కరోనా కారణంగా ఈనెల 14 నుంచి మూసివేసిన తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మినరసింహా ఆలయ తలుపులు సోమవారం తెరవనున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఆలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. అయితే తాజాగా జరిపిన సమీక్షలో సోమవారం నుంచి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. కాగా ఐదేళ్లలోపు పిల్లలను, వృద్ధులకు అనుమతి లేదని ఆలయ అధికారులు చెప్పారు.