
కరోనా మూడో దశ ప్రారంభమైతే రాష్ర్టంలో 18 లక్షల మంది వైరస్ బారిన పడవచ్చునని అంచనా వేస్తున్నారు. తొలి దశలో కంటే తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి జరిగితేనే ఈస్థాయిలో కేసులు వస్తాయని అంచనా వేసినట్లు కొవిడ్-19 పీడియాట్రిక్స్ స్పెషల్ టాస్క్ ఫో్ర్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ 18 ఏళ్లలోపు పిల్లలు 4.50 లక్షల మంది ఉంటారు. వీరిలో 4.05 లక్షల మంది ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతారు. మధ్యస్థ లక్షణాలతో 36 వేల మంది ఆస్పత్రుల్లో చేరతారు. వీరిలోనూ 9000 మంది పిల్లలు ఐసీయూలో చికిత్స పొందుతారు.
మూడో వేవ్ ఉంటుందా? లేదా? అన్న దాని గురించి స్పష్టత లేదు.సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్గగా పిల్లలకు తగిన వైద్యం అందించేందుకు వీలుగా ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. మూడో వేవ్ ఉందంటున్న హెచ్చరికల నేపథ్యంలో పిల్లలు ఏ స్థాయిలో వైరస్ బారిన పడవచ్చునన్న దానిపై కొవిడ్ పీడియాట్రిక్స్ టాస్క్ ఫోర్స్ కమిటీ విశ్లేషణ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు కోటిన్న మంది 18 ఏళ్ల లోపు వారు ఉన్నారు. వైరస్ ఉధృతి పెరిగే 90 రోజుల్లో 75 శాతం మంది పిల్లలకు సంక్రమిస్తుందని పేర్కొంది. రోజుకి 1100 మంది ఆస్పత్రుల్లో పడే అవకాశం ఉంది.
పిల్లల ఆరోగ్య పరిస్థితి అనుసరించి రెమ్ డెసివిడ్ అంపోటెరిసిన్ ఇంజక్షన్లు మఖ్యమైన సిరప్స్ తో కలిపి మొత్తం 38 రకాల మందులు సిద్ధం చేయాలని కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. 2 రకాల పరిమాణాల్లో ఆక్సిజన్ మాస్కులు, వెయింగ్ మిషన్లు, థర్మామీటర్లు, ఇతర వైద్య పరికరాలు ఏమేమి అవసరం అవుతాయో కూడా వివరించింది. వీటిల్లో ఇప్పటికే 70 శాతం నుంచి 80 శాతం వరకు వైద్య ఆరోగ్య శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి.
కొత్తగా వంద వెంటిలేటర్లు కొనుగోలు చేయడంతో పాటు అదనంగా నర్సులను నియమించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖరీదైన ఇమ్యూనోగ్లోబలిన్ ఇంజక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉన్న చిన్న పిల్లలకు ఇస్తారు. 5 ఎంజీధర రూ.13,000 వరకు ఉంది. కనీసం 5 ఇంజక్షన్థు వాడాల్సి వస్తుంది. కొన్ని ఇంజక్షన్లు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉన్నాయి. జాతీయ స్థాయిలో వయసుల వారీగా ఇఫ్పటివరకు నమోదైన కరోనా వైరస్ కేసుల శాతం ఇంచుమించు ఒకేలా ఉంది. వైరస్ సోకిన 20 ఏళ్ల లోపు వారు జాతీయస్థాయిలో 11.73 శాతం మంది ఉన్నారు.