Homeక్రీడలుక్రికెట్‌IND vs NZ 2nd Test: స్పిన్ ఆడలేక బోల్తా కొట్టిన టీమిండియా... 156...

IND vs NZ 2nd Test: స్పిన్ ఆడలేక బోల్తా కొట్టిన టీమిండియా… 156 పరుగులకే భారత్‌ ఆలౌట్‌!

IND vs NZ 2nd Test: పూణె టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యం సాధించింది. కివీస్ స్పిన్నర్లు భారత బ్యాట్స్‌మెన్లను బాగా కట్టడి చేశారు. ముఖ్యంగా మిచెల్ సాంట్నర్ వేసిన బంతులకు టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్లు ధీటుగా ఎదుర్కోలేక చేతులెత్తేశారు. మిచెల్ సాంట్నర్ ఏడుగురు భారత బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ 2 వికెట్లను తీశారు. ఇది కాకుండా టిమ్ సౌథీ 1 వికెట్ తీసుకున్నాడు.

భారత్ ఒక వికెట్ నష్టానికి 16 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించింది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ సులువుగా పరుగులు సాధించగా, శుభ్‌మన్ గిల్ అవుటైన వెంటనే వికెట్ల పతనం మొదలైంది. 30 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేసి గ్లెన్ ఫిలిప్స్ బంతికి అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ 1 పరుగు వద్ద మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రిషబ్ పంత్ 18 పరుగుల వద్ద గ్లెన్ ఫిలిప్‌కు అవుటయ్యాడు.

సర్ఫరాజ్ ఖాన్ 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మిచెల్ సాంట్నర్ సర్ఫరాజ్ ఖాన్‌ను అవుట్ చేశారు. అయితే, రవీంద్ర జడేజా 38 పరుగులు జోడించి, మిచెల్ సాంట్నర్ బంతికి పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవి అశ్విన్ 4 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 18 పరుగులు చేసి నాటౌట్ గా వెనుదిరిగాడు.

పూణె టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు 259 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ తరఫున ఓపెనర్ డ్వేన్ కాన్వే అత్యధికంగా 76 పరుగులు చేశాడు. దీంతో పాటు బెంగళూరు టెస్టు హీరో రచిన్ రవీంద్ర 65 పరుగుల సహకారం అందించాడు. భారత్ తరఫున బౌలర్ వాషింగ్టన్ సుందర్ కివీ జట్టులోని ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశారు. ఇది కాకుండా రవి అశ్విన్ 3 వికెట్లు తీశాడు.

ఇది ఇలా ఉంటే.. భారత్‌పై బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌‌లో న్యూజిలాండ్ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టీమిండియా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని సులువుగా కొట్టి పడేసింది. 36ఏళ్ల తరువాత భారత్‌లో భారత్‌పై టెస్ట్ మ్యాచ్ గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి. రెండో టెస్ట్‌లోనూ విజయఢంకా మోగించడానికి శ్రమిస్తోంది. ఈ క్రమంలో పూనే టెస్టు మ్యాచ్ లో భారత బ్యాటింగ్ ఆర్డర్లను వరుసగా ఫెవీలియన్ కు పంపింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular