పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణగా భావించే ఢిల్లీ అల్లర్ల సెగ హైదరాబాద్ కి తాకే సూచనలు కనిపిస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన అల్లర్లు మూడు రోజుల్లోనే.. రాజధాని మొత్తం వ్యాపించాయి. ఇప్పటికే ఈ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో 32మంది చనిపోయారు. వందలమంది గాయపడ్డారు. వేలమంది భయాందోళనలకు గురౌతున్నారు. అనేకమంది ఢిల్లీని వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ మారణహోమం హైదరాబాద్ ని భయపెడుతుంది.
సిఏఏ వ్యతిరేకంగా 2019 డిసెంబరు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో అయితే దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో కనపిస్తునే ఉన్నాయి. గత 20 రోజులుగా చార్మినార్ దగ్గర వ్యాపారులు స్వచ్చందగా నిరసన చేస్తున్నారు. రోజూ రాత్రి పూట పావుగంట సేపు లైట్లు ఆర్పేసి వారు సీఏఏకి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన హింసను నిరసిస్తూ కొందరు హైదరాబాద్ లో కొవ్వొత్తులతో రోడ్లపైకి వచ్చి నిరనసలు తెలిపారు. అయితే కొద్ది సేపట్లోనే నగరంలో మరో 3 ప్రాంతాల్లో కూడా ఢిల్లీ మారణహోమానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ ర్యాలీలలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే పీపుల్స్ ప్లాజా వద్ద కలవాలని నిర్ణయించున్నట్లు సమాచారం.
హిందువులు, సిక్కులు తమకు మద్దతిస్తున్నారు. కాబట్టి ఢిల్లీ తరహా అల్లర్లు హైదరాబాద్ లో జరిగే అవకాశం లేదని కొంతమంది ముస్లింలు సమర్ధిచుకుంటున్నారు. కానీ సంఘ విద్రోహ శక్తులు వీరి నిరసనలలో చేరితే.. ఢిల్లీ తరహా మారణహోమం హైదరాబాద్ లో కూడా పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Delhi clashes will repeat in hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com