చాలా సంవత్సరాల నుంచి గ్రహాంతర వాసుల గురించి ప్రజల మధ్య చర్చ జరుగుతోంది. కొందరు శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులు ఉన్నాయని చెబుతుంటే మరి కొందరు మాత్రం గ్రహాంతర వాసులు లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భూమిపై మనుషులు జీవనం సాగిస్తున్న విధంగానే ఇతర గ్రహాల్లో కూడా జీవులు ఉన్నాయని ఆ జీవులే గ్రహాంతర వాసులని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
అయితే తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఒక ఘటన వల్ల గ్రహాంతర వాసుల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఆకాశంలో విమానాన్ని నడుపుతున్న ఒక పైలెట్ నింగిలో ఒక గుర్తు తెలియని వస్తువును గుర్తించి ఆ గుర్తు తెలియని వస్తువు గ్రహాంతర వాసి అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సాయంత్రం సమయంలో పాక్ లోని చాలామంది ప్రజలు కూడా ఆ వింత వస్తువును చూసి మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో తీశారు.
పైలెట్ పీఐఏ పైలట్ కంట్రోల్ రూమ్ కు కూడా గ్రహాంతర వాసిగా చెప్పబడుతున్న వింత వస్తువు గురించి సమాచారం ఇవ్వగా ఆ వింత వస్తువు భారీ ఉపగ్రహం లేదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అయి ఉండవచ్చని పీఐఏ పైలట్ కంట్రోల్ రూమ్ సిబ్బంది భావిస్తున్నారు. ఆ వింత వస్తువు మొదట తెలుపు రంగులో కనిపించి ఆ తర్వాత వేర్వేరు రంగుల్లోకి మారడం గమనార్హం.
పాక్ లో కనిపించిన ఈ వస్తువు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాదాపు గంట సమయం పాటు ఆ వింత వస్తువు వేగంగా కదిలిందని తెలుస్తోంది. రహీమ్ యార్ ఖాన్ ప్రాంతంలో ఈ వింత వస్తువు కనిపించినట్లు తెలుస్తోంది. అయితే ఆ వింత వస్తువు గ్రహాంతర వాసి అవునో కాదో తెలియాల్సి ఉంది