Home Blog Page 318

Jammu Kashmir Transformation: జమ్ము కాశ్మీర్ మారిపోయింది.. నరేంద్ర మోడీ కూడా ఊహించలేదు..

Jammu Kashmir Transformation: మన స్వస్థలాన్ని వదిలి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుంది.. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ మన పురిటి గడ్డకు వస్తే ఎంతటి ఆవేదన ఉంటుంది.. ఆ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేం. అప్పట్లో సునామీ వచ్చినప్పుడు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలామంది బతుకు జీవుడా అనుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత సునామీ వచ్చిన రోజున గుర్తుకు తెచ్చుకొని చెన్నై వస్తుంటారు. తమ వాళ్ళు కళ్ళముందే చనిపోవడంతో.. ఆ బాధను తట్టుకోలేక.. సముద్రాన్ని చూసి విలపిస్తుంటారు. ప్రకృతి విలయం వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అటువంటిది సాటి మనుషులు దారుణానికి పాల్పడితే.. మారణ హోమానికి కారణమైతే.. వారి వల్ల ఆప్తులను కోల్పోయి.. కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు వెళ్తే.. ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుంది. ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది. అటువంటి బాధను దశాబ్దాలుగా మోశారు కాశ్మీర్ పండిట్లు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ము కాశ్మీర్లో ఎన్నికలు జరిగిన తర్వాత.. అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ.. జమ్ము కాశ్మీర్లో ఒకప్పటి మాదిరిగా పరిస్థితి ఒకప్పటి మాదిరిగా లేదు. తాజా పరిస్థితులు అక్కడ మారిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లు జమ్ము కాశ్మీర్ తిరిగి వస్తున్నారు. అక్కడ మూతపడిన మందిరాలను తెలుస్తున్నారు. గుడులను శుభ్రపరుస్తున్నారు. ఆలయాలను పూర్తిగా పునర్నిర్మిస్తున్నారు. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. కాశ్మీర్ పండిట్లకు స్థానికంగా ఉన్న ముస్లింలు కూడా సహకరిస్తున్నారు. 19 89, 90 కాలంలో ఏ ముస్లింలు అయితే కాశ్మీరీ పండిట్లను కాశ్మీర్ నుంచి వెళ్లగొట్టారో.. వారే ఇప్పుడు కాశ్మీర్ పండిట్లకు సహకరిస్తున్నారు.

ఇటీవల నార్త్ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో చందిగ్రామ్ మందిరాన్ని పున ప్రతిష్టించారు.. దీనికోసం స్థానికంగా ఉన్న ముస్లింలు కాశ్మీర్ పండిట్లకు సహకరించారు.. బారా ముల్లా జిల్లాలోని కచ్వా ప్రాంతంలో వినాయకుడి ఆలయాన్ని కూడా బాగు చేశారు. ఈ ఆలయాన్ని వదిలి వెళ్ళిన తర్వాత పూర్తిగా నాశనమైపోయింది. అక్కడి అధికారులు చుట్టూ కంచె మాత్రమే నిర్మించారు. కాశ్మీర్ పండిట్లు ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. ఫలితంగా ఆలయం ఇటీవల పున ప్రారంభమైంది.

ఆలయాలను పునరుద్ధరించడం మాత్రమే కాకుండా.. గతంలో ఉన్న లెక్కలను సైతం కాశ్మీరీ పండిట్లు, హిందువులు బయటికి తీస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆలయాల కోసం గతంలో ఉన్న 3,729 కనాల్స్ భూమిని కేటాయించినట్టు తెలుస్తోంది. గతంలో మాదిరిగా ముస్లింలు లేరు. గతంలో మాదిరిగా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం లేదు. మొత్తంగా చూస్తే జమ్ము కాశ్మీర్లో ఒకప్పటి వాతావరణం కనిపిస్తోంది. అందువల్లే గతంలో నిర్వహించినట్టుగానే జాతరలు,. వేడుకలు జరుపుకుంటామని కాశ్మీర్ హిందువులు, పండిట్లు పిలుపునిస్తున్నారు.. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముఖ్యంగా శ్రీనగర్లోని హిందువులు ఒకప్పుడు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కృష్ణాష్టమి, శ్రీరామనవమి, దుర్గాష్టమి వంటి వేడుకలు ఘనంగా జరుపుకుంటామని కాశ్మీరీ పండిట్లు చెబుతున్నారు.

వాస్తవానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇక్కడ వారు కలలో కూడా ఊహించలేదు. తాము తమ సొంత ప్రాంతాలకు వెళ్తామని కాశ్మీర్ పండిట్లు ఏమాత్రం అంచనా వేయలేదు. లాల్ చౌక్ ప్రాంతంలో జాతీయ జెండా ఎగురుతుందని ఏ భారతీయుడు కూడా అంచనా వేయలేదు. కానీ ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే జమ్ము కాశ్మీర్ లో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఇది మార్పునకు సంకేతం. రేపటి అందమైన భవిష్యత్తుకు సజీవమైన ముఖచిత్రం.

Vijay Court Case Before Oath: ప్రమాణ స్వీకారం కాకముందే.. కోర్టుకు విజయ్.. ఏం జరుగుతోంది..

Vijay Court Case Before Oath: తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయడం లాంచనమే. ఇప్పటికే ఆయన గవర్నర్ కు లెటర్ రాశారు. దానికి గవర్నర్ ఒప్పుకున్నారు. దీంతో విజయ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇది విజయ్ అభిమానుల్లో.. టీవీకే శ్రేణులలో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విజయ్ కి సంబంధించిన ఒక వ్యవహారం ఇప్పుడు మీడియాలో చర్చకు దారితీస్తోంది.

ఎన్నికలకు ముందు విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకుల కోరింది. ఆయన ఒక సినీ నటితో సంబంధంలో ఉన్నట్టు ఆమె అందులో ఆరోపించింది. ఎన్నికలకు ముందు సంగీత ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో విజయ్ రాజకీయ భవితవ్యం ఒకరకంగా ప్రశ్నార్ధకంలో పడింది. అయితే విజయ్ కి సంబంధించిన ఈ వ్యక్తిగత వ్యవహారాన్ని తమిళ ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. విజయ్ పార్టీకి ఏకం లగా 108 సీట్లు కట్టబెట్టారు.

ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. విజయ్ విడాకుల కేసు ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఈ కేసును చంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు విచారించింది. జూన్ 15 కు వాయిదా వేసింది.. నాడు సంగీత, జై తమ ముందు హాజరుకావాలని పేర్కొంది.. విజయ్ ప్రమాణస్వీకారం త్వరలో చేస్తుండడం.. ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏలబోతున్న నేపథ్యంలో.. చెంగల్పట్టు కోర్టు ఆయనకు మినహాయింపు ఇస్తుందా.. అనే ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది.

ఒకవేళ వ్యక్తిగతంగా హాజరు కాకపోతే విమర్శలు తప్పవు. హాజరైతే విడాకుల కోసం కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి అనే ప్రచారం కూడా జరుగుతుంది. విజయ్ , త్రిష సంబంధం అధికారికంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో ఆ బంధానికి ప్రజల నుంచి గ్రీన్సిగ లభించింది అని టీవీ కే కార్యకర్తలు అంటున్నారు.. సంగీత ఏదో జరుగుతుందని భావించారని.. చివరికి విజయ్ గెలవడంతో ఆయన భార్యహోదాని కూడా కోల్పోయారని టీవీ కే కార్యకర్తలు అంటున్నారు. మరికొందరేమో సంగీత మంచి నిర్ణయం తీసుకుందని.. ఆత్మ గౌరవాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదని ఆమెను సమర్థించారు..

విజయ్ సంగీత కోరినంత భరణం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అందువల్లే ఎన్నికల ముందు సంగీత నిశ్శబ్దంగా ఉన్నారని సమాచారం. ఒకవేళ త్రిష గనుక విజయ్ రాజీనామా చేసే స్థానం నుంచి పోటీ చేస్తే.. అప్పుడు కథ వేరే విధంగా ఉంటుంది. ఒకవేళ ఆమె తిరుచి ఈస్ట్ నుంచి గెలిస్తే జయలలిత, ఎంజీఆర్ ఎపిసోడ్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

West Bengal Election Results: బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ గెలిచిందట.. సీఎం పదవికి మమత రాజీనామా చేయదట

West Bengal Election Results: కిందపడినా నాదే పై చేయి అని వాదించే వాళ్ళతో మాట్లాడలేం. నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని వాళ్ళతో మాట్లాడే సాహసం చేయలేం. మమతా బెనర్జీ కూడా ఇదే టైపు. ఎప్పుడైతే తను కమ్యూనిస్టులను ఢీ కొట్టి అధికారంలోకి వచ్చిందో.. అప్పుడే ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా తుంగలో తొక్కింది. తన పార్టీ కార్యకర్తలను గుండాలుగా మార్చింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సార్వభౌమ అధికారాన్ని తాకట్టు పెట్టింది. కనీసం ఎటువంటి ఆధారాలు పరిశీలించకుండా అడ్డగోలుగా బంగ్లాదేశ్ ప్రజలకు ఆధార్ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. అంతేకాదు భారత్ అనేది అందరికీ నివాసయోగ్యమైన దేశమని వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్ ప్రజలు ఈ దేశంలో భాగమని నెత్తిలేని మాటలు మాట్లాడింది.

ఆర్థికంగా అవకతకలకు పాల్పడుతున్నారు.. డబ్బును రకరకాల ఖాతాలకు మళ్లిస్తున్నారు అనే అభియోగాలతో ఐ ప్యాక్ బృందం కార్యాలయాలపై కేంద్ర అధికారులు దాడులు చేస్తే నెత్తి నోరు మొత్తుకుంది మమత. చివరికి అధికారులకు అడ్డుగా నిలబడింది. తాను ఒక ముఖ్యమంత్రి అనే సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. అంతేకాదు పరిపాలనలో మేనల్లుడి జోక్యం పెరిగిపోయి.. వ్యవస్థలు మొత్తం నాశనమవుతున్నా పట్టించుకోని మమతా బెనర్జీ.. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోగానే మహానటి మాదిరిగా నటిస్తోంది. పైగా బెంగాల్ రాష్ట్రంలో లూటీ చేసి గెలిచారట. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయదట.

లోక్ భవన్ కు వెళ్ళదట.. వెస్ట్ బెంగాల్లో బిజెపి విజయం కోసం ఎన్నికల సంఘం, కేంద్రం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా కుట్ర చేశాయట. లెక్కింపు కేంద్రాలలో ఆమె పార్టీ కార్యకర్తలను దారుణంగా కొట్టారట. దేశంలో ఒకే పార్టీ ఉండాలని బిజెపి చూస్తోందట.. ఇలాంటి ఫెడరల్ పోకడలు మమతలో ఉన్నాయి కాబట్టే కదా బెంగాల్ ప్రజలు భవానిపూర్ ప్రాంతంలో ఓడించింది. నువ్వు వద్దు.. నీ పరిపాలన వద్దు.. అంటూ తన్ని తరిమేసింది.

బెంగాల్ రాష్ట్రాన్ని గొప్పగా పాలించానని చెబుతున్న మమత 2021లో ఎందుకు పడిపోయింది.. అప్పుడు బిజెపి ఇబ్బంది పెట్టిందా.. సిఆర్పిఎఫ్ బలగాలు టి ఎం సి కార్యకర్తలను కొట్టాయా.. లేకపోతే రిగ్గింగ్ చేశాయా.. నాడు నందిగ్రామ్ ప్రాంతంలో ఓటమిపాలైంది. తట్టుకోలేక భవాని పూర్ వచ్చింది. అక్కడ కూడా జనాలు కాండ్రించి ఉమ్మడంతో ఓడిపోయింది. ఇప్పటికైనా మమత నేల మీదికి రావాలి. 71 సంవత్సరాల వయసులో తదుపరి శేష జీవితాన్ని హాయిగా గడపాలి. ఇప్పటికే చాలామంది టీఎంసీ ఎమ్మెల్యేలు బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఎవరు పార్టీలో ఉంటారు తెలియని పరిస్థితి. అలాంటప్పుడు పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు మమత చేయాలి. బిజెపికి ఎదురు వెళ్లే వ్యవహారాలకు పాల్పడితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. కోడి ఎంత బలిసినా సరే.. చికెన్ షాప్ ముందుకు వెళ్లి తొడ కొట్టకూడదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mahesh Babu Namrata Relationship: మహేష్ బాబు నమ్రత ఇన్ని సంవత్సరాలైన కలిసి మెలిసి ఉండటానికి కారణం ఇదే…

Mahesh Babu Namrata Relationship: ఒక్కపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎవ్వరు పట్టించుకునేవారు కాదు…కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే తెలుగు సినిమాలు టార్చ్ బేరర్ గా మారిపోయాయి… మన స్టార్ హీరోలు సైతం వైవిద్య భరితమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం మొన్నటి వరకు తెలుగుకే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి పాన్ ఇండియాలో సైతం పెద్దగా మార్కెట్ లేని మహేష్ బాబును పాన్ వరల్డ్ లోకి తీసుకెళ్తున్న ఘనత రాజమౌళికే దక్కింది…మహేష్ బాబు ఏ సినిమా చేయాలన్నా కూడా తన భార్య అయిన నమ్రతనే కథలను విని అది మహేష్ బాబుకి సెట్ అవుతుందా? లేదా అనే విషయాలను పరిశీలించిన తర్వాత ఆ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మహేష్ బాబు నమ్రతల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఇద్దరు కలిసిమెలిసి జీవిస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అంటూ చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోతున్నారు. కానీ వీళ్లు మాత్రం రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య బాండింగ్ ఇంకా బలంగా మారుతుంది తప్ప వీక్ అవ్వడం లేదు. ఎందుకని వాళ్ళు అంత స్ట్రాంగ్ గా కలిసి మెలిసి బతుకుతున్నారు.

దానికి గల కారణాలను కూడా కొంతమందికి చెబితే విడిపోయే జంట కూడా కలిసే అవకాశాలు ఉంటాయి కదా అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికైతే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరి నిర్ణయాలకు మరొకరు గౌరవాన్ని ఇస్తూ ఒక విషయాన్ని ఇద్దరు కలిసి చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారట.

అందువల్లే వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు రావడం లేదట… అందువల్లే వీళ్ళ మధ్య బాండింగ్ బాగా కుదిరింది. అందరు అలానే ఉంటే ఎవ్వరి మధ్య విభేదాలు రావు. ఎవ్వరు విడిపోరు అంటూ చాలామంది వీళ్లను ఉదాహరణగా తీసుకొని విడిపోయే జంటలకు సలహాలనైతే ఇస్తున్నారు…

Telugu Heroes Dominating Bollywood: బాలీవుడ్ ను డామినేట్ చేసే నలుగురు తెలుగు హీరోలు వీళ్ళే…

Telugu Heroes Dominating Bollywood: డిఫరెంట్ సినిమాలను చేస్తూన్న హీరోలందరు సూపర్ హిట్లను అందుకుంటున్నారు. స్టార్ హీరోలైతే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి ఒక ఇద్దరికి మాత్రం సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఎవరికీ దక్కని క్రేజ్ ను కూడా వాళ్లు దక్కించుకోవడం విశేషం…ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతుండటం విశేషం…ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ గొప్ప విజయం సాధించిన ఘనత కూడా వీళ్ళకే దక్కుతుంది. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన వాళ్ళలో వీళ్లు మొదటి స్థానంలో ఉంటారు…

ఈ నలుగురు హీరోల్లో ఎవరు నెంబర్ వన్ హీరోగా మారబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఇండియాలో చాలామంది హీరోలు తమ సత్తా చాటుతున్నప్పటికి మన హీరోలకు దక్కుతున్న గౌరవం ఇతర భాషల హీరోలకు దక్కడం లేదు. దానివల్లే మన వాళ్ళతో సినిమాలు చేయడానికి చాలామంది మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఎట్టకేలకు మన హీరోలు ఈ సంవత్సరం టాప్ హీరోలుగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారే అవకాశం కూడా మన హీరోలకే ఉందని చాలామంది చెబుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీని డామినేట్ చేయగలిగే కెపాసిటి మన హీరోలకు మాత్రమే ఉంది…

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న మన హీరోలు వాళ్ళ మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2000 కోట్ల మార్క్ కు చేరువలో ఉన్నారు. ఇక ఇప్పుడు 2500 కోట్ల వరకు వల్ల మార్కెట్ ను విస్తరించుకునే అవకాశం కూడా ఉంది…చూడాలి మరి వీళ్లలో ఎవరు టాప్ లోకి వెళ్తారు… ఎవరు డీలా పడిపోతారు అనేది…

Salman Khan: సల్మాన్ ఖాన్ ను భయపెడుతున్న తెలుగు స్టార్ హీరోలు…కారణం ఇదే….

Salman Khan: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మన హీరోలందరు టాప్ హీరోలుగా మారుతున్న క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మరి కొంతమంది స్టార్ హీరోలు సైతం వాళ్ళ మార్కెట్ ని పూర్తిగా కోల్పోతున్నారు. ఖాన్ త్రయం లో ఒకరిగా గుర్తింపును సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ సైతం ఈ మధ్యకాలంలో అసలు సక్సెస్ లను సాధించడం లేదు. ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా నిరాశ పరుస్తున్నాయి. దాంతో ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రొటీన్ సినిమాలు చేస్తారనే పేరున్న వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడు. తనకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసి పెడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి సక్సెస్ లను సాధించి పెట్టిన కూడా సల్మాన్ ఖాన్ కి మన తెలుగు డైరెక్టర్స్ ఎవరు సక్సెస్ ఇవ్వలేదు. కాబట్టి వంశీ పైడిపల్లి అతనికి సక్సెస్ సాధించి పెడితే మాత్రం తెలుగు డైరెక్టర్లలో సల్మాన్ ఖాన్ కి మొదటి సక్సెస్ ని అందించిన దర్శకుడిగా వంశీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన వాడవుతాడు.

ఇక ఏది ఏమైన కూడా వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడు సైతం ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలను పక్కనపెట్టి ఇతర భాషలో హీరోల వైపే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన తమిళ స్టార్ హీరో అయిన విజయ్ తో వారసుడు అనే సినిమా చేశాడు. ఆ మూవీ ఆశించిన మేరకు విజయం సాధించలేదు.

ఇక సల్మాన్ ఖాన్ తో చేస్తున్న ఈ సినిమా అయిన అతనికి మంచి విజయాన్ని సాధించి పెడుతుందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా వంశీ పైడిపల్లి తెలుగులో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడం వెనక కారణం ఏంటి అంటూ మరికొంతమంది సినిమా విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు…

ఇక మన తెలుగు హీరోలను చూసి సల్మాన్ ఖాన్ సైతం భయపడుతున్నారట. కారణమేంటంటే మన వాళ్ళ లాగా సూపర్ సక్సెస్ లను సాధించే కెపాసిటి తనకు ఉందా? తన మార్కెట్ పూర్తిగా తగ్గిపోయిందా? అనే ఒక డైలామాలో తను ఉన్నాడు. ఒకవేళ అతని సినిమా వచ్చి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయకపోతే అది అతనికి ఒక అవమానంగా భావించే అవకాశం కూడా ఉంది…

Pawan Kalyan vs Vijay political comparison: పవన్ కళ్యాణ్ ఓటమికి..విజయ్ గెలుపుకి కారణాలు ఇవే.. 2024 లో జనసేన పెద్ద పొరపాటు చేసిందా..?

Pawan Kalyan vs Vijay political comparison: నిన్న తమిళనాడు లో ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా లో విజయ్ , పవన్ కళ్యాణ్ లను పోలుస్తూ నెటిజెన్స్ పవన్ కళ్యాణ్ పై విపరీతమైన ట్రోల్స్ వేయడం మొదలు పెట్టారు. ధైర్యం గా ఎన్నికల్లో ముందుకు వెళ్తే, విజయ్ కి వచ్చిన ఫలితాలు వస్తాయని, పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రి అవ్వాలని ఎప్పుడూ పని చెయ్యలేదని , జగన్ పతనం కోసమే ఆయన పార్టీ ని పెట్టాడని, 2024 ఎన్నికల్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యినప్పుడు ఏర్పడిన పొలిటికల్ స్పేస్ ని వాడుకొని , ఒక ప్రత్యామ్నాయం గా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లుంటే ఆయనకు సీఎం అయ్యే అవకాశం ఉండేదని, కానీ ఆయన 15 ఏళ్ళ పాటు చంద్రబాబు ని సీఎం గా చూడాలని కోరుకుంటున్నాడని ఇలా చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు, విశ్లేషించారు.

కానీ రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏమిటంటే, తమిళనాడు లో పొలిటికల్ స్పేస్ గత పదేళ్ల నుండి ఉంది, సరైన సమయం చూసుకొని , అర్బన్ ఓటర్లను నమ్ముకొని విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు , అది ఆయనకు బాగా కలిసొచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అందుకు పూర్తిగా భిన్నం. తెలుగు దేశం పార్టీ , వైసీపీ పార్టీలకు సంస్థాగత ఓటు బ్యాంక్ 35 శాతం వరకు ఉంటుంది. కరుడుగట్టిన ఓటు బ్యాంకు అది, పవన్ కళ్యాణ్ కి ఎంత వేవ్ క్రియేట్ అయినా 20 నుండి 25 శాతం ఓటు బ్యాంక్ మాత్రమే వస్తుంది, టీడీపీ, వైసీపీ లలో ఎదో ఒక పార్టీ పూర్తిగా భూస్థాపితం అయితేనే పవన్ కళ్యాణ్ కి ఛాన్స్ ఉంటుంది, అప్పటి వరకు ఎదురు చూడక తప్పదని అంటున్నారు. 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వేవ్ కారణంగా యూత్ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు.

పవన్ కళ్యాణ్ వేవ్ కారణంగా కచ్చితంగా 20 శాతం ఓటు బ్యాంక్ కూటమికి అదనంగా తోడైంది, భవిష్యత్తులో ఇలా మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా యువత మీద ఆధారపడి రాజకీయాలు వస్తాయి. అప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ కి ఒక స్పేస్ ఏర్పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు లో విజయ్ కి ఆ స్థాయి ఓటింగ్ రావడానికి కారణం , అర్బన్ ప్రాంతాల్లో ఉన్న యువత నే, అలాంటి యువత మనకు కూడా చాలామంది ఉన్నారు కానీ, అది ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేంత రేంజ్ లో కాదని అంటున్నారు. అలాంటి రోజు రావాలంటే పవన్ కళ్యాణ్ 2034 వరకు ఎదురు చూడక తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Central govt jobs for unemployed youth: నిరుద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. దరఖాస్తు చేసుకోండి.. కొలువు కొట్టండి!

Central govt jobs for unemployed youth: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో వెంటనే కేంద్రం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో నిరుద్యోగుల కోసం భారీగా ఉద్యోగ అవకాశాలు వెలువడ్డాయి. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో మొత్తం 12 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రూ.25 వేల నుంచి లక్ష రూపాయల వరకు వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. స్థిరమైన కెరీర్‌ను కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశం.

నోటిఫికేషన్ల వివరాలు ఇవీ..
కేంద్రం విడుదల చేసిన వాటిలో నాలుగు నోటిఫికేషన్లు ఉన్నాయి. ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నవారికి అర్హతలను బట్టి మంచి అవకాశం.

సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌లో 9,195 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌ – ట్రేడ్స్‌మెన్, పయనీర్‌) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి మే 19వ తేదీ వరకు అవకాశం ఉంది.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ (గ్రేడ్‌ సీ అండ్‌ డీ)..
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా 731 గ్రేడ్‌ సీ, డీ స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆర్‌బీఐ గ్రేడ్‌–బీ ఆఫీసర్‌..
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 60 గ్రేడ్‌–బీ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత ఉన్నవారు మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. కాస్త కష్టపడితే కొలువు కొట్టడం ఈజీ.

SPMCIL జూనియర్‌ టెక్నీషియన్‌…
సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SPMCIL)లో 534 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 19 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశంఉంది.

ఎన్‌టీపీసీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌..
నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ)లో 250 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు కేంద్రం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దరఖాస్తుల గడువు మే 7వ తేదీ వరకు ఉంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు సంబంధిత సంస్థల అధికారిక వెబ్‌సైట్లను సందర్శించి, పూర్తి నోటిఫికేషన్లను పరిశీలించాలి. అర్హత, వయోపరిమితికి సంబంధించిన నిబంధనలను తనిఖీ చేసుకుని, గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉన్నందున, అభ్యర్థులు ముందుగానే సిద్ధమై, తప్పులు లేకుండా దరఖాస్తులను సమర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Modi Bengal strategy Jhalmuri: నరేంద్ర మోడీ ఝల్ మురి.. టీఎంసీ కూసాలు అప్పుడే కదిలాయి..

Modi Bengal strategy Jhalmuri: ఒకప్పుడు రాజకీయాలలో విమర్శలు ఉండేవి. ప్రతి విమర్శలు కూడా ఉండేవి. కాకపోతే అవి హుందాగా సాగుతూ ఉండేవి. రాజకీయ నాయకులు కూడా రాజకీయాలను వ్యక్తిగత విషయాలతో ముడిపెట్టే వారు కాదు. ప్రజల్లో పార్టీలపరంగా విభేదాలు.. అంతగా ఉండేవి కాదు.

ఇప్పుడు అలా కాదు కదా. తిండి నుంచి మొదలుపెడితే కట్టుకునే వస్త్రాల వరకు ప్రతిదీ కూడా రాజకీయమే. ఒక దశలో రాజకీయాలను ప్రతిదీ ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు సామాజిక మాధ్యమం ఉండనే ఉంది . అందువల్ల నేటి కాలంలో రాజకీయాలు సాగించడానికి విశ్లేషకులు పుట్టుకొచ్చారు. వారు ఏం చెబితే అది చేసేందుకు రాజకీయ నాయకులు వెనుకాడటం లేదు. కాకపోతే కొంతమంది నాయకులు సొంత రాజకీయ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. చివరికి దాని ద్వారానే అక్కడి రాజకీయాలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీకి సింహభాగం ఇవ్వవచ్చు.

మనదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి తరఫున ప్రచారం చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆ రాష్ట్రాల ఆహారపు అలవాట్లను.. ఆచార వ్యవహారాలను ప్రదర్శించేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడు.. ప్రచారానికి నరేంద్ర మోడీ వెళ్లారు. అక్కడ ఆయన బెంగాల్ ప్రముఖులైన రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద వంటి వారిని పదేపదే ప్రస్తావించారు. అంతేకాదు బెంగాలీ ఆహారపు అలవాట్లను కూడా ప్రముఖంగా పేర్కొన్నారు.

నరేంద్ర మోడీ శాకాహారి అయినప్పటికీ బెంగాల్ ప్రజలకు ఎంతో ఇష్టమైన చేపలను కూడా ప్రస్తావించారు. బెంగాలీ ప్రజలు చేపలను బాగా తింటారని.. కాకపోతే ఆ చేపలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. మమతా పరిపాలన కాలంలో సొంతంగా చేపలు కూడా ఉత్పత్తి చేసుకోవాలని స్థితికి పశ్చిమ బెంగాల్ దిగజారిపోయిందని నరేంద్ర మోడీ అనేక సభల్లో ఆక్షేపించేవారు.

చేపలు మాత్రమే కాదు.. పశ్చిమ బెంగాల్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఈ ఎన్నికల్లో టీఎంసీకి అపరాధం చేసింది. దీనంతటి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఆయన మన దేశానికి ప్రధాని.. పైగా ఆయన ఏం చేసినా సరే క్షణాల్లో పాపులారిటీ వచ్చేస్తూ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామంలో ఆయన పర్యటించారు. ఓ వీధి పక్కన ఉన్న దుకాణంలో ఝల్ మరి అనే స్ట్రీట్ ఫుడ్ తిన్నారు. ఫలితంగా అందరి దృష్టి దాని మీద పడింది..

ఝల్ మరి అనేది బెంగాల్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన స్ట్రీట్ ఫుడ్.. ఝల్ అంటే బెంగాలీ భాషలో కారం.. మరి అంటే మరమరాలు.. వీటి కాంబినేషన్లో చేసే వంటకం ఇది.. ఈ స్ట్రీట్ ఫుడ్ కారంగా.. పుల్లగా ఉంటుంది. మసాలా కూడా గట్టిగా వేస్తారు. కాబట్టి అత్యంత రుచికరంగా ఉంటుంది. ఝల్ మరి ప్రధానమంత్రి మోడీ తిన్న తర్వాత దీని గురించి వెతకడం మొదలైంది. వాస్తవానికి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడలేదు. కనీసం పట్టించుకోలేదు. దీంతో బెంగాలీ ప్రజల్లో నరేంద్ర మోడీ మీద అభిమానం పెరిగింది. అందువల్లే ఈసారి ఆయన పార్టీకి ఓట్లు వేశారు.

ఝల్ మరి మరమరాలు.. ఉడికించిన ఆలుగడ్డలు.. ఉల్లిపాయలు.. టమాటాలు.. పల్లీలు.. కీరా దోసకాయ.. పచ్చిమిర్చి.. పుదీనా.. నిమ్మరసం.. ఆవనూనె.. ఉప్పు.. కారం.. జీలకర్ర పొడి.. చాట్ మసాలా వేసి తయారుచేస్తారు. అయితే దీనిని వెంటనే తినాలి. లేకపోతే మరమరాలు పూర్తిగా మెత్తబడిపోతాయి.

BJP Next Target: బెంగాల్, అస్సాం లో విజయం.. బిజెపికి అక్కడ భారీ మెజారిటీ ఖాయం..

BJP Next Target: బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో సాధించిన విజయాలు బిజెపికి తిరుగులేని బూస్ట్ ఇచ్చాయి. ఆ పార్టీ నాయకత్వంలో అనంతమైన పాజిటివిటీని పెంచాయి. ఇక్కడితోనే బిజెపి ఆగేటట్టు కనిపించడం లేదు. బిజెపికి కేవలం అసెంబ్లీలలోనే కాకుండా.. రాజ్యసభలో కూడా బలం పెంచేలా చేసింది అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో సాధించిన గెలుపు.

కొంతకాలంగా బిజెపి ఆయా రాష్ట్రాల ఎన్నికలలో ఒకే ఫార్ములా పాటిస్తోంది. దాని పేరు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. ఎంత కష్టమైనా సరే దానిని సాధించడం.. ఈ సూత్రం ఆధారంగానే బిజెపి పని చేస్తోంది. ఈ సూత్రం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి పనిచేయలేదు. అందువల్ల పార్లమెంటు స్థానాలు చాలావరకు తగ్గాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి సొంతంగా 303 స్థానాలను సాధించింది. 2024 ఎన్నికల్లో మాత్రం 240 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. జెడ్ యు, టిడిపి సపోర్టుతో బిజెపి 2024 లో సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వచ్చింది.

పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో.. దాని నుంచి అనేక పాఠాలు నేర్చుకుంది. అందువల్లే కమలం వరుసగా దూసుకుపోతోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం గత ఏడాది పాలిటిక్స్ లో సరికొత్త చరిత్ర. తాజాగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి మూడింటిని తన ఖాతాలో వేసుకుంది.

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసమ ఎన్నికల జరగబోతున్నాయి. వీటిలో గోవా, మణిపూర్, ఉత్తరాఖాండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి రూలింగ్ లో ఉంది. వాటిని కాపాడుకునేందుకు బిజెపి అధినాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు పంజాబ్లో కూడా సత్తా చూపించేందుకు బిజెపి రెడీగా ఉంది. బిజెపి తర్వాత టార్గెట్ కూడా అదే. అనంతరం దక్షిణాదిలోని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది.

ఒకవేళ ఈ మూడు రాష్ట్రాలలో బిజెపి గనుక విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా ఐదింట నాలుగువంతులు కాషాయమయమే. ఒకవేళ ఈ సాధ్యమైతే రాజ్యసభలో మెజారిటీ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పయనం సాగించడం ఖాయం. ఫలితంగా జమిలి ఎన్నికలు.. నియోజకవర్గాల పునర్విభజన వంటి బిల్లులను ఆమోదింప చేసుకొని.. బిజెపి తన ఎజెండాను కచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. అందువల్లే వచ్చే ఎన్నికల్లోను విజయం సాధించి , రాజ్యసభలో సొంతంగా మెజారిటీ సాధించాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు.

BCCI rules players stay restrictions IPL: వచ్చే ఐపీఎల్ నుంచి వాళ్లకు అనుమతి లేదు.. హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో..

BCCI rules players stay restrictions IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్ నుంచి బీసీసీఐ కఠిన నిబంధన విధించేందుకు సిద్ధమైంది. ప్లేయర్లలో మరింత పారదర్శకత పెంచేందుకు రెడీగా ఉంది. బిసిసిఐ ఈ నిబంధన తీసుకురావడానికి ప్రధాన కారణం ఆటగాళ్లే. వాళ్ళు చూపిస్తున్న దూకుడు వల్లే బి సి సి ఐ ఇంతటి నిర్ణయానికి రావాల్సి వచ్చింది.

ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ప్లేయర్ల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కుటుంబ సభ్యుల సాంగత్యం అవసరం పడుతుంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నప్పుడు ప్లేయర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చేవారు. ఇందులో కొంతమంది ప్లేయర్లు తమ స్నేహితురాళ్ళను కూడా తీసుకొచ్చేవారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వారంతా కూడా హోటల్ రూమ్ లోకి గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకెళ్తున్నారు..

భార్యలు, ఇతర కుటుంబ సభ్యులతో ప్లేయర్లు హోటల్ రూమ్ లలో ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ కొంతమంది ప్లేయర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో హోటల్ రూమ్ లలో ఉంటున్నారు.. ముంబై చెట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ ప్లేయర్ జైస్వాల్, హైదరాబాద్ ప్లేయర్ కిషన్, పంజాబ్ ప్లేయర్ అర్షదీప్ సింగ్ తమ గర్ల్ ఫ్రెండ్స్ తో ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు.. అయితే క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో ఉండడం పట్ల బీసీసీఐకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే కొందరు ప్లేయర్ల గర్ల్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఇన్ ప్లూ యన్సర్స్ గా ఉన్నారు. వారు ప్లేయర్లతో కలిసి ఉన్నప్పుడు సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటే అది ఇబ్బందికరంగా మారుతుందని బీసీసీఐ భావిస్తోంది..

“ఆటగాళ్లు సంబంధాలలో ఉండడం పట్ల ఎటువంటి ఇబ్బంది లేదు. దానిని మేము వేరే విధంగా చూడడం లేదు. కాకపోతే సన్నిహితంగా ఉన్నప్పుడు సున్నితమైన సమాచారం బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పటివరకు ఇటువంటి పరిణామం ఎదురు కాలేదు కానీ.. భవిష్యత్ కాలంలో ఎదురైతే ఇబ్బంది తప్పదని.. అందువల్లే వచ్చే ఐపిఎల్ సీజన్ నుంచి హోటల్లో కి వారిని తీసుకువచ్చేందుకు అనుమతి నిరాకరించాలని అనుకుంటున్నామని” పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీసీసీఐ అధికారి జాతీయ మీడియాతో చెప్పారు.

Jagtial extreme heatwave: తెలంగాణ నిప్పుల కొలిమి.. మండుతున్న జగిత్యాల!

Jagtial extreme heatwave: తెలంగాణ వారం రోజులుగా నిప్పుల కొలిమిలా మారింది. మే ప్రారంభం నుంచి భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 9 గంటల నుంచే వేడి సెగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్నానికి మంటలు పుట్టిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు వేడి తీవ్రత కొనసాగుతోంది. దీంతో మూగజీవాలు అల్లాడుతున్నాయి. పంట పొలాల్లో అగ్గి రాజుకుంటోంది. ఇక మనుషులు అల్లాడిపోతున్నారు. ఎండకు తోడు వేడి గాలులు వీస్తుండడంతో వడదెబ్బబారిన పడుతున్నారు.

కరీంనగర్‌ నిప్పుల కుంపటి..
భానుడి భగభగలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. సోమవారం జగిత్యాల జిల్లా గుల్లకోటలో 45.7 డిగ్రీల సెల్సియస్‌ అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవగా, అల్లీపూర్‌లో 45.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ తీవ్రమైన వేడిమి ప్రజల జీవనశైలిని అతలాకుతలం చేస్తోంది.

రెడ్‌ జోన్‌లో ఉమ్మడి జిల్లా..
కేవలం జగిత్యాల జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాజన్న సిరిసిల్ల మర్థనపేటలో 44.7 డిగ్రీలు, పెద్దూరులో 43.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లి, ఎలిగేడు ప్రాంతాల్లో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లా గుండిలో 44.2 డిగ్రీలు, జమ్మికుంటలో 44.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

అప్రమత్తంగా ఉంటాలని హెచ్చరిక..
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రానున్న రోజుల్లోనూ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున, ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగినంత నీరు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరిస్తోంది.

Good News for North Andhra: ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్!

Good News for North Andhra: ఏపీకి( Andhra Pradesh) మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. విశాఖ కేంద్రంగా దక్షిణ మధ్య తీర రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విభజన హామీల్లో భాగంగా ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ పాలనాపరమైన అనుమతులు ఇప్పటికే జారీ చేసింది రైల్వే శాఖ. ఇప్పుడు అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించే వీలుగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది శుభవార్త. ఎందుకంటే పుష్కర కాలానికి పైగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఇది సానుకూల అంశం.

విభజన హామీల్లో భాగంగా..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఏపీకి కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తామని విభజన చట్టంలోనే పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. కానీ తర్వాత వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే జోన్ కు సంబంధించి భూముల కేటాయింపులో తీవ్ర జాప్యం చేసింది. దీంతో రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఆలస్యం అయ్యింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది. రైల్వే జోన్ కు అవసరమైన భూములను అప్పగించింది. తాత్కాలిక భవనాలను కేటాయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా.. దక్షిణ మధ్య తీర రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి అనుమతులు మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే జోన్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. కానీ ఈ జూన్ ఒకటి నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి కొత్త జోన్ పరిధిలో..

కొత్తగా ఆ డివిజన్లతో..
విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు అవుతున్న జోన్లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడతోపాటు విశాఖ డివిజన్ లను కలపనున్నారు. ఇప్పటికే వాల్తేరు డివిజన్ ఉండగా దానిని రద్దు చేశారు. కొంత భాగాన్ని విజయవాడ జోన్లో చేర్చారు. మరికొంత భాగంతో విశాఖ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు కొత్త డివిజన్లో చాలా రైల్వేస్టేషన్లను విశాఖ డివిజన్లో చేర్చగా.. గతంలో వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న స్టేషనులు కొన్ని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న కొత్త డివిజన్ లో చేర్చారు. ఇప్పుడు అధికారికంగా గెజిట్ రావడంతో విశాఖ నుంచి కొత్త రైల్వే సర్వీసులు, నూతన ఉద్యోగ నియామకాలు, అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. నిజంగా ఇది శుభవార్త ఉత్తరాంధ్ర ప్రజలకు.

Ram Charan movies missing element: రామ్ చరణ్ సినిమాల్లో ఆ ఒక్క వెలితి కనిపిస్తుందా…

Ram Charan movies missing element: రామ్ చరణ్ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక పెద్ది సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించాలనే ఉద్దేశ్యంతో వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్లో ఉన్నప్పటికి ఆయన సినిమాల్లో ఒక వెళితే కనిపిస్తుంది..అది ఏంటి అంటే రామ్ చరణ్ చేసే ప్రతి సినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికి ఆయన ఒక ఆర్ట్ సినిమాని చేస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక మొత్తానికైతే ఆయన నుంచి అలాంటి సినిమా వస్తుందా? వచ్చిన ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి మాస్ హీరో ఆర్ట్ సినిమా చేయడం అనేది సరైనది కాదంటూ కొంతమంది విమర్శకులు సైతం విమర్శిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం పెద్ది సినిమా తర్వాత ఆయన సుకుమార్ తో ఒక భారీ కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా అలాంటి నటుడు యావత్తు తెలుగు సినిమా ఇండస్ట్రీని కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు రామ్ చరణ్ సాధించిన సక్సెస్ లతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సైతం తన హవా కొనసాగించాలని ముందుకు సాగుతున్నాడు. ఇక పెద్ది సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతాడా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది…

Venkatesh dual role in Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం ‘ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా…ఆ పాత్రలేంటంటే…

Venkatesh dual role in Adarsha Kutumbam: మాటలు మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్… కెరియర్ స్టార్టింగ్ లో తన కథలతో మాటలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు వైవిద్య భరితమైన సినిమాలైతే చేశాడు. ఆయన సినిమాలో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తారు అంటే ఆయన సినిమాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జునులతో మాత్రమే ఎక్కువగా సినిమాలను చేశాడు. అయితే ఇప్పుడు ఆయన వెంకటేష్ ని హీరోగా పెట్టి ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ లో వెంకటేష్ ని చూపించబోతున్నారట. ఇక అదే విధంగా ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక క్యారెక్టర్ లో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించబోతున్నారట. మరొక పాత్రలో ఫ్యామిలీని సేవ్ చేసే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

మరి ఈ రెండు క్యారెక్టర్ల మధ్య కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమాని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తో త్రివిక్రమ్ ఎలాంటి కామెడీని చేయిస్తున్నాడు.

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాల్లో మాదిరిగానే వెంకటేష్ తో ఆ రెంజ్ కామెడీని పండిస్తే మాత్రం సినిమా సక్సెస్ ని సాధిస్తుందని కొంతమంది అంటుంటే, మరి కొంత మంది మాత్రం ఈ సినిమాని ఫుల్ లెంత్ యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నారంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ ఇప్పుడు భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పెను సంచలనాన్ని సృష్టించిన ఆయన ఆ సినిమా తర్వాత రాబోతున్న ఈ సినిమాని కూడా సక్సెస్ ఫుల్ గా నిలిపితే సీనియర్ హీరోల్లో ఆయన టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడు…

Nagarjuna Kalyan Krishna movie latest updates: నాగార్జున – కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చేయబోతున్న మూవీలోకి మరో స్టార్ హీరో వచ్చాడా…

Nagarjuna Kalyan Krishna movie latest updates: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో విభిన్న తరహా సినిమాలను చేస్తున్న మన దర్శకులు ఇకమీదట కూడా వైవిద్య భరితమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం తెలుగు సినిమాల హవాని ఆపలేకపోతుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించినా కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. కాబట్టి బాలీవుడ్ ని డామినేట్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి విజయాలను సాధించిన రాని గుర్తింపు తెలుగు సినిమా హీరోలు ఒకటి రెండు సినిమాలతో తెచ్చుకుంటున్నారు. అలాగే భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక నాగార్జున ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమైన కూడా ఫ్యూచర్లో ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులను చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు.

ప్రస్తుతం తన వందో సినిమాని రా కార్తీక్ అనే తమిళ డైరెక్టర్ తో చేస్తున్నాడు. ఇక కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇక జూన్ నెల నుంచి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోబోతున్నారట.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో నాగార్జునతో పాటు మరొక స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే మలయాళం లో మంచి పాపులారిటిని సంపాదించుకొని తెలుగులో సైతం పలు సినిమాలు చేసి స్టార్ హీరోగా మారిన దుల్కర్ సల్మాన్ గా తెలుస్తుంది.

నాగార్జున – దుల్కర్ కాంబినేషన్లో ఇప్పటి వరకు సినిమా రాలేదు ఇక ఇదే మొదటిసారి కావడం విశేషం… డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ ని కలిసి అతనికి కథ చెప్పారట. తను కూడా ఈ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే నాగార్జున దుల్కర్ కాంబినేషన్లో ఒక ఫ్యామిలీ నేపథ్యంలో ఉండే కథతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఉండేవిధంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…

Transgender umpire Rithika Sree: అతడుగా పుట్టాడు.. ఆమెగా మారాడు.. చివరికి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ అంపైర్ గా..

Transgender umpire Rithika Sree: మన సమాజంలో ఇప్పటికీ ఆడవాళ్ళ మీద ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు చంపేసే దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అటువంటిది ఒక వ్యక్తి జీవితం తన శరీరంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల తలకిందులుగా మారింది. అతడుగా పుట్టినప్పటికీ.. ఆమెగా మారాల్సి వచ్చింది. చివరికి అంపైర్ గా స్థిరపడాల్సి వచ్చింది. కానీ ఈ ప్రస్థానంలో ఎన్నో ఆంక్షలు.. మరెన్నో ఇబ్బందులు..

ఆమె పేరు రితిక శ్రీ. పుట్టగానే ఆమె ఆడపిల్ల కాదు. అతడి అసలు పేరు ముత్తు రాజా.. జన్మతహ: పురుషుడు. ముత్తు రాజా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చదివాడు. అప్పట్లో అతడు మొహాలీ ప్రాంతంలో ఒక కాల్ సెంటర్లో పని చేసేవాడు.. అప్పుడప్పుడు ఖాళీ సమయం దొరికితే ఐపీఎల్ మ్యాచులు చూసేవాడు. కరోనా సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో క్రికెట్ అంపైరింగ్ చేయాలని అతనిలో కోరిక కలిగింది. ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి సమాచారాన్ని సేకరించాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా అంపైర్ల కమిటీ చైర్మన్ జయ రామన్ ను కలిశాడు. దీంతో అతని కెరియర్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది.

ముత్తరాజకు అనేకమంది డిస్టిక్ ప్యానల్ లో ఉన్న అంపైర్లు పాటలు చెప్పడం మొదలుపెట్టారు. ముత్తు రాజా చూసేందుకు పురుషుడి లాగా కనిపిస్తున్నప్పటికీ.. అతడు స్త్రీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. అందువల్లే ఆ విషయాలను బయట పెట్టడానికి ముత్తరాజ ఇబ్బంది పడేవాడు. అయితే తన ఇబ్బందిని జయరామన్ కు చెప్పాడు ముత్తు రాజా. దీంతో వారు అతని బాధను అర్థం చేసుకొని.. ఒప్పుకున్నారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ముత్తు రాజా కాస్త రితిక శ్రీగా మారిపోయింది. చికిత్స చేయించుకొని పూర్తి స్త్రీగా మారిపోయింది. ఆ ఏడాది నుంచి రితిక శ్రీ మైదానంలోకి అడుగు పెట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని క్రికెట్ సంఘం స్టేట్ అంపైర్ ప్యానెల్ కు ఆహ్వానం పలికే దరఖాస్తులలో థర్డ్ జండర్ కాలం చేర్చడం తానుపడిన కష్టానికి గుర్తింపు అని రితిక శ్రీ చెబుతోంది.

రితిక శ్రీ మనదేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ అంపైర్. ఈ మధ్య తమిళనాడులోని సేలం జిల్లా. 2021 నుంచి సేలం, కోయంబత్తూరు సర్క్యూట్ ప్రాంతంలో అంపైరింగ్ చేస్తోంది. రితిక శ్రీ ప్రస్తుతం కోయంబత్తూర్ జిల్లాలోని క్రికెట్ సంగం లీగ్ లో మ్యాచ్ అధికారిగా కూడా పనిచేస్తోంది.. “నా శరీరంలో అనేక మార్పులు జరిగేవి. ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఎవరికి చెప్పాలో కూడా తెలిసేది కాదు. ఎందుకిలా అవుతోందా కూడా అర్థమయ్యేది కాదు.. జయరామన్ కు నా బాధ చెప్పగానే అర్థం చేసుకున్నారు. చివరికి నన్ను ఇలా మార్చారని” రితిక శ్రీ చెబుతోంది.