ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ చిక్కుల్లో పడింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మెన్ తడబడ్డారు. రోహిత్ 6 పరుగులకే ఔట్ కాగా.. మరో ఓపెనర్ గిల్ 29పరుగులు చేశాడు. ఇక కోహ్లీ 11, రహానే 1 పరుగుకే వెనుదిరగడంతో భారత్ కుప్పకూలుతుందా అన్న బయం పట్టుకుంది.
ఈ క్రమంలోనే వాల్ పూజారా, వికెట్ కీపర్ పంత్ లు భారత్ ను కాపాడారు. 5వ వికెట్ కు వీరిద్దరూ కేవలం 93 బంతుల్లో 81 పరుగులు చేసి రూట్ నేతృత్వంలోని ఇంగ్లండ్ పై ఎదురుదాడి చేశారు. దీంతో భారత్ ను కుప్పకూల్చాలనుకున్న ఇంగ్లండ్ ఆశలకు కల్లెం పడింది.
ఇంగ్లాండ్ అంతకుముందు 578 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 24 వ ఓవర్లో భారత్ 73-4 వద్ద పీకల్లోతు కష్టాల్లో పడగా.. రిషబ్ పంత్ క్రీజుకు వచ్చాడు. తీవ్రంగా టర్న్ అవుతున్న పిచ్ మీద ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ జాక్ లీచ్ భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసి దెబ్బతీశాడు. కానీ రిషబ్ పంత్ ఎదురుదాడి చేయడంతో ఇంగ్లండ్ బెదిరిపోయింది.
పంత్ కేవలం 44 బంతుల్లో 4 సిక్సర్లు, 4 బౌండరీలతో 54 పరుగులు చేసి ఒత్తిడి తగ్గించాడు. మరొక వైపు, పుజారా ప్రేరణ పొంది తన అర్ధ సెంచరీని చురుకైన స్ట్రైక్ రేటుతో పూర్తిచేశాడు. ఈ ఇద్దరు కేవలం 93 బంతుల్లో 81 పరుగులు చేసి రూట్ నేతృత్వంలోని శిబిరం విచారణలో ఆందోళన పెంచారు.
ప్రధానంగా జాక్ లీచ్ తన 6 ఓవర్లలో 59 పరుగులు సమర్పించుకున్నాడు. పూజారా, పంత్ ధాటికి 9.80 ఓవర్ రేటింగ్ తో పరుగులిచ్చాడు. మ్యాచ్ లో భారత్ ను సజీవంగా నిలిపారు. ఏదేమైనా ప్రస్తుతం భారత్ ఇంకా 376 పరుగుల వెనుకబడి ఉంది. పూజారా 73 పరుగులకు బెస్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మిగిలిన రెండు రోజులు కూడా ఇదే విధంగా భారత్ ఆడితే ఓటమి నుంచి తప్పించుకోవచ్చు.
పూజారా ఔట్ తర్వాత సుందర్, అశ్విన్ బాగా బ్యాటింగ్ చేయగలరు. నదీమ్ కొంచెం బ్యాటింగ్ చేయగలడు, అండర్సన్ మరియు ఆర్చర్ భారత టెయిలండర్లను ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇండియా టెయిలండర్ల ఆటతీరుపైనే ఈ టెస్టు ఆధారపడి ఉంది.ఫాలో-ఆన్ను నివారించడం.. ఇండియా జట్టుముందున్న ప్రధాన కర్తవ్యం. ఇంగ్లాండ్కు దగ్గరగా భారత్ స్కోరు చేయడం ఉండటం.. డ్రా అయ్యేలా చూడాలి. కానీ, క్రికెట్లో ఏం జరుగుతుందో మనం ఊహించలేం
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ind vs eng pant and pujara counter attacks england before tea
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com