర్క్యూట్ ప్రాంతంలో అంపైరింగ్ చేస్తోంది. రితిక శ్రీ ప్రస్తుతం కోయంబత్తూర్ జిల్లాలోని క్రికెట్ సంగం లీగ్ లో మ్యాచ్ అధికారిగా కూడా పనిచేస్తోంది.. “నా శరీరంలో అనేక మార్పులు జరిగేవి. ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఎవరికి చెప్పాలో కూడా తెలిసేది కాదు. ఎందుకిలా అవుతోందా కూడా అర్థమయ్యేది కాదు.. జయరామన్ కు నా బాధ చెప్పగానే అర్థం చేసుకున్నారు. చివరికి నన్ను ఇలా మార్చారని” రితిక శ్రీ చెబుతోంది.