Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. గతంలో ఒంటి చేత్తో జట్టును గెలిపించిన ఘనత సాధించిన కోహ్లి ప్రస్తుతం తడబడుతున్నాడు. కొద్ది రోజులుగా తన టాలెంట్ నిరూపించుకోవడం లేదు. ఫలితంగా అభిమానులను నిరాశపరుస్తున్నాడు. తన భవితవ్యం ప్రశ్నార్థకంలో పడేస్తున్నాడు. దీంతో అతడి ప్రదర్శనపై అందరికి అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఆటలో వైవిధ్యం చూపించడం లేదు. విరాట్ తీరుతో టీమిండియాపై పెను ప్రభావమే పడుతోంది.

దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉంచినా విరాట్ కోహ్లిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో అతడిని త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే జట్టుకు ఎంపిక చేసేందుకు జట్టు యాజమాన్యం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో కూడా విరాట్ పసందైన ప్రదర్శన చేయలేదు. ఫలితంగా ఓటమి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిని చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో విరాట్ భవిష్యత్ అంధకారంలో పడనుంది.
Also Read: Acharya Koratala Shiva: ‘ఆచార్య’తో నష్టపోయిన వారికి ఆస్తులమ్మి చెల్లిస్తున్న కొరటాల శివ!?
వెస్టిండీస్ లో జులై 22 నుంచి 29 వరకు మూడు వన్డీలు ఆడనుంది. జులై 29 నుంచి ఆగస్టు 7 వరకు టీ 20, టెస్ట్ మ్యాచులు ఆడటానికి వెళ్తోంది. ఇందులో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. విరాట్ తో పాటు రిషబ్ పంత్, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. ఈ పర్యటనతో త్వరలో జరిగే టీ20 ప్రపంచ కప్ కు సన్నాహక మ్యాచుగా కానుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దీంతో టీమిండియాకు అగ్నిపరీక్షగా మారనుంది. ఈ పర్యటనలో తన సత్తా చాటాలని చూస్తోంది.

విరాట్ కోహ్లిని శాశ్వతంగా తొలగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పేలవ ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లిని టీమిండియా తరఫున ఆడించడానికి సిద్ధపడటం లేదు. దీంతో కోహ్లి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. టీమిండియా కోసం అతడి సేవలను దూరంగా ఉంచడానికి ప్రాధాన్యం ఇస్తోంది. మొత్తానికి విరాట్ కోహ్లికి కష్టాలే మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు కూడా విరాట్ ను సెలెక్ట్ చేయడం లేదని చెబుతున్నారు.
Also Read: Discontents in YCP: వైసీపీలో అసంతృప్తులు.. పెరుగుతున్న ధిక్కార స్వరాలు..!