Revanth Reddy: తెలుగు రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత ఆస్థాయిలో ప్రజలను ఆకట్టుకునే రాజకీయ నాయకుడు ఎవరని ఆరాతీస్తే అందులో నెక్ట్స్ వచ్చే పేరు రేవంత్ రెడ్డి. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా మాటల మరాఠీ. మాటలతో మాయ చేస్తాడు. ఆకట్టుకునేలా ప్రసంగిస్తాడు. ప్రజలను ఆకర్షిస్తున్నాడు. రేవంత్ రెడ్డి సెటైర్లు వేస్తే పక్కోళ్లు నవ్వకుండా ఉండలేరు. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, రేవంత్, కేటీఆర్, హరీష్ లు బాగా మాట్లాడుతారు. ఇక ఏపీలో అటు సీఎం జగన్, ఇటు చంద్రబాబులో ఆ స్థాయి హ్యూమరస్ ఉండనే ఉండదు. సో పేల్చేవాళ్లు పేల్చితేనే కాస్త బాగుంటుంది. తాజాగా కేసీఆర్ ను ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బ్రహ్మానందంతో పోల్చాడు. దానికి వివరణ కూడా ఇచ్చాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది.

కేసీఆర్ వ్యవహారం అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం లా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బ్రహ్మానందం రేడియేటర్ సినిమా లా ఉంది కేసీఆర్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు. కొంత కాలానికి ప్రజలే టిఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తరని విమర్శించారు. గజ్వేల్ ఫాంహౌస్ కేసీఆర్ ప్రపంచమని అన్నారు. కాంగ్రెస్ లేనప్పుడు.. కాంగ్రెస్ పొత్తు కోసం ఎందుకు తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు.
పదిమంది ఎంపీలు లేని టిఆర్ఎస్.. కాంగ్రెస్ లేదంటే అయిపొద్దా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా…పోటీ చేయాల్సింది తెలంగాణ లోనే కదా అని నిలదీశారు. కేసీఆర్ ఖాలీగా ఉన్నప్పుడు ఇలాంటి కథలు చెప్తడు..అలాంటివి సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని అన్నారు. ఎన్టీఆర్ ను గతంలో తిట్టింది కేసీఆర్ అని.. ఇప్పుడు పొగుడుతుంది కేసీఆర్ అని ఎండగట్టారు.. కేసీఆర్ మాటలు చిత్తు కాగితంతో సమానమన్నారు..
కేసీఆర్ అనే కాలం చెల్లిన మెడిసిన్ ఇక పనిచేయదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలలో కలిసివచ్చిన నేతలు కేసీఆర్ ను జోకర్ గా చూస్తున్నారన్నారు. దేశ రాజకీయాలపై కేసీఆర్ కు మక్కువ ఉంటే.. నెల్లూరు జిల్లాలో జరగబోయే ఉప ఎన్నికలో పోటీ చేస్తరా అని నిలదీశారు. అక్కడ అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేస్తారన్నారు. రాష్ర్టపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దది చేసి చూపడానికే కేసీఆర్ జాతీయ పార్టీ నినాదం ఎత్తుకున్నారన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. అడుగడుగునా హత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. కుటంబాలకు, మహిళలకు భద్రత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలే హత్యాచారాలు చేస్తున్నారని.. అసదుద్దీన్ ఒవైసీ మైనర్ హత్యాచారం పై ఇప్పటికి ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించలేదు. ఈ రోజుకి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనర్ హత్యాచారం పై నోరు మెదపలేదన్నారు. హత్యాచారాలు కూడా టిఆర్ఎస్, ఎంఐఎం కలిసి పంచుకుంటున్నాయన్నారు.
ఎలాంటి నేరాలు, ఘోరాలు చేసినా శిక్షలు మాఫీ అన్నట్లు అసదుద్దీన్ వ్యవహరిస్తున్నాడన్నారు. మిత్రపక్షమైన ఎంఐఎం నేతలు హత్యాచారం చేస్తే ఎందుకు శిక్షించడం లేదో కేసీఆర్ మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 15న ‘హైదరాబాద్ బచావో’ నినాదం తో హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలపై అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తున్నాం.