కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని రాజ్యసభ టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు ఆరోపించారు. వ్యవసాయ బిల్లును ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ బిల్లు ద్వారా వ్యవసాయంలోకి కూడా కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తాయని అన్నారు. వ్యవసాయం, సంబంధిత రంగాల అంశాలు ఎప్పుడూ రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు.