OTT: కరోనా తర్వాత టెక్నాలజీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ల హవా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే కొత్తదనం ఎక్కడ కనిపించినా.. ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా సరికొత్త ప్రయత్నానికి నాంది పలికింది జీ5. ఇటీవలే విడుదలైన సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా జీ5 వేదికాగ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, తొలిసారి దర్శకుడి కామెంటరీతో రిపబ్లిక్ సినిమాను విడుదల చేయనుంది జీ5. ఈ విధంగా రిలీజ్ కానున్న తొలి సినిమా రిపబ్లిక్ కావడం విశేషం . ఈ నెల 26న ఈ సినిమా ఓటీటీలో వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రజాస్వామ్య వ్యస్థలో అధికారులు, పాలకుల నిజస్వరూపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. అయితే, అందరూ సాధారణంగా సినిమా చూస్తారు.. కానీ, దర్శకుడు ఆ సన్నివేశాన్ని ఏ కోణంలో ఆలోచించి తీశాడన్నది ఆయన కామెంటరీతోనే సినిమా చూపించడం ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి ప్రయత్నానికి జీ5తో కలిసి దర్శకుడు దేవకట్టా శ్రీకారం చుట్టారు. ఒకవేళ దర్శకుడి కామెంటరీతో సినిమా చూడటం ఇష్టం లేకపోతే. ఆప్షన్స్ ద్వారా నార్మల్గా సినిమా చూడొచ్చు. మరి ఈ ప్రయోగం ఎంతమేరకు విజయవంతం అవుతుందో చూడాలి.
కాగా, ఇటీవలే యాక్సిడెంట్ అసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సాయి తేజ.. మెల్లగా కోలుకుని తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Republic movie releasing in ott with director commentary
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com