Home Blog Page 8627

జగన్-మోడీ తెరవెనుక మంతనాలు?

జగన్ ఢిల్లీ పర్యటనపై పలురకాల ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు ఏకరువు పెట్టినా అది కేవలం పైకి చెప్పేది మాత్రమేనని అందరూ అనుకుంటున్నారు. మరి అసలు విషయమేంటి? ఇదే అందరికీ ఊహాగానాలకు తావిచ్చింది. ఏమయ్యుంటుందో తర్కంతో ఆలోచిస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
ఎవరెన్నిచెప్పినా తనముందు సిబిఐ కేసులు పెట్టుకొని వాటిని ప్రస్తావించకుండా జగన్ ఉంటాడని ఎవరూ అనుకోవడంలేదు. తనేకాదు ఇప్పుడున్న రాజకీయనాయకులెవరూ అంత పవిత్రంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా ఉంటారని వూహించలేము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోత్కుపల్లి నరసింహులు కి గవర్నర్ పదవి కోసం లాబీ చేసిన సంగతి పత్రికల్లో చూసాం. దానితోపాటు ఎన్నో వ్యక్తిగత ఫేవర్లకోసం మోడీ దగ్గర లాబీ చేయటం తోటే వాళ్ళిద్దరిమధ్య దూరం మరింతపెరిగిందని చెబుతారు. మరి ఇప్పుడు జగన్ తన కేసుల గురించి ప్రస్తావించకుండా ఉంటాడని ఎలా అనుకుంటాము. రాజకీయనాయకులందరూ ఆ తాను ముక్కలే.

రెండోది, మోడీ త్వరలో కాబినెట్ విస్తరణ చేబడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న రాజకీయపరిస్థితుల్లో వైస్సార్సీపీ ని ఎలాగైనా ఎన్ డి ఎ లోకి లాగాలని మోడీ ప్రయత్నంచేస్తున్నాడు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇంతకుముందు ఆఫర్ చేయటం జరిగింది. అందుకు అప్పట్లో జగన్ సుముఖంగా లేడు. ఇప్పటివరకూ ఆ పదవి ఖాళీగానే వుంది. కాబట్టి అటు క్యాబినెట్ లోకి, ఇటు డిప్యూటీ స్పీకర్ పదవికి జగన్ ని ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే జగన్ కి బీజేపీ తో చేరటంపై కొన్ని సందేహాలున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తో కలిస్తే మైనారిటీలు దూరం అవటం ఖాయం. అలాగే ప్రత్యేక హోదా పై హామీ ఇవ్వకుండా కేంద్రంలో చేరితే చంద్రబాబు నాయుడుకి , తనని వ్యతిరేకించే మీడియా కి అస్త్రం అందించినట్లవుతుందని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. కానీ అదేసమయంలో మోడీతో సఖ్యతగా లేకపోతే తన కేసులేమవుతాయోననే భయం వెన్నాడుతుంది. అందుకనే మోడీ కి ఖచ్చితంగా నో చెప్పలేని పరిస్థితి.తన అనుయాయుల్లో ముఖ్యంగా విజయసాయి రెడ్డి , మిదున్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వంలో చేరితేనే మంచిదని సలహా ఇస్తున్నట్లు తెలుస్తుంది.

తెరవెనుక ఏదో జరగకపోతే మరలా అమిత్ షా ని కలవటానికి ఎందుకు వెళుతున్నట్లు? ఈ లోపల తెలుగుదేశం కూడా కేంద్రం లో లాబీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ భయమల్లా వైస్సార్సీపీ మోడీకి దగ్గరైతే చంద్రబాబు నాయుడు వారి అనుచరులపై కక్ష సాధింపుచర్యలు ముమ్మరమవుతాయని భయం పట్టుకుంది. పైకిచెప్పే మండలి తగాదా జనానికి పూలు పెట్టటానికే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి గా పనిచేసిన వ్యక్తిని 5 రోజులు సిబిఐ విచారణ జరపటం తెలిసిందే. జగన్ కి చంద్రబాబు నాయుడు ని ఎలాగైనా బుక్ చేయాలనే కక్ష చాలా బలంగా వుంది. అదే చివరకి మోడీ కేబినెట్ లోకి చేరటానికి పుసిగొల్పచ్చని అనుకుంటున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో వీటిపై మరింత క్లారిటీ రావచ్చనేది అభిజ్ఞుల అంచనా.

కిస్ డే స్పెషల్: టాలీవుడ్ లోని టాప్ లిప్-లాక్ సీన్స్

 

ఒకప్పుడు తెలుగు సినిమాలో ముద్దు సీన్లు చాలా అరుదుగా చూసేవాళ్లం.. ఆ ముద్దు సీన్స్ కూడా చూపించి చూపించనట్టు పువ్వులను అడ్డం పెట్టి చిత్రీకరణ చేసేవారు.

కాగా రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి.. ఇటీవల కాలంలో పెద్ద నటీ నటులు మహేష్ బాబు, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ మరియు సమంతా వంటివారు కూడా ఎలాంటి జంకు లేకుండా కిస్ సీన్స్ కు సై అంటున్నారు.

ఈ మధ్య కాలంలో  విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి లో లిప్-లాక్ సీన్ హైలైట్ కావడంతో కొత్త గా వచ్చిన ఆర్ఎక్స్ 100, గూడచారి, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ మరియు అనేక సినిమాలు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి.

అయితే ఈ రోజు వాలెంటైన్స్ వీక్ యొక్క ఏడవ రోజు (ఫిబ్రవరి 13)న ముద్దు రోజుగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా, జంటలు ముద్దు పెట్టుకోవడం ద్వారా ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇదే తరహాలో టాలీవుడ్‌ సినిమాలలోను..కిస్ సీన్స్ తరుచు చూస్తున్నాం.

టాలీవుడ్ లోని టాప్ ముద్దు సీన్లు కింద చూడవచ్చు…

https://youtu.be/LVtqK2Ay1gk

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

 

రానా అరణ్య మూవీ టీజర్

రానా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `హాథీ మేరే సాథీ`. ఇది హిందీ వెర్షన్ టైటిల్. తెలుగులో అరణ్య.. తమిళంలో `కదన్` పేరుతో రిలీజవుతోంది. అరణ్యంలో జంతువులకు రక్షకుడిగా రానా నటిస్తున్నారు. గజరాజు (కుంకీ) ఫేం ప్రభు సోల్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ చేసారు. 2020 పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.

‘పిల్ల పులి’ సాంగ్.. ఆకాశం నీ హద్దురా

సూర్య లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’ ఈ సినిమా నుండి ‘పిల్ల పులి’ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. సాంగ్ లో లవ్ ఫీలింగ్ తో పాటు ఎమోషన్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ఎయిర్ డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది.

దగ్గు తగ్గించే చిట్కాలు

దగ్గు మనతో పాటు పక్క వారికీ కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దగ్గు బాగా రావడం వలన గొంతు నొప్పి ఆయాసం కూడా కలుగుతుంది ..
పొడి దగ్గు నివారణ చిట్కాలను కొన్ని తెలుసుకుందాం.

1.కరక్కాయను పగల గొట్టి చిన్ని ముక్కను బుగ్గన ఉంచుకొని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్దీ కొద్దిగా మింగుతూ ఉంటే సాధారణం వచ్చే     దగ్గు తగ్గిపోతుంది.

2. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా యాలుకల పొడి, లవంగాల పొడి కలుపుకొని నెమ్మదిగా తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది. ఇలా                  కాకపోయినా లవంగంను నోటిలో ఉంచుకొని చ ప్పరించిన పొడి దగ్గు తగ్గుతుంది.

3. ఒక అరచెంచా అల్లం రసంలో ఒక చెంచా తేనె కలుపుకొని ప్రతి రోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దాని        వలన కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుంది.

4. గోరు వెచ్చని పాలలో కొద్దిగా యాలుకల పొడి, మిరియాల పొడి కలుపుకొని రాత్రి పాడుకొనే ముందుగా తాగితే దగ్గు తగ్గి సుఖ                నిద్ర కలుగుతుంది.

5. ఒక స్పూను తులసి ఆకు రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫం వలన వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది.

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. నందమూరి ఫ్యామిలీ నుంచి త్వరలోనే మరో హీరో తెరపై కనిపించబోతున్నాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ అమెరికాలో నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. న్యూయర్క్ లోని స్టార్స్ బర్గ్ ఫీలిం ఇన్టిట్యూట్లో యాక్టింగ్ కు సంబంధించి ఒక కోర్సు చేస్తున్నాడని తెల్సింది. ఈ శిక్షణ పూర్తవగానే మోక్షజ్ఞ సిమాల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది.

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్ హీరోయిజం ఉన్న నటుడు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాన్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్లు ఎందరో ఉన్నారు. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి డజనుపైగా హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. అలాగే నాగార్జున కుమారుడు నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు.

అయితే బాలకృష్ణ కుమారుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో నందమూరి అభిమానులు కూడా ఆయన ఎంట్రీపై ఆశలు వదులుకున్నారు. తాజాగా మోక్షజ్ఞ నటనలో శిక్షణలో తీసుకుంటున్నారనే వార్త తెలియడంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అయితే నటనలో ఇంట్రెస్ట్ లేని మోక్షజ్ఞ సినిమాల్లో ఎంతవరకు రాణిస్తారనేది భవిష్యత్లో తేలనుంది. ఏదిఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీ నందమూరి అభిమానులకు శుభవార్తే అని చెప్పొచ్చు.

‘చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తీకేయ

‘ఆర్ఎక్స్-100’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన హీరో కార్తీకేయ. పక్కంటి కుర్రోడిలా కన్పించే కార్తీకేయ ‘ఆర్ఎక్స్-100’ విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మూవీ హిట్టుతో కార్తీకేయ సినిమా ఆఫర్లు భారీ వచ్చాయి. ఇటీవల కార్తీకేయ చేసిన సినిమాలు ‘గుణ-369’, ‘90ఎంఎల్’ సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. దీంతో కథల ఎంపికలో ఆచితుచి వ్యహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘చావుకబురు చల్లగా’ అనే మూవీకి కార్తీకేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ‘చావుకబురు చల్లగా’ మూవీ గురువారం ప్రారంభమైంది. ఈమేరకు ఈ మూవీ ఫస్టు లుక్ ను సినిమా బృందం విడుదల చేసింది. కార్తకేయ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. గల్లా చొక్కా, గల్లా లుంగీతో ఏపీ వాహనంపై స్టైల్ గా స్మోక్ చేస్తున్న కార్తీకేయ స్టీల్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కార్తీకేయ బాలరాజుగా నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్టు లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. నేటి నుంచి ‘చావుకబురు చల్లగా’ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూవీలో కార్తీకేయ జోడిగా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. తొలిసారి కార్తీకేయ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న కార్తీకేయకు ఈ మూవీ తీపి కబురు పంచుతుందా? లేక చావుకబురు మిగులుస్తుందా? అనేది త్వరలోనే వెల్లడికానుంది.

రేణు దేశాయ్ కోసం ఇల్లు కొన్న పవన్ కళ్యాణ్?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వారిపై గోస్సిప్స్ రావడం సర్వసాదారణం. తాజాగా పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ కోసం హైదరాబాద్ లో ఒక ఇల్లు కొన్నారని ఓ వార్త ఫిలిం సర్కిల్ లో చేకార్లు కొడుతుంది.

పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరా, ఆధ్య పెద్దవారు కావడంతో వారి భవిష్యతును తీర్చిదిద్దే భాద్యత పవన్ పై ఉంది. ఈ సమయంలో పిల్లలు పవన్ కు దగ్గరలో ఉండడం మంచిదని భావించి, రేణు దేశాయ్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యిందంట. అకిరాను ఎప్పటికైనా హీరోని చెయ్యాలనే ఆలోచనలో రేణు దేశాయ్ ఉందని సమాచారం.

రేణు దేశాయ్ మరియు పిల్లల కోసం పవన్ కళ్యాణ్ ఒక అపార్ట్మెంట్ కొన్నారని ఫిలిం ఇండస్ట్రీ లో టాక్. మురళి మోహన్ కు చెందినా వెంచెర్ లో ఒక ఖరీదైన ఫ్లాట్ కొన్నాడట. ఇది ఎంత నిజామో తెలియాలంటే రేణు దేశాయ్ కానీ పవన్ కానీ నోరు విప్పితెగని తెలియదు.

 

 

రూ 2,000 కోట్లకు మించి అప్పు చేయలేని స్థితిలో జగన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొంటున్నారు. చివరకు అప్పులు కూడా చేయలేని దుస్థితికి చేరుకున్నారు.

రూ 2,000 కోట్లకు మించి అప్పులు చేయలేరని కేంద్రం తేల్చి చెప్పగా, కాదు రూ 8,000 కోట్ల వరకు తమకు రుణ పరిమితి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఈ విషయమై కేంద్రం నుండి స్పందన కనిపించడం లేదు. అంటే మరో రెండు నెలలవరకు ఈ నిధులతోనే కాలం గడపవలసి ఉంది.

ఐతర రుణాల మాటెలా ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్‌ రుణాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దొరికినంతా తీసుకుంది.
ఆర్ధిక సంవత్సరం తొలి వారంలోనే ఒకేసారి ఐదుసార్లు ఐదు వేల కోట్లను రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి క్రమం తప్పకుండా రిజర్వ్‌బ్యారకు వేలం పాటలో పాల్గొని ఇప్పటివరకు రూ 34,400 కోట్లు తీసుకోండి.

ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట ప్రకారం ఇంకా రెండు వేల కోట్లు మాత్రమే రుణం తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు తేలింది. వాస్తవానికి 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రూ.32,416 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇందులో డిసెంబర్‌ వరకు రూ.28,967 తీసుకోవచ్చునని పేర్కొంది.

కాగా, జనవరిలో మరో రూ.7,428 కోట్లకు కొత్తగా అనుమతి మంజూరు చేసింది. దీంతో మొత్తం తీసుకోగలిగిన రుణం రూ.36 వేల కోట్లకు చేరుకోగా, అందులో జనవరి చివరి నాటికి రూ.33,966 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వినియోగిరచుకుంది. ఈ నెల ఏడో తేదీన మరో రూ.438 కోట్లు వినియోగించుకోగా, ఇంకా రూ.1992 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఎక్కడ అప్పు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది శరాఘాతంగానే మారింది.
ఇలా ఉరడగా, కేంద్రం చెబుతున్న గణారకాలతో రాష్ట్ర ప్రభుత్వం విభేదిస్తోంది. కేంద్రం కేవలం రూ.1992 కోట్లు మాత్రమే పరిమితి ఉంటుందని చెబుతుండగా, రాష్ట్రం మాత్రం రూ.8,905 కోట్లని వాదిస్తోంది.

డిస్కామ్‌లకు గత మూడేళ్ల కాలంగా చెల్లించాల్సిన బకాయిల్లో రూ.2,983 కోట్ల రూపాయల వరకు బకాయిలను తాము చెల్లించామని, నబార్డ్‌ నుండి రావాల్సిన రూ.1,800 కోట్లకుగాను రూ.1,200 కోట్లు మాత్రమే తీసుకున్నామని, వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.8,905 కోట్ల రూపాయలను ఇరకా బహిరంగ మార్కెట్‌ ద్వారా రుణాలుగాతీసుకొనేందుకు తమకు అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఒకవేళ అదనపు రుణానికి కేంద్రం ఆమోదించని నేపథ్యంలో ఇక ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలపైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్లకు గ్యారంటీ ఇస్తూ వాటి రుణాలను సమీకరించుకోవాలని, వాటిని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చునని వారు చెబుతున్నారు.

Naga Shaurya New Movie Launch Photos

సుత్తిలో బంగారం..అడ్డంగా దొరికిన ప్రయాణికుడు

ఇతర దేశాల నుంచి ఆశ్రమంగా భారతదేశంలోకి బంగారం తీసుకొనిరాటానికి కేటుగాళ్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే దుబాయ్ నుంచి 931 గ్రామూల బంగారాన్ని సుత్తిలో పెట్టి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులని హైదరాబాద్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అలాగే దుబాయ్ నుంచి వస్తున్న మరో వ్యక్తి దగ్గర కూడా..సుత్తిలో 931 గ్రాముల బంగారం దొరికింది. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మరో ఘటనలో దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న ఇద్దరి ప్రయాణికుల దగ్గర మిక్సీలో దాచిన 650 గ్రాముల బంగారం లభించింది.

ఇలా అన్ని ఘటనలలో కలిపి మొత్తం రెండు కిలోల దాక బంగారం లభించిందని అధికారులు తేల్చారు. వీరిపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి..అరెస్ట్ చేసారు. దీని గురించి విన్న వాళ్లంతా సుత్తిలో బంగారం తరలించటం ఏంటబ్బా.. విడ్డురంగా..అంటూ..విస్మయానికి లోనయ్యారు.

ఇన్‌స్టాగ్రామ్‌ లో టాప్ తెలుగు హీరో ఎవరో తెలుసా…?

ఇన్‌స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్… ఇందులో ఫోటోలు, వీడియో క్లిప్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఒకటిగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రావడంతో, సెలబ్రిటీలు తమ ఫోటోలను వ్యక్తిగతంగా లేదా ప్రొఫెషనల్‌గా షేర్ చెయ్యడం ప్రారంభించారు. ఐతే టాలీవుడ్ హీరోలు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అభిమానులను అలరించడమే కాకుండా ఆకట్టుకునే ఫాలోయింగ్ ను పాదించుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ లో టాప్ ఫాలోయింగ్ కలిగి ఉన్న తెలుగు హీరోలు వీరే..!

1.విజయ్ దేవరకొండ – 5.9M ఫాలోవర్స్

విజయ్ దేవేరకొండ చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్ద పేరు తెచ్చుకున్నాడు,సెన్సషనల్ స్టార్ గా పిలవబడే విజయ్ దేవేరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ టాప్ హీరోగా నిలిచాడు. 30 ఏళ్ల ఈ నటుడికి 5.9 మిలియన్ల భారీ ఫాలోయింగ్ ఉంది.

 

2.అల్లు అర్జున్ – 5.3M ఫాలోవర్స్

స్టైలిష్ స్టార్ గా పిలవబడే అల్లు అర్జున్ తరుచు ఇన్‌స్టాగ్రామ్ లో తన సినిమా, కుటుంబానికి సంబందించిన ఫొటోస్ వీడియోస్ ని షేర్ చేస్తూ హుషారు గా ఉంటాడు, 37 ఏళ్ల ఈ నటుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.3 మిలియన్ల భారీ ఫాలోయింగ్ ఉంది.

 

3.మహేష్ బాబు – 4.2M ఫాలోవర్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్రముఖుల జాబితా ఎ-లిస్ట్ నటులలో మహేష్ బాబు ఒకరు. ఈ స్టార్ హీరో తన కొత్త ప్రాజెక్టుల గురించి మరియు తన కుటుంబంతో దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటాడు, ఈ సూపర్ స్టార్ కి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్ల ఫాలోయింగ్ ఉంది.

 

4.ప్రభాస్ – 4.1M ఫాలోవర్స్

ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ మాత్రమే కాదు, అంతర్జాతీయ ఐకాన్ కూడా. 2019 ఏప్రిల్‌లో తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన ఈ రెబల్ స్టార్ ప్రభాస్ కి 4.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

 

బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్ లో అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ (జోష్ దర్శకుడు) కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ మూవీ అనుకున్నంత విజయం సాధించాలేకపోయింది. అఖిల్ చాల రోజుల గ్యాప్ తరువాత ఈ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మద్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ లుక్ ని ప్రొడక్షన్ టీం రిలీజ్ చేసారు, పోస్టర్‌లో ఫారిన్ వీధుల్లో కాళ్లకి చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నాడు అఖిల్. ఈ సినిమా ని వేసవిలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పుడు అఖిల్ కొత్త ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో హిట్ అయిన ‘బదాయి హో’ రీమేక్ లో నటించాలని అనుకుంటున్నారట. ఈ సినిమా హక్కులని సితార ఎంటర్టైన్మెంట్స్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మోడీ జగన్ గంటకు పైగా దీని గురించే చర్చించుకున్నారంట..

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లి మోడీని కలిసిన సంగతి అందరికి తెలిసిందే..అయితే వాళ్ళు ఏమి చర్చించుకున్నారు అన్న దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న జగన్..దాదాపు గంట నలబై నిమిషాల పటు మోడీతో సమావేశం అయ్యారు. జగన్ మోడీకి పది అంశాలతో కూడిన నివేదిక అందచేసినట్లు వార్తలు వినిపించాయి.

అవేంటంటే..

  • రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం గురించి జగన్ మోడీకి వివరించారు.
  • హై కోర్టును కర్నూలుకు తరలించే విధంగా న్యాయశాఖకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరారు.
  • శాసన మండలి రద్దు విషయాన్ని జగన్ మోడీ దృష్టికి తీసుకెళ్లారు.
  • మహిళలకు అండగా నిలబడే దిశా చట్టాన్ని ఆమోదించే విధంగా హోం శాఖకు అదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.
  • మార్చి 25వ తారీఖున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు.
  • తూర్పు గోదావరి జిల్లాలోని 800 ఎకరాల ఉప్పు భూమిని ఇళ్ల పట్టాలకు కేటాయించాల్సిందిగా జగన్ మోడీని కోరారు.
  • రాష్ట్రం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చుపెట్టిన 3320 కోట్లు వెంటనే విడుదల చేయల్సిందిగా జగన్ విజ్ఞప్తి చేసారు.
  • రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే..ప్రత్యేక హోదా తప్పనిసరి అని మోడీని కోరారు.
  • రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన రెవిన్యూ లోటును భర్తీ చేయాలనీ జగన్ కోరారు.
  • గతంలో ఎన్నడు లేని విధంగా ఏపీకి అతి తక్కువ గ్రాంట్లు వచ్చాయని..పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాలనీ విజ్ఞప్తి చేసారు.
  • కడప స్టీలు ప్లాంట్, రామాయపట్నం పోర్టుకి నిధులు మంజూరు చేయాల్సిందిగా జగన్ మోడీకి అభ్యర్ధన చేసారు.
  • కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాల్సిందిగా జగన్ మోడీని కోరారు.
  • రాజధాని నిర్మాణం కోసం నిధులు మరియు వెనకబడిన జిల్లాల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిందిగా జగన్ మోడీని కోరారు.

ఈ అంశాలపై జగన్ మోడీతో సుదీర్ఘంగా గంటకు పైగా చర్చించి..సానుకూల స్పందన వస్తుందనే నమ్మకంతో ఏపీకి తిరుగుపయనం అయ్యారు.

రూ 3 లక్షల కోట్ల అప్పుల్లో కేసీఆర్!

మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను రూ 3 లక్షల కోట్ల అప్పుల్లొకి ముఖ్యమంత్రి కేసీఆర్ నెట్టివేశారని అంటున్నారు నిజామాబాదు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్రం నుండి సుమారు రూ 2 లక్షల కోట్లు లభించాయని చెబుతూ కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పక పోతే, తప్పు తేలితే ఫామ్‌‌‌‌హౌజ్ నుంచి శ్రీకృష్ణుడి జన్మస్థలానికి పంపించే కార్యక్రమాలు ఉంటాయని కూడా హెచ్చరించారు.

ఆరేళ్లలో కేంద్రం దాదాపు రూ.1.52 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ లో చెప్పారు. జీఎస్టీ పన్నుల పరిహారం, లోకల్‌‌‌‌బాడీలకు నిధులు, కేంద్ర పథకాల వాటాను కలుపుకుంటే సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిందని అరవింద్ వివరించారు.

ఫెర్టిలైజర్స్ సబ్బిడీ, రేషన్‌‌‌‌బియ్యంపై సబ్సిడీ, ఉపాధిహామీ నిధులు, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్‌‌‌‌ యోజన వంటి సబ్సిడీ స్కీమ్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ ఈ లిస్ట్‌‌‌‌లో లేవన్నారు. ఫైనాన్స్‌‌‌‌పవర్ కార్పొ రేషన్ నుంచి రూ 70 వేల కోట్లు, బ్యాంకుల నుంచి వంద కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుందని తెలిపారు.

కేంద్ర నిధులు, అప్పుల రూపంలో సమకూరిన రూ. 6 లక్షల కోట్లను రాష్ట్ర సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. కేవలం రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలే నడుస్తున్నాయని.. వీటి పేర్లతో కేసీఆర్ పైసలు లోపల వేసుకున్నారని ఆరోపించారు.

కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్.. నిధులు కావాలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని పైసలు ఇవ్వాలని కోరితే, ప్రశ్నలు అడుగుతుందనే భయంతోనే ఫండ్స్‌‌‌‌ కావాలని అడగడం లేదని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో రాష్ట్రానికి కేసీఆర్ పెద్ద గుడ్డు (గాడిద గుడ్డు) మిగిల్చారని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు.

పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు పీఎంఏవై ఫేజ్-1, ఫేజ్-2 లో భాగంగా పేద ప్రజల కోసం 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాయని, చివరకు కొత్త కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన లఢక్‌‌‌‌లోనూ 12 వందల ఇండ్లు కట్టారని చెప్పారు. అయితే, అన్ని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మాత్రమే సున్నాతో నిలిచిందని ధ్వజమెత్తారు.

డబుల్ బెడ్ రూమ్‌‌‌‌ ఇండ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన సర్కార్, పేద మహిళలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. పీఎంఏవైలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, అయితే, ఆ నిధుల వినియోగం, ఖర్చుల వివరాలు కోరితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

నా ఫోకస్ దానిపైనే: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ, చిత్ర యూనిట్ బీజీగా ఉంది. విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్లలో తనపై పెళ్లిపై వచ్చిన ప్రశ్నపై ఆయన స్పందించారు. పెళ్లిపై తనకు నమ్మకం ఉందని.. అయితే ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపై ఉందని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. మరిన్ని సినిమాలు చేసే అభిమానులను అలరించడమే తన ధ్యేయమని చెప్పారు. ప్రస్తుతానికి ఐయమ్ సింగిల్ అంటూ చెబుతున్నాడు.

‘పెళ్లిచూపులు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ‘మహానటి’, టాక్సీవాలా, డీయర్ కామ్రేడ్, గీతాగోవిందం మూవీలతో వరుస విజయాలను అందుకున్నాడు. 2020లో వాలంటైన్స్ డే కానుకగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై విజయ దేవరకొండ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లె లైట్, కేథరిన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్టు లుక్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు కాంత్రి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేఎస్.రామారావు నిర్మాత. గోపి సుందర్ ఈ సంగీతాన్ని అందిస్తున్నాడు.