Homeజనరల్తమిళనాడులో వింత దేవాలయం.. రంగులు మారే వినాయకుడు..?

తమిళనాడులో వింత దేవాలయం.. రంగులు మారే వినాయకుడు..?

సాధారణంగా ఏ దేవాలయంలోనైనా విగ్రహం ఎప్పుడూ ఒకే రంగులో ఉంటుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఆలయంలో మాత్రం ఆరు నెలలకు ఒకసారి విగ్రహం రంగులు మారుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సంవత్సరంలో రెండుసార్లు రంగులు మార్చుకునే ఈ విగ్రహం రంగులు మార్చుకుంటూ ప్రజలు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడూ సందడి చేస్తుంటారు.

ఈ ఆలయంలో వినాయకుడు మార్చి నుంచి జూన్ నెల వరకు నల్ల రంగులో మిగిలిన నెలల్లో తెల్లని రంగులో ఉంటాడు. స్వామి మహత్యం వల్ల విగ్రహం రంగులు మారుతుందని ఈ గ్రామంలో గ్రామస్తులు భావిస్తారు. ఆలయం చిన్నదే అయినప్పటికీ ఎన్నో అద్భుతాలకు ఈ ఆలయం నిలయం కావడం గమనార్హం. అతిశయ వినాయగర్ పేరుతో పిలవబడే ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.

ఈ ఆలయంలోని విగ్రహంలా ఇక్కడ ఉన్న మంచినీటి బావిలోని నీళ్లు కూడా ఆరు నెలలకు ఒకసారి రంగు మారతాయి. వినాయకుడు ఏ రంగులో ఉంటే ఆ రంగులో కూడా మరో రంగులో బావిలోని నీళ్లు ఉంటాయి. ఈ ఆలయం దగ్గర ఒక మర్రిచెట్టు ఉండగా ఆ చెట్టు ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తే దక్షిణాయనంలో ఆకులు రాలుస్తుంది. కొందరు భక్తులు ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.

మొదట ఈ ప్రాంతంలో శివాలయం ఉండేదని ఆ తరువాత వినాయక ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెబుతారు. 2300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు పునర్నిర్మించారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular