Homeజాతీయ వార్తలుJammu Kashmir Transformation: జమ్ము కాశ్మీర్ మారిపోయింది.. నరేంద్ర మోడీ కూడా ఊహించలేదు..

Jammu Kashmir Transformation: జమ్ము కాశ్మీర్ మారిపోయింది.. నరేంద్ర మోడీ కూడా ఊహించలేదు..

Jammu Kashmir Transformation: మన స్వస్థలాన్ని వదిలి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుంది.. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ మన పురిటి గడ్డకు వస్తే ఎంతటి ఆవేదన ఉంటుంది.. ఆ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేం. అప్పట్లో సునామీ వచ్చినప్పుడు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలామంది బతుకు జీవుడా అనుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత సునామీ వచ్చిన రోజున గుర్తుకు తెచ్చుకొని చెన్నై వస్తుంటారు. తమ వాళ్ళు కళ్ళముందే చనిపోవడంతో.. ఆ బాధను తట్టుకోలేక.. సముద్రాన్ని చూసి విలపిస్తుంటారు. ప్రకృతి విలయం వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అటువంటిది సాటి మనుషులు దారుణానికి పాల్పడితే.. మారణ హోమానికి కారణమైతే.. వారి వల్ల ఆప్తులను కోల్పోయి.. కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు వెళ్తే.. ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుంది. ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది. అటువంటి బాధను దశాబ్దాలుగా మోశారు కాశ్మీర్ పండిట్లు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ము కాశ్మీర్లో ఎన్నికలు జరిగిన తర్వాత.. అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ.. జమ్ము కాశ్మీర్లో ఒకప్పటి మాదిరిగా పరిస్థితి ఒకప్పటి మాదిరిగా లేదు. తాజా పరిస్థితులు అక్కడ మారిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లు జమ్ము కాశ్మీర్ తిరిగి వస్తున్నారు. అక్కడ మూతపడిన మందిరాలను తెలుస్తున్నారు. గుడులను శుభ్రపరుస్తున్నారు. ఆలయాలను పూర్తిగా పునర్నిర్మిస్తున్నారు. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. కాశ్మీర్ పండిట్లకు స్థానికంగా ఉన్న ముస్లింలు కూడా సహకరిస్తున్నారు. 19 89, 90 కాలంలో ఏ ముస్లింలు అయితే కాశ్మీరీ పండిట్లను కాశ్మీర్ నుంచి వెళ్లగొట్టారో.. వారే ఇప్పుడు కాశ్మీర్ పండిట్లకు సహకరిస్తున్నారు.

ఇటీవల నార్త్ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో చందిగ్రామ్ మందిరాన్ని పున ప్రతిష్టించారు.. దీనికోసం స్థానికంగా ఉన్న ముస్లింలు కాశ్మీర్ పండిట్లకు సహకరించారు.. బారా ముల్లా జిల్లాలోని కచ్వా ప్రాంతంలో వినాయకుడి ఆలయాన్ని కూడా బాగు చేశారు. ఈ ఆలయాన్ని వదిలి వెళ్ళిన తర్వాత పూర్తిగా నాశనమైపోయింది. అక్కడి అధికారులు చుట్టూ కంచె మాత్రమే నిర్మించారు. కాశ్మీర్ పండిట్లు ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. ఫలితంగా ఆలయం ఇటీవల పున ప్రారంభమైంది.

ఆలయాలను పునరుద్ధరించడం మాత్రమే కాకుండా.. గతంలో ఉన్న లెక్కలను సైతం కాశ్మీరీ పండిట్లు, హిందువులు బయటికి తీస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆలయాల కోసం గతంలో ఉన్న 3,729 కనాల్స్ భూమిని కేటాయించినట్టు తెలుస్తోంది. గతంలో మాదిరిగా ముస్లింలు లేరు. గతంలో మాదిరిగా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం లేదు. మొత్తంగా చూస్తే జమ్ము కాశ్మీర్లో ఒకప్పటి వాతావరణం కనిపిస్తోంది. అందువల్లే గతంలో నిర్వహించినట్టుగానే జాతరలు,. వేడుకలు జరుపుకుంటామని కాశ్మీర్ హిందువులు, పండిట్లు పిలుపునిస్తున్నారు.. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముఖ్యంగా శ్రీనగర్లోని హిందువులు ఒకప్పుడు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కృష్ణాష్టమి, శ్రీరామనవమి, దుర్గాష్టమి వంటి వేడుకలు ఘనంగా జరుపుకుంటామని కాశ్మీరీ పండిట్లు చెబుతున్నారు.

వాస్తవానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇక్కడ వారు కలలో కూడా ఊహించలేదు. తాము తమ సొంత ప్రాంతాలకు వెళ్తామని కాశ్మీర్ పండిట్లు ఏమాత్రం అంచనా వేయలేదు. లాల్ చౌక్ ప్రాంతంలో జాతీయ జెండా ఎగురుతుందని ఏ భారతీయుడు కూడా అంచనా వేయలేదు. కానీ ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే జమ్ము కాశ్మీర్ లో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఇది మార్పునకు సంకేతం. రేపటి అందమైన భవిష్యత్తుకు సజీవమైన ముఖచిత్రం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper