Homeక్రీడలుక్రికెట్‌Happy Birthday Rohit Sharma: జట్టులో అవసరం లేదన్నారు.. హిట్ మ్యాన్ గా ఎదిగి...

Happy Birthday Rohit Sharma: జట్టులో అవసరం లేదన్నారు.. హిట్ మ్యాన్ గా ఎదిగి అందరి నోళ్లు మూయించాడు

Happy Birthday Rohit Sharma: అతడు అంతగా ఆడటం లేదు. లావుగా ఉన్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టడం లేదు. పరుగులు కూడా అంత వేగంగా తీయడం లేదు. జట్టులోకి ఎందుకు తీసుకున్నారు.. అవసరంలేదు.. కెరియర్ తొలి రోజుల్లో రోహిత్ శర్మ ఎదుర్కొన్న అనుమానాలు ఇవి. జట్టులో స్థానం స్థిరంగా ఉండేది కాదు. ఏదో విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తూ పోతూ ఉండేవాడు.

2013లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ అతడి క్రికెట్ చరిత్రను మొత్తం మార్చేసింది. 2014లో శ్రీలంక జట్టు మీద 264 పరుగులు చేశాడు. శ్రీలంకపై 2017లో 208 పరుగులు చేశాడు. ఇలా మూడుసార్లు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు.. వాస్తవానికి రోహిత్ అత్యంత బలంగా బ్యాటింగ్ చేస్తాడు. ఓపెనర్ గా వచ్చి మెరుపు ఆరంభాన్ని అందిస్తుంటాడు. ఒకానొక దశలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న వేళ.. రోహిత్ గట్టిగా నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆస్ట్రేలియా మీద డబుల్ సెంచరీ చేశాడో.. అప్పుడే అతడి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వన్డేలలో హిట్ మాన్ గా అవతరించాడు. టి20లలో అంతకంటే ఎక్కువ జోరు చూపించాడు. ముఖ్యంగా ఐపీఎల్లో ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీలు అందించి అద్భుతమైన నాయకుడిగా ఆవిర్భవించాడు.

టీమిండియాకు ధోని తర్వాత 2024లో టి20 వరల్డ్ కప్ అందించాడు రోహిత్ శర్మ. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు.. అంతేకాదు, టీమ్ ఇండియాను 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఫైనల్లో ఓటమి వల్ల ట్రోఫీ అందించలేకపోయాడు. ఆ బాధ తనకు జీవిత కాలం ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పాడు రోహిత్..

మైదానంలో కఠినంగా ఉండే రోహిత్.. మైదాన వెలుపల అత్యంత సుత్తి మెత్తగా ఉంటాడు. తోటి ప్లేయర్లతో సరదాగా కబుర్లు చెబుతూ నవ్విస్తుంటాడు. ఐపీఎల్ లో ముంబై జట్టు నుంచి అతడిని సారధి స్థానంలో తొలగించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై రోహిత్ బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ.. తన బాధను అంతర్గతంగా వ్యక్తం చేశాడు. కాని చివరికి ముంబై యాజమాన్యం చేసిన తప్పు ఇప్పుడు తెలిసి వస్తోంది. ప్రస్తుతం రోహిత్ గాయం వల్ల ముంబై జట్టులో కొనసాగలేక పోతున్నాడు. కాకపోతే అతని రాక కోసం ముంబై అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనిని బట్టి రోహిత్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

గౌతమ్ గంభీర్ ఇబ్బంది పెట్టవచ్చు.. ముంబై యాజమాన్యం లెక్కచేయకపోవచ్చు. కానీ చరిత్రలో రోహిత్ కు అద్భుతమైన పేజీలు ఉన్నాయి. టీమిండియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు. మూడు డబుల్ సెంచరీలు చేసి సరికొత్త ఆటగాడిగా నిలుస్తున్నాడు.. ఇది సరిపోదా రోహిత్ అంటే ఏమిటో చెప్పడానికి.. happy birthday to you Hitman

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper