Homeక్రీడలుక్రికెట్‌Rinku Singh Father Passed Away: తండ్రి పాడెలో మోసి.. దేశం కోసం కదిలి.. రింకూసింగ్...

Rinku Singh Father Passed Away: తండ్రి పాడెలో మోసి.. దేశం కోసం కదిలి.. రింకూసింగ్ భావోద్వేగం

Rinku Singh Father Passed Away: టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ జరుగుతున్న వేళ… భారత్‌ జట్టు స్టార్‌ క్రికెటర్‌ తండ్రి మరణించాడు. దీంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఇంత బాధలోనూ ఆ క్రికెటర్‌ అంత్యక్రియలకు వెళ్లి.. తర్వాత మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అయ్యాడు. టీమ్‌ ఇండియా ఫినిషర్‌ రింకూ సింగ్‌ తండ్రి ఖచ్చంద్ర సింగ్‌ (60) ఆర్థ్‌–స్టేజ్‌ లివర్‌ క్యాన్సర్‌తో గ్రేటర్‌ నోయిడా హాస్పిటల్‌లో కన్నుమూశాడు.

Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!

అంతిమయాత్రలో క్రికెటర్‌..
అలీగఢ్‌లో జరిగిన అంత్యక్రియల్లో రింకూ తన తండ్రి పాడె మోస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. పెద్ద సంఖ్యలో గ్రామీణులు, స్నేహితులు, క్రికెట్‌ అభిమానులు ఇందులో పాల్గొన్నారు. రింకూను ఓదార్చారు. ఆయన తండ్రికి కడసారి వీడ్కోలు పలికారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

క్రికెటర్ల సంతాపం..
టీమ్‌ ఇండియా సహచరులు, మాజీ ఆటగాళ్లు ట్విటర్‌లో సంతాపం తెలిపారు. హర్భజన్‌ సింగ్‌ ’వాహిగురు శాంతి కల్గించాలి’ అని పోస్ట్‌ చేశారు. రింకూ మాస్టర్‌ మసూద్‌ అమిని కూడా మరణ విషయాన్ని «ధ్రువీకరించారు. క్రికెట్‌ లోకం మొత్తం ఐక్యంగా నిలిచింది.

తండ్రి సహకారంతో క్రికెటర్‌గా..
ఖచ్చంద్ర సింగ్‌ అలీగఢ్‌లో గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించారు. మొదట్లో క్రికెట్‌కు వ్యతిరేకించి రింకూ శిక్షించినా, తర్వాత పూర్తి మద్దతు ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కెరీర్‌కు బలపడ్డాడు.

టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరపున జింబాబ్వే మ్యాచ్‌కు ముందు రింకూ తండ్రిని చూసి తిరిగి చేరారు(సబ్‌ ఫీల్డర్‌గా). అంత్యక్రియల తర్వాత టీమ్‌తో రీజాయిన్‌ అవుతారని సమాచారం. ఈ మానసిక ఒత్తిడిలో రింకూ ప్రదర్శన ఎలా ఉంటుంది అనేది చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular