Home Blog Page 8628

ఆప్ విజయం ప్రతిపక్షాలకు దెబ్బనా?

ఆప్ డిల్లీ విజయంపై బిజెపి యేతర పక్షాలుచాలా సంతోషంగా వున్నాయి. వాటి సంతోషమల్లా బిజెపి ఓడిందని. మీడియా కూడా అదే వైఖరిని వెల్లబుచ్చాయి. ముందుగా ఒక్క విషయం మరిచిపోతున్నాము. డిల్లీ లో అధికారంలో వుంది బిజెపి కాదనేది. ఆప్ అధికారాన్ని నిలుపుకోవటమే కాకుండా చరిత్ర సృష్టించిందనేది అందరూ ఒప్పుకోనేవిషయం. అంతవరకూ బాగానేవున్నా మిగతా పక్షాల విషయంలో విశ్లేషణ సరిగ్గాలేదనే చెప్పాలి. బిజెపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డినా ప్రజలు ఆప్ అనుసరించిన పేద , మహిళా అనుకూల విధానాలకే ఓటు వేసారు. ఇకపోతే మిగతా పార్టీలను చూస్తే అంతకుముందు మూడుసార్లు అధికారంలో వున్న కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవటం ఆ పార్టీ భవిష్యత్తును సూచిస్తుంది.

ఆప్ విజయాన్నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి? ప్రజల మధ్యవుండి పనిచేస్తే ప్రజలు పార్టీలను ఆదరిస్తారని అర్ధమవుతుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలదిశగా ఆప్ అడుగులువేయటం హర్షించదగ్గ పరిణామం. అరవింద్ కేజ్రివాల్ 2015 కి ఇప్పటికి ఎంతో పరిణితి చెందిన నాయకుడిగా మారాడని పరిశీలకులు భావిస్తున్నారు. డిల్లీ లో తను చేసిన పనులే తనను గెలిపిస్తాయని నమ్మాడు. అలాగే సిఎఏ పై తనదైన శైలిలో ప్రతిస్పందించాడు. షహీన్ బాగ్ శిబిరాన్ని దర్శించకుండా జాగ్రత్తపడ్డాడు. అంటే బిజెపి గేమ్ ప్లాన్ లో పడకుండా జగ్రత్తపడ్డాడని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం పక్కదారిపట్టకుండా తన పనివిదానంపైనే తీర్పు చెప్పేటట్లు జాగ్రత్తలు తీసుకున్నాడు.

మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, పార్టీలు ఆప్ విజయాన్నుంచి తీసుకోవాల్సిన గుణ పాఠాలేంటి? ముఖ్యంగా పేద ప్రజల్లో ఎప్పట్నుంచో పనిచేసిన చరిత్ర వున్న వామపక్షాలు ఏమి గుణపాఠాలు నేర్చుకోవాలి. చూడబోతే నేను ఓడినా పర్వాలేదు అవతలి వాడు మట్టికరిస్తే చాలు అనే ధోరణిలో వ్యవహరిస్తున్న వామపక్షాలు ఆత్మపరిశోధన చేసుకోవాల్సిన అవసరం లేదా? తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల గుండెల్లో నిలిచిన చరిత్రగలిగిన ఈ పార్టీలు పూర్తిగా కనుమరుగై పోవటానికి కారణమేమిటి? డిల్లీ లో ఆప్ చేసిన పని ఈ పార్టీలు చేయలేకపోవటానికి కారణమేంటి? నేను ఇంతకుముందు అనేకసార్లు చెప్పినట్లు పార్టీ నిర్మాణ స్వరూపం సమూల మార్పులకు గురికావల్సివుంది. ఇంకా పాత కాలపు రహస్య పనివిధానాన్ని వదిలి పారదర్శకత , జవాబుదారీతనం కలిగిన నిర్మాణ వ్యవస్థని రూపొందించుకోవాలి. అతిముఖ్యమైనది శ్రామిక నియంతృత్వం అనే నిరంకుశ వ్యవస్థని ఆదర్శంగా తీసుకోకుండా ప్రజాస్వామ్య సోషలిజం ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పటికీ భారత దేశంలో బిజెపి, మధ్యేవాద కాంగ్రెస్ లాంటి పార్టీలతో పాటు , వామపక్ష పార్టీలకు భవిష్యత్తు వుంది. కాకపోతే సిద్ధాంతం స్పష్టంగా ప్రజాస్వామ్య వైఖరి కలిగివుండాలి. ఆప్ దాదాపు ఈ వైఖరి తీసుకోబట్టే ప్రజలు ఆదరించారు.

ఓ విధంగా చెప్పాలంటే ఆప్ రావటం బిజెపి కన్నా కాంగ్రెస్, వామపక్ష సంప్రదాయ పార్టీలకు సవాలు. ఎందుకంటే ఈ ఎన్నిక తర్వాత ఆప్ మిగతా రాష్ట్రాల్లో వ్యాప్తి చెందటానికి మునపటికన్నా చురుకుగా పనిచేయటం ఖాయం. సంప్రదాయ కాంగ్రెస్, వామపక్ష ఓటర్లు ఆప్ వైపు మొగ్గే అవకాశాలు మెండుగా వున్నాయి. అదేజరిగితే సమీప భవిష్యత్తులో ఈ రెండు వర్గాల ఓటర్లు ఆప్ వైపు మొగ్గటం  ఖాయం. ఈ లోపలే ఈ పార్టీలు ఆత్మపరిశోధన చేసుకొని మార్పులు  చేసుకోకపోతే ముందుగా నష్టపోయేది ఈ పార్టీలే. డిల్లీ లో జరిగింది ఇదే. కాంగ్రెస్ ఓటర్లు మొత్తం ఆప్ వైపు మొగ్గు చూపారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో భారత రాజకీయ పటంలో ఎన్నో మార్పులు జరిగే అవకాశముంది. బిజెపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కి అవకాశాలు మృగ్యం. ప్రాంతీయ పార్టీలు జాతీయ ఎన్నికల్లో ఎప్పటికీ  బిజెపి కి ప్రత్యామ్నాయం కాలేవు. కాబట్టి ముందు ముందు రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. దాన్నిబట్టే 2024 ఎన్నికలని అంచనా వేయాల్సి వుంటుంది.

మినిస్టర్ అనిల్ యాదవ్ మమ్మల్ని ‘చీప్ పీపుల్’ అన్నాడు: ప్రీతీ తల్లి

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతీకి జరిగిన అన్యాయంపై స్పందించటానికి ఈ రోజు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ప్రీతీ తల్లి మాట్లుడుతూ..న్యాయం కోసం ఆశ్రయిస్తే మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ తమను చీప్ పీపుల్ అన్నాడనే విషయం చెపుతూ..బోరున విలపించారు. న్యాయం కోసం అందరి నాయకులని ఆశ్రయించామని..కానీ ఎవరు స్పందించలేదని ప్రీతీ తల్లి దుఃఖంతో వెల్లడించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల దెగ్గరికి వెళ్లిన తమకి న్యాయం జరగలేదని..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా న్యాయం జరుగుతుందని ఆమె విశ్వసించారు. కొందరు పోలీసు అధికారులు డబ్బుకి ఆమూడు పోయి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారనే నిజాన్ని బట్టబయలు చేసారు.

పవన్ కళ్యాణ్ ఈ విషయమై మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వానికి న్యాయం చేసేందుకు కొంత గడువు ఇచ్చారు. వెంటనే లిఖిత పూర్వకంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని అయన డిమాండ్ చేసారు. పక్క రాష్ట్రంలో జరిగిన దిశా విషయంలో చూపిన చొరవ..ప్రీతీ విషయంలో ఎందుకు చూపలేదని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వం న్యాయం చేయటంలో విఫలమైతే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని పవన్ తెలిపారు.

జగన్-మోడీ దోస్తీపై రగులుతున్న ప్రత్యర్థి పార్టీలు

ఏపీ సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రధాని మోడీని కలవటానికి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎలక్షన్ ఫలితాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవటం..ఆ తరువాత వెంటనే జగన్ కి ఢిల్లీ నుంచి పిలుపు రావటంపై చాల మందిలో అనుమానాలు రేకితించాయి. ఇప్పటిదాకా జగన్ మోడీల సంబంధాలు బాగానే ఉన్నాయి. జగన్ మోడీ ప్రభుత్వానికి పార్లమెంటులో అన్ని విధాలా సహకారం అందిస్తూనే ఉన్నాడు. ఈ సహాయానికి కృతజ్ఞతగా జగన్ తీసుకునే నిర్ణయాలకు మోడీ సహాయం చేస్తాడనే వాదన గట్టిగ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ ఎన్డీయే కూటమితో కలుస్తుందనే వార్త జనాలలో విస్తృతంగా ప్రచారం అవుతుంది.

ఇది ఇలా ఉండగా..ఇంకో పక్క ఏపీలో ఉన్న ప్రత్యర్థి పార్టీలకు జగన్ మోడీల స్నేహం మింగుడుపడటం లేదు. బీజేపీతో విభేదించి తప్పు చేసాము అని చంద్రబాబు బాధపడుతుంటే..బీజేపీతో పొత్తు పెట్టుకున్నా..కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని పవన్ నిరుత్సాహ పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీలో ఉన్న కొందరు ముఖ్య నాయకులకి కూడా కేంద్రం జగన్ పై సానుకూలంగా వ్యవహరించటం అసలు నచ్చటంలేదట. ఇలా ప్రతి ఒక్కరు వీరి స్నేహం చూసి రగిలిపోతున్నారు. ఒకవేళ జగన్ మోడీతో చెయ్యి కలిపితే మాత్రం వీళ్ళ పని అయిపోయినట్లే అని జనాల్లో గుసగుసలు ఎక్కువ అయ్యాయట..ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

కేజ్రీవాల్ దృష్టి ఇక ప్రధాని పీఠం వైపే, వయా బీహార్!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించిన ఆప్ అధినేత ఇప్పుడు ప్రధాని పదవిపై దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు మరో ఎనిమిది నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఆశారా చేసుకొనే ప్రయత్నాలు జరుపుతున్నది.

వాస్తవానికి 2013లోనే అటువంటి ప్రయత్నాలు చేసినా ఫలవంతం కాలేదు.అక్కడ తన ఫలాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత కూడా దాదాపు తిరిగి అవే ఫలితాలు పొందడం, పైగా సుపరిపాలన ఆధారంగా ఓట్లు పొందడంతో జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్న్యాయంగా ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి.

ఇంతకు ముందు హర్యానా, పంజాబ్, గోవా తదితర రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు బీహార్‌ మీదికి దృష్టి సారిస్తున్నారు. బీహార్‌లో జేడీయూ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన పవన్ వర్మ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు బలంగా మద్దతు పలుకుతున్నారు.

భూటాన్ దౌత్యాధికారిగా పనిచేసిన పవన్ వర్మను సీఎం నితీశ్ కుమార్ జేడీయూలోకి తీసుకున్నారు. 2014లో నితీశ్ ఆయనను రెండేళ్ల పాటు రాజ్యసభకు కూడా పంపించారు. అనంతరం ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ, జాతీయ ప్రతినిధిగానూ నియమించారు.

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌(పీకే)ను జేడీయూలోకి తీసుకొచ్చింది పవన్ వర్మే. ఇటీవల పవన్ వర్మతో పాటు పీకేను కూడా జేడీయూ నుంచి బహిష్కరించడంతో… కొత్త గూటి కోసం ఆయన అన్వేషిస్తున్నారు.

మహారాష్ట్రలో `భోజన’ రాజకీయాలు

మహారాష్ట్రలో సుదీర్ఘకాలం మితపక్షాలుగా వ్యవహరించి, తాజాగా రాజకీయ ప్రత్యర్థులుగా మారిన శివసేన, బీజేపీలు పోటీ పడి ప్రజలకు చౌక ధరకు భోజనం అందిస్తున్నాయి. తద్వారా పేదలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

ఆకలితో అలమటించే పేద ప్రజలకు తమ ప్రభుత్వం పసందైన భోజనం పెడుతుందని తొలుత ప్రకటించిన శివసేన సంకీర్ణ ప్రభుత్వం, చెప్పినట్లుగానే గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున రూ.10కే థాలీని (భోజనం) అందుబాటులోకి తెచ్చింది.

అయితే మాజీ మిత్రపక్షమైన బీజేపీ ఒక అడుగు ముందుకేసి ‘మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది.

‘శివ భోజన్’ కంటే కూడా తమ భోజనం వంద రేట్లు బాగా ఉంటుందని బీజేపీ ప్రకటించింది. దీనికి `దీన్‌దయాల్’ థాలీ అని పేరు పెట్టింది. రూ.30కి అందించే ఈ మధ్యాహ్న భోజనం థాలీ (ప్లేట్)లో మూడు చపాతీలు, గినె్నలో అన్నం, రెండు ఆకు-కూరగాయల కూరలు, వేరు శనగ చట్నీ, మామిడి పచ్చడి ఇస్తామని బీజేపీ ప్రకటించింది.

కాగా గత నెల 26న శివసేన ‘శివ భోజన్’ పేరిట ప్రారంభించిన తాలీలో రెండు చపాతీలు, ఒక ఆకుకూర, 150 గ్రాముల అన్నం, పప్పు ఉన్నాయి.

ఇదిలాఉండగా తమ పార్టీలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు బీజేపీ వెల్లడించింది. తొలుత షోలాపూర్ జిల్లాలో పందర్‌పూర్‌లో గల పేరెన్నికగన్న విఠల్ ఆలయం వద్ద దీనిని ప్రారంభించింది. త్వరలో జిల్లా మొత్తం ఈ పథకాన్ని విస్తరిస్తామని పార్టీ ప్రకటించింది.

పవన్ కర్నూలు పర్యటనకి సీమాంధ్ర జేఏసీ సవాల్

సుగాలి ప్రీతీకి న్యాయం చేయాలనీ ఎప్పటినుంచో తన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి తమ బాధ వెళ్లబుచ్చుకున్నారు. పవన్ దీని విషయమై స్పందిస్తూ…ఈ రోజు కర్నూలులో బహిరంగ ర్యాలీ చేయటానికి నిర్ణయించారు. అయితే పవన్ ర్యాలీకి రాయలసీమ విద్యార్థి జేఏసీ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

సుగాలి ప్రీతీ న్యాయ పోరాటంలో విద్యార్థులదే కీలక పాత్రా అంటూ.. పవన్ ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ..జేఏసీ నాయకులు తమ వాదనను వినిపించారు. గతంలో రాయలసీమ వాసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి..ఇప్పుడు ఏ మొహంతో పవన్ కర్నూలుకు వస్తున్నాడని వారు ప్రశ్నించారు. 2017లో ఈ ఘటన చోటుచేసుకుంటే..పవన్ అప్పుడు కనీసం స్పందించకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.

అయితే ఈ విషయం వెలుగులోకి రావటానికి ప్రధాన కారణం పవన్ అనే చెప్పుకోవాలి. మూడు సంవత్సరాలుగా మరుగున పడిన చిన్నారి ప్రీతీ కేసు…ఇప్పుడు ప్రజల నోట్లో నానుతుందంటే జనసేన కృషి ఎంతోకొంత ఉందనే చెప్పాలి. మరోవైపు అధికార వైసీపీ కూడా ఈ విషయంపై సానుకూలంగానే స్పందించి..విచారణని పునరుధ్రీకరించారు. ఈ కేసును ఇప్పుడు సిబిఐకి కూడా అప్పగించబోతున్నారనే కధనాలు కూడా ప్రసారం అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో పవన్ పర్యటనని ఎలా అయిన నిలువరించే తీరతామని జేఏసీ నాయకులు వెల్లడించారు. కానీ జనసేన నాయకులు మాత్రం అనుకున్నట్టుగానే పవన్ కార్యాచరణ ఉంటుందని తెలియజేసారు. ఈ రోజు జరగబోయే పవన్ కర్నూలు పర్యటన ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.

ఆకట్టుకుంటున్న ‘వరల్డ్ ఫెమస్ లవర్’ వీడియో సాంగ్..!

 

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘వరల్డ్ ఫెమస్ లవర్’. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుండి ‘కొమసావా ప్యారిస్’ అనే వీడియో సాంగును విడుదల చేశారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై వల్లభ నిర్మించారు. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది.

 

ఢిల్లీ ఫలితాలతో జగన్ ముందు బిజెపి సాష్టాంగం!

ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దగ్గరకు తీయడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒక విధంగా కట్టడి చేసే సంకేతాలు ఇచ్చిన బిజెపి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో వైసిపి ముందు సాష్టాంగ పడక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులకు పైగా ప్రయత్నం చేస్తున్న ఇవ్వని ఇంటర్వ్యూ ను ఎన్నికల ఫలితాలు ఒక వాంస్తుండగానే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు జగన్ కు ఇవ్వడమే ఇదే అంశాన్ని వెల్లడి చేస్తున్నది.
 
జగన్ కనీసం రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోమ్ మంత్రి అమిత్ షా లను కలవడం కోసం విఫల యత్నం చేయడం తెలిసిందే. అటువంటిది అకస్మాత్తుగా ప్రధాని బుధవారం సాయంత్రం కలవడానికి సుముఖత వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. గత రెండేళ్లుగా వరుసగా ఆరు రాస్త్రాలలో పార్టీకి ఎదురు దెబ్బలు తగలడంతో ఇక ప్రాంతీయ పార్టీలను కట్టడి చేసే తమ ఎత్తుగడలు సాగే అవకాశాలు లేవని బిజెపి గ్రహించవలసిన పరిస్థితి నెలకొంది. 
 
శివసేన దూరంగా వెళ్లిన తర్వాత రాజ్యసభలో బిజెపికి ఒకేసారి 11 మంది సభ్యుల మద్దతో పోయింది. లోక్ సభలో 22 మంది సభ్యులు గల వైసిపి నాల్గవ అతి పెద్ద పార్టీ. రాజ్యసభలో సహితం త్వరలో నలుగురు సభ్యులు చేరడంతో ఆ పార్టీ బలం ఆరుకు పెరగనుంది. మరో రెండేళ్లలో ఈ బలం 10కు చేరుకొంటుంది. అందుచేత జగన్ తో స్నేహం చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. 
 
రాజధాని మార్పుకు వ్యతిరేకంగా సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఆందోళన జరుపుతామని ప్రకటించిన బిజెపి ఇప్పుడా మాటలే మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ తో కలసి ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్ జరుపుతామని ప్రకటించి వెనుకకు తీసుకున్నారు.రాజధాని వ్యవహారంతో కేంద్రానికి సంబంధం లేదని పార్లమెంట్ లోనే స్పష్టం చేయడం ద్వారా ఆ విషయంలో తాము జోక్యం చేసుకోమని సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 
 
అదే విధంగా శాసన మండలి రద్దు విషయంలో సహితం జగన్ కు సహకరించడం మినహా కేంద్రం చేయగలిగింది మరేమి లేదని తేటతెల్లం అవుతున్నది. ఒక వంక కేంద్రంతో తమకు అవసరమైన పనులు చేసుకొంటూ మరోవంక ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జగన్ పావులు కదిపే అవకాశాలు కూడా లేకపోలేదని అర్ధం అవుతున్నది. 
 
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు రోజే రాజ్యసభలో ఎల్ ఐ సి లో వాటాల అమ్మే ప్రతిపాదనను విజయసాయిరెడ్డి నిశితంగా విమర్శించడం గమనార్హం. అదే విధంగా వార్షిక బడ్జెట్ పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంతో వైపున, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వస్తున్న పలు ఆరోపణలపై కూడా కేంద్రాన్ని సత్వరం చర్యలు తీసుకోమని జగన్ వత్తిడి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 
 
టిడిపికి చెందిన పలువురిపై ఈ మధ్య ఐటి దాడులు జరగడం తెలిసిందే. అయితే సిబిఐ, ఈడీ కేసుల దర్యాప్తును ఎదుర్కొంటున్న జగన్ ఏ మేరకు కేంద్రంపై వత్తిడులు తీసుకు రాగలరో  చూడవలసి ఉంది. 
 

‘లూసీఫర్’ కోసం కష్టపడుతున్న సుకుమార్

‘లూసీఫర్’ మూవీ రీమేక్ హక్కుల్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్కుంచుకున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులను చేస్తున్నారు. మెగాస్టార్ ఉన్న క్రేజీని దృష్టిలో ఉంచుకొని రంగస్థలం దర్శకుడు సుమార్ ‘లూసీఫర్’ కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కథ విషయంలో మెగాస్టార్ ను సంప్రదించి కొన్ని మార్పులకు సుకుమార్ శ్రీకారం చుట్టాడు. ఈ మూవీని చెర్రీ ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొన్న కొరటాల శివ మెగాస్టార్ కాంబినేషన్లో వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గటుగానే ఈ మూవీలో భారీ తారాగాణం ఉండబోతుంది. ఇప్పటికే ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ గా త్రిష ఎంపికైంది. తెలుగమ్మాయి ఈషారెబ్బా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అంతేకాకుండా మెగా పవర్ స్టార్ దాదాపు 30నిమిషాల పాటు కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాకుండా చిరంజీవి డ్యుయల్ రోల్స్ చేయనున్నాడు. ఓ పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారిగా చిరంజీవి ఉండబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల మెగాస్టార్-రెజీనాలపై ఓ మాస్ సాంగ్ చిత్రీకరించారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటుంది.

చిరు-152వ మూవీ తర్వాత లూసీఫర్ రీమేక్ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మూవీపై కథ విషయంలో మెగాస్టార్ కు దర్శకుడు సుకుమార్ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో కలిసి ఈ మూవీ చేస్తున్నాడు. చిరంజీవి కూడా కొరటాల కాంబినేషన్లో మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి సినిమాలు పూర్తయ్యాకే లూసీఫర్ మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ ఏడాది పట్టాలెక్కించాలని రాంచరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడా లేక కథ వరకే పరిమితం అవుతాడా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

చిర్రెత్తుతున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ

సోషల్ మీడియాలో తనపై వర్గల్ కామెంట్ చేసే వారిని వదిలేదని రంగమ్మత్త వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల తనపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న వర్గల్ కామెంట్లపై అనసూయ మాట్లాడారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలపై తనపై ఇష్టమొచ్చిన రీతిలో కామెంట్లు పెడుతున్న వారిని చూసిచూడనట్లుగా వదిలేశానని, అయితే ఈ కామెంట్లో రోజురోజుకు శృతిమించడం వల్లనే వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వల్గర్ కామెంట్లు చేసేవారు ఎవరైనా సామూహిక అరెస్టులుకాక తప్పదని స్పష్టం చేశారు.

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమెకు లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారంతా అనసూయతో తమ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అయితే కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబెట్రీలపై ట్రోలింగ్ చేయడం కొందరికి అలవాటుగా మారింది. అయితే అనసూయ ఫొటోలను మార్ఫింగ్, బూతు, వర్గల్ పదజాలంతో అనసూయను టార్గెట్ చేస్తున్నారు. దీంతో చిర్రుత్తుకొచ్చిన అనసూయ లైవ్లో లోకి వచ్చి వీరిపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తనపై వర్గల్ కామెంట్లు చేసేవారిని వదిలేదని స్పష్టం చేసింది. అలాగే తనకు మద్దతు ఇచ్చేవారికి కృతజ్ఞతలు తెలిపింది.

అయితే ఇలాంటివి అనసూయ ఒక్కరికే జరగడం లేదు. హీరోహీరోయిన్లందరూ వీటికేం అతీతంగా కాదు. ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో నిత్యం వారు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు. వారికి నచ్చిన అభిప్రాయాన్ని తమ అభిమాన నటీనటులతో పంచుకుంటున్నారు. అయితే కొంతమంది శృతిమించి కామెంట్లు చేస్తున్నారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా వారు కూడా వాళ్ల లిమిట్స్ లో ఉండాల్సి ఉంటుంది. యువతను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పెడతూ తమను కామెంట్లు చేయద్దని కోరడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి. అతిచేయడం ఎవరైకైనా ప్రమాదకరమే కాబట్టి  సోషల్ మీడియాలో సెలబెట్రీలతోపాటు నెటిజన్లు కూడా హద్దుల్లో ఉంటే ఇరువురికి మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వరల్డ్ ఫేమస్ లవర్ USA ప్రీమియర్ షో థియేటర్స్

వరల్డ్ ఫేమస్ లవర్  USAలో ఫెబ్రవరి 13న రిలీజ్ కాబోతుంది. ప్రీమియర్ షో థియేటర్స్ ఇవే..

వరల్డ్ ఫేమస్ లవర్ యూకే థియేటర్స్ లిస్ట్

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. వరల్డ్ ఫేమస్ లవర్ యూకే లో రిలీజ్ అవుతున్న థియేటర్స్ ఇవే..

క్రేజీ ఆఫర్ దక్కించుకున్న పూజా హెగ్డే

హీరోయిన్ పూజా హెగ్డే బంపర్ ఆఫర్ దక్కించుకుంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ‘కబీ ఈద్ కబీ దివాళీ’ మూవీలో సల్మాన్ కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే ఎంపికైంది. ఈ మేరకు త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుంది. 2021 ఈద్ కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

పూజా హెగ్డే ఇటీవలే అల్లు అర్జున్ తో కలిసి ‘అలవైకుంఠపురములో’ మూవీలో నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఓ వైపు మహేష్ బాబు ‘సరిలేరునికెవ్వరు’, మరోవైపు రజనీకాంత్ ‘దర్బార్’ మూవీలను తట్టుకొని భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీలో పూజా హెగ్డే గ్లామర్ తోపాటు మంచి నటన కనబర్చింది. పూజా హెగ్డే హిట్లతో సంబంధం లేకుండా పెద్ద స్టార్లతో నటిస్తుంది. ఇటీవలే ‘అలవైకుంఠపురములో’ మూవీతో కేరిర్లో బిగ్గెస్ట్ హిట్టు అందుకుంది.

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ 20వ మూవీలో, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తోంది. ఈ అమ్మడికి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగుతోపాటు బాలీవుడ్ పూజా హెగ్డే క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అదేవిధంగా బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రాధే’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ సెట్స్ పై ఉండగా సల్మాన్ ఖాన్ ఫర్హద్ సంజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘కబీ ఈద్ కబీ దివాళీ’ మూవీలో సల్మాన్ సరసన పూజా హెగ్డే ఎంపికవగా వచ్చే ఏడాది ఈద్ కానుకగా సినిమా రాబోతుందని తెలుస్తోంది.

నక్సలైట్ పాత్రలో ‘చిరు’త?

చిరంజీవి-152వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ కాంబినేషన్లలో చిరంజీవి-152వ సినిమా ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ మూవీ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ ఎండోన్మెంట్ ఆఫీసర్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు. అదేవిధంగా మరో పాత్రలో చిరంజీవి నక్సలైట్ గా కనిపించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ పాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కాగానే రాంచరణ్ ఈ మూవీలో నటించనున్నారు.

చిరంజీవి-152వ మూవీలో రాంచరణ్ నటించనున్నారని తెల్సిన తర్వాత ఆయన ఓ పాత్ర చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. చిరంజీవితో రాంచరణ్ గతంలో ‘మగధీర’, ‘బ్రూలీ’ వంటి చిత్రాల్లో నటించాడు. అయితే కేవలం గెస్ట్ రోల్, పాటల్లో మాత్రమే తళుక్కున మెరిపి మాయమైపోయేవి. అయితే ఈ మూవీలో రాంచరణ్ దాదాపు 40నిమిషాలపాటు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఈ మూవీలో నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే చిరంజీవి యుక్త వయస్సు పాత్రలో రాంచరణ్ నటిస్తారా? లేక దర్శకుడు కొరటాల రాంచరణ్ కోసం ప్రత్యేక బ్యాక్ డ్రాప్ సిద్ధం చేశాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇప్పటికే చిరంజీవి మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖారారైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉండటంతో ఆయన పాత్ర మినహా మిగతా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కాంప్లీట్ అయ్యాక రాంచరణ్ చిరంజీవి-152వ మూవీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ గా త్రిష ఎంపికైన సంగతి తెల్సిందే. చిరంజీవి-రెజీనాల మీద ఇటీవలే ఓ ఫోక్ సాంగ్ చిత్రీకరించారు. ఈ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ బాణీలను సమకూరుస్తున్నాడు. ఒకే సినిమాలో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రెండు పవర్ ఫూల్ పాత్రలో కనపించబోతుండటంతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.

మెగాస్టార్ మూవీలో సమంత?

chiru samantha

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో సమంత రంగంలోకి దిగనుందని తెలుస్తోంది. ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ తో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. ఈ మూవీలో మెగాస్టార్ తోపాటు పలువురు స్టార్లు కూడా కనిపించబోతుండటంతో ఈ మూవీపై రోజురోజుకు మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో మెగాస్టార్ తనయుడు ఓ కీలక పాత్రలో రాంచరణ్ నటించనున్నాడు. ఈ మూవీలో రాంచరణ్ కు జోడీ సమంత నటించనున్నారని ప్రచారం జరుగుతుంది.

చిరంజీవి ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారికి కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ గా త్రిష ఎంపికైంది. అలాగే మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ పొడ్యూసర్ అయిన రాంచరణ్ కూడా ఈ మూవీలో దాదాపు 30నిమిషాల పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. రాంచరణ్ నక్సలైట్ గా చేయనునట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే రాంచరణ్ కు జోడీగా రంగస్థలం బ్యూటీ సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటీకే ఈ మాస్ సాంగ్ హీరోయిన్ రెజీనాతో మెగాస్టార్ ఆడిపాడారు. దీంతో ఈ మూవీలో చాలామంది స్టార్లు కనిపించనున్నారు. రోజుకో స్టార్ మెగాస్టార్-152వ మూవీలో వచ్చి చేరుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చిరంజీవి-152వ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైనట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో బీజీగా ఉన్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కాంప్లీట్ అయ్యాక రాంచరణ్ ఈ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే 30రోజులు కాల్షిట్లు దర్శకుడు కొరటాల శివకు కేటాయించినట్లు తెలుస్తోంది. రాంచరణ్ పాత్ర మినహా మిగతా షూటింగ్ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఈ మూవీని 150కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత రాంచరణ్ మ్యాట్నీ మూవీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకురుస్తున్నారు.

రచ్చ గెలిచి…ఇంట గెలవలేకపోతున్న బీజేపీ

భారతీయ జనతా పార్టీ ఉత్తరాన ఉన్న అన్ని రాష్ట్రాలలో తన ప్రభావం చూపగలుగుతున్నా..ఢిల్లీ పరిస్థితి మాత్రం అందని ద్రాక్షలా మారింది. 2014 నుంచి దేశంలో ఉన్న సగానికి పైన రాష్ట్రాలలో అధికారం చేజికుంచుకున్న.. కొన్ని రాష్ట్రాలు మాత్రం బీజేపీకి పెద్ద సవాలుగానే మిగిలిపోయాయి.

దక్షణాది రాష్ట్రాలలో కర్ణాటక మినిహాయించి అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే హవా. ఉత్తరాది రాష్ట్రాలలో మాత్రం జాతీయ పార్టీల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగానే బీజేపీ అన్ని రాష్ట్రాలలో తన ముద్ర వేసింది కానీ…దేశ రాజధాని అయిన ఢిల్లీలో మాత్రం సరి అయిన వ్యూహాలు రచించలేక పోతుంది.

దేశాన్ని పాలించే ఏ పార్టీ అయిన రాజధాని నుంచే తన పాలనా చేయాల్సి ఉంటుంది. అలాంటి దేశ రాజధానిలో అధికార పార్టీ విజయం సాధించలేక పోతే అది ఒక చెరగని మచ్చలా మారుతుంది. ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకి ఏడు స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది..దీనితో ఢిల్లీ పీఠం బీజేపీదే అని అంచనా వేశారు..కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ..మరల ప్రజలు కేజ్రీవాల్ కే పట్టం కట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచినా…అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడటం బీజేపీకి కోలుకోలేని దెబ్బె. దీన్ని బట్టి ప్రజలు కేజ్రీవాల్ కే మొగ్గు చూపుతున్నారన్న విషయం అర్ధం అవుతుంది. పార్లమెంటు ఎన్నికలకి…అసెంబ్లీ ఎన్నికలకి పూర్తి వ్యత్యాసం ఉంటుంది.

ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడిగా కేజ్రీవాల్ కి మంచి గుర్తింపు ఉంది. అతను ప్రవేశపెట్టిన పధకాలు ప్రజలని కట్టి పడేశాయి. అమిత్ షా ఎన్ని పధకాలు పన్నిన.. ఎన్ని వ్యూహాలు రచించినా.. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించలేక పోయాడు. జరుగుతున్న పరిస్థితులని చూస్తుంటే బీజేపీ క్రమక్రమంగా అసెంబ్లీ స్థానాలలో తన పట్టు కోల్పోతూ వస్తుంది. అమిత్ షా వ్యూహాలు పనిచేయటం లేదనే వాదనకూడా ప్రజల్లో గట్టిగ వినిపిస్తుంది. ఇకనైనా బీజేపీ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమైతే…ఇతర రాష్ట్రాలలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది