Shreyas Iyer: ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ తనదైన రీతిలో సత్తాను చాటుతూ ప్రతి సీజన్ లో కూడా మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటికే కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ కి రెండుసార్లు టైటిల్ రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ టీం రెండుసార్లు కూడా గౌతమ్ గంభీర్ కెప్టెన్ గా ఉన్నప్పుడే ఐపీఎల్ కప్ గెలుచుకుంది. అందువల్లనే ప్రస్తుతం ఈ టీం కి మెంటర్ గా మేనేజ్ మెంట్ గంభీర్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే లాస్ట్ సీజన్ లో కలకత్తా టీమ్ కి దూరం అయిన శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఆ సీజన్ కి అందుబాటులో లేకుండా పోయాడు.ఇక దానివల్ల నితీష్ రాణా ని టీం కెప్టెన్ గా నియమించారు.
అయినప్పటికీ నితీష్ రాణా సారధ్యంలో కొలకత్తా నైట్ రైడర్స్ కొన్ని మంచి విజయాలను అందుకున్నప్పటికీ సెమీఫైనల్ కి మాత్రం క్వాలిఫై అవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ అందుబాటులోకి వచ్చాడు కాబట్టి ఆయనకి కెప్టెన్ గా బాధ్యతలు తిరిగి అప్పజెప్పాలని కలకత్తా యజమాన్యం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పటికే టీం బాధ్యతల్ని శ్రేయస్ అయ్యర్ కి అప్పగించి ఆ టీమ్ వైస్ కెప్టెన్ గా నితీష్ రాణా ని నియమించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక టీమ్ కి మెంటర్ గా గౌతమ్ గంభీర్ రావడం కూడా ఆ టీం కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి…
ఇక టీం నుంచి కొంతమంది ప్లేయర్లను రిలీజ్ చేసినప్పటికీ ఈనెల 19వ తేదీన జరగబోయే మినీ ఆక్షన్ లో కొంతమంది మంచి ప్లేయర్లని అలాగే యంగ్ ప్లేయర్లను తీసుకోవాలనే ఉద్దేశ్యం లో కలకత్తా టీం యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక గౌతమ్ గంభీర్ టీమ్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ ఆక్షన్ కి సంభందించిన వ్యవహారం కూడా ఆయనే చుసుకోబోతునట్టు గా తెలుస్తుంది. అయితే గంభీర్ ఇంతకు ముందు లక్నో టీమ్ కి మెంటర్ గా ఉండేవాడు అందువల్లనే ఆ టీమ్ రెండుసార్లు సెమీఫైనల్ కి వెళ్ళింది.
ఇక అదే నమ్మకంతో కలకత్తా యజమాన్యం గంభీర్ ని ఈసారి కలకత్తా కి మెంటార్ గా నియమించింది.ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కలకత్తా టైటిల్ గెలవాలని చూస్తుంది. ఎందుకంటే కలకత్తా టైటిల్ గెల్చుకొని దాదాపు పది సంవత్సరాలు వస్తున్న సమయంలో ఇప్పుడు కనక కప్పు గెలవకపోతే కలకత్తా బ్రాండ్ వాల్యూ చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్లే ఈసారి కప్పు కచ్చితంగా గెలవాలని చూస్తుంది…