Rahul Gandhi : రాహుల్ గాంధీ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 2024 ఎన్నికలకు ముందు కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బీహార్ లాగానే దేశమంతా చేయాలని కోరుతున్నారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. సనాతన ధర్మం మీద డీఎంకే చేసిన వ్యాఖ్యలు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయన్న భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కులగణనను బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
2024 జనవరిలో అయోధ్య రామాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఎన్నికలకు ముందు రామాలయం ఓపెన్ కావడం అన్నది బీజేపీకి ఓ పెద్ద గేమ్ చేంజర్ గా భావిస్తున్నారు. కులగణనను పైకి తీసుకొచ్చి కులాలను చీల్చడం ద్వారా అయోధ్య వాడిని తగ్గించాలని రాహుల్ గాంధీ ఈ సామాజిక న్యాయం పేరుతో బయటకు తీసుకొస్తున్నట్టు సమాచారం.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ప్రతిగా రాహుల్ గాంధీ కులగణన నినాదమా? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.