Home Blog Page 317

Vijay Political Success: విజయ్, పవన్ సరే.. ఆ ముగ్గురు ఫెయిల్!

Vijay Political Success: తమిళనాడులో( Tamil Nadu) విజయ్ గెలుపు తర్వాత ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినీ పరిశ్రమ నుంచి కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చేది ఎవరు? పార్టీని ఏర్పాటు చేసేది ఎవరు అనే దానిపై ఒక చర్చ నడుస్తుండగా.. రాజకీయాల్లోకి వచ్చి అవకాశాలు దక్కని సినీ హీరోల పై చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఓ ముగ్గురు.. పొలిటికల్ స్క్రీన్ పై మెరవాలని చూశారు. కానీ అది సాధ్యపడలేదు. తిరిగి సినిమా స్క్రీన్ పైకి వెళ్ళిపోయారు. వారే మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమలహాసన్. ఈ ముగ్గురు ముగ్గురే. సినిమాల్లో విశేష ప్రభావం చూపి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ పొలిటికల్ స్క్రీన్ పై మాత్రం ప్రభావం చూపలేకపోయారు.

* మెగాస్టార్ సైతం..
తెలుగు నాట ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజారాజ్యం( Praja Rajyam) ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఉమ్మడి రాష్ట్రంలోనే పోటీ చేసి 2029 ఎన్నికల్లో 18 స్థానాలకు పరిమితం అయ్యారు. దాదాపు 70 లక్షల ఓట్లను సొంతం చేసుకున్నారు. కానీ పార్టీని పూర్తిస్థాయిలో నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే అప్పటికి ఉన్న రాజకీయ పరిస్థితుల్లో.. ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు సాధించుకోవడం గొప్ప విషయం అని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ప్రజారాజ్యం పార్టీని కొనసాగించి ఉంటే 2014లో ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వచ్చేదన్న అంచనాలు ఉన్నాయి. అయితే ప్రజారాజ్యం పార్టీకి కొనసాగింపుగా జనసేన వచ్చింది. అనుకున్నది సాధించింది కానీ పవన్ కళ్యాణ్ సోలోగా అధికారంలోకి రాలేకపోవడం అనేది లోటు.

* రాజకీయ నిష్క్రమణ..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చి.. తిరిగి సినిమా రంగంలోకి బ్యాకప్ అయ్యారు. నిలకడలేమి, మాట పడకపోవడం, సినిమాలపైనే ధ్యాస ఉండడంతో రజనీకాంత్ రాజకీయాల్లో ఇమడలేమన్న భావనకు వచ్చారు. తమిళనాడులో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్. కానీ రాజకీయాల్లోకి వచ్చి ప్రభావం చూపడం కంటే మాట పడకపోవడం ఆయన నైజం. అందుకే రాజకీయాలు సూటు కావని భావించి పార్టీ ప్రారంభించిన కొద్ది రోజులకే నిష్క్రమించారు. మరో లోకనాయకుడు కమలహాసన్ సైతం అదే పరిస్థితి. పార్టీని ఏర్పాటు చేశారు కానీ.. ఆశించిన దూకుడుగా ముందుకు వెళ్లలేదు. కాంగ్రెస్ తో పాటు డీఎంకేకు సపోర్ట్ చేసి పక్కకు తప్పుకున్నారు.

* సినిమాయే వారి ప్రాణం..
అన్నింటికీ మించి ఈ ముగ్గురు సినిమాలను ఇష్టపడతారు. ప్రాణంగా ప్రేమిస్తారు. సినిమాలతో పోల్చుకుంటే రాజకీయాల పట్ల ప్రేమ చూపలేరు. అందుకే పొలిటికల్ స్క్రీన్ పై మరవలేకపోయారు. తిరిగి సినిమా స్క్రీన్ వైపే వెళ్ళిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు విజయ్ తో పాటు పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే దిగ్గజాలు. కానీ సినీ పరిశ్రమ వరకే. సినిమాలు చేయకుండా ఉండలేరు కూడా. విజయ్ రాజకీయాల కోసం సినిమాలు వదులుకోవడానికి సిద్ధపడ్డారు. పవన్ కళ్యాణ్ సైతం అదే మాదిరిగా వ్యవహరిస్తుంటారు. కానీ ఈ ముగ్గురు సినిమాలను విడిచి పెట్టేందుకు అంగీకరించడం లేదు. అందుకే పొలిటికల్ స్క్రీన్ పై రాణించలేకపోయారు.

Vijay And Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఆప్షన్ లేకుండా చేసిన విజయ్.. ఐదేళ్లూ విజిల్ ఊదాల్సిందే..

Vijay And Rahul Gandhi: సాధారణంగా ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ రానప్పుడు.. కొన్ని స్థానాలు సాధించిన చిన్న పార్టీలకు బంపర్ ఆఫర్ లభిస్తూ ఉంటుంది. తంతే గారెల బుట్టలో పడ్డట్టు.. చిన్న పార్టీలు ఆ సందర్భాన్ని పండగ చేసుకొంటాయి. కానీ దురదృష్టవశాత్తు మనదేశంలో కాంగ్రెస్ పార్టీ చిన్న సైజు పార్టీగా మారిపోయింది. ఒకప్పుడు దేశాన్ని అప్రతిహతంగా పరిపాలించిన ఆ పార్టీ.. ప్రాంతీయ పార్టీలకంటే దిగజారిపోయింది. ఆ పార్టీ అగ్ర నాయకత్వం లో సత్తా లేకపోవడంతో రోజురోజుకు దిగజారి పోతుంది.

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేతో జట్టు కట్టి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. కొన్ని స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు విజయ్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ లభించలేదు. కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వాలని విజయ్ పార్టీలోని ముఖ్య నాయకులు కోరారు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుకూల స్పందన ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ టీవీకేకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే తమిళనాడులో కొత్త రాజకీయ శకాన్ని చూడాల్సి ఉంటుంది. అంతేకాదు టీవీకే అధినేత విజయ్ బుధవారం గవర్నర్ ను కలుస్తారు. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చిస్తారు. గురువారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో.. విజయ్ కి రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. మరోవైపు సపోర్ట్ చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ రెండు మంత్రి పదవులను అడిగినట్లు తెలుస్తోంది.. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

విజయ్ కాంగ్రెస్ వైపు చూసేందుకు ప్రధాన కారణం.. డీఎంకే కూటమిలో ఆ పార్టీ ప్రధాన భాగస్వామి. డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటికి లాగితే.. ఇండియా కూటమిలో డీఎంకే ఉండదు. అప్పుడు డిఎంకె రాజకీయంగా ఒంటరి అయిపోతుంది. విజయ్ టార్గెట్ కూడా అదే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కేంద్రంతో గోక్కోవలసిన అవసరం విజయ్ కి లేదు. పైగా అన్నా డీఎంకే మెరుగైన సీట్లు సాధించినప్పటికీ.. ఒకప్పటితో పోల్చి చూస్తే అంత బలంగా లేదు. అందువల్లే ఆ పార్టీ నుంచి చాలామంది నాయకులు టీవీకేలో చేరిపోయారు. ఈ ఐదు సంవత్సరాలలో అన్నా డీఎంకే నుంచి టీవీ కేకు వలసలు ఉంటూనే ఉంటాయి. విజయ్ దాని గురించి దృష్టి పెట్టంది కూడా అందువల్లే.

డీఎంకేను ఎంత బలహీనపరిస్తే టీవీ కేకు తమిళనాడులో అంత బలం పెరుగుతుంది. అందువల్లే విజయ్ ఈ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరపడం మొదలుపెట్టారు. అవి విజయవంతం కావడంతో ఆయన మొదటి టార్గెట్ ఈజీగానే ఫినిష్ చేయగలిగారు. విజయ్ చెప్పినట్టుగానే రాహుల్ సమ్మతి ఇస్తున్న నేపథ్యంలో.. ఈ ఐదు సంవత్సరాలు రాహుల్ గాంధీ విజిల్ ఊదాల్సిందే.

Megha Krishna Reddy Wife: అసలే ఆమె మెఘా కృష్ణారెడ్డి భార్య.. 142 కోట్లు ఒక లెక్కా..

Megha Krishna Reddy Wife: డబ్బున్న వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళ సేవలోనే ప్రభుత్వాలు తరిస్తూ ఉంటాయి. ఇక మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. శ్రీమంతులు అడుగు బయట పెడితే చాలు అదేదో ఘనకార్యం అన్నట్టుగా.. అది సృష్టికి అద్భుతం అన్నట్టుగా మీడియా రాస్తూ ఉంటుంది. వాళ్ల సంబంధించిన అన్ని పనులను కూడా ప్రభుత్వాలు దగ్గరుండి మరి చేసి పెడతాయి. ముఖ్యమంత్రుల నుంచి ప్రధాన మంత్రుల వరకు అందరు సాగిల పడుతూనే ఉంటారు. ఉదాహరణకు ముకేశ్ అంబానీ ఏదైనా ఆలయానికి వస్తే అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. పీఎం లెవెల్ లో ఆయనకు సెక్యూరిటీ లభిస్తుంది. ఏదైనా రాష్ట్రానికి వెళ్లి ముఖ్యమంత్రిని ముఖేష్ అంబానీ కలిస్తే అదేదో మహాభాగ్యం అన్నట్టుగా అక్కడి ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది. ముకేశ్ అంబానీ పెట్టుబడి పెడితే.. ఆయన మొత్తం ఉదారంగా సేవలు చేస్తున్నారంటూ అక్కడి ప్రభుత్వం కొనియాడుతూ ఉంటుంది.. ముకేశ్ అంబానీ కేవలం ఉదాహరణ మాత్రమే..

ఆ మధ్య టెస్లా కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టు చిన్న వార్త లీక్ అయింది. అంతే మస్క్ ను ట్యాగ్ చేస్తూ అనేక మంది రాజకీయ నాయకులు తమ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలంటూ రిక్వెస్ట్ చేశారు. చివరికి మస్క్ తూచ్ అంటూ తన ప్రకటనను వెనక్కి తీసుకున్నాడు. డబ్బున్న వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఏ విధంగా సాగిలపడతాయో ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. కాంట్రాక్టర్లు.. ఇతర వ్యవహారాలు సాగించేవారు కూడా తక్కువేమీ కాదు.

తెలుగు రాష్ట్రాలలో మెఘా కంపెనీ చేపట్టని ప్రాజెక్టు అంటూ లేదు. ఆ కంపెనీ కి పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి యజమానులుగా ఉన్నారు. కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ఆమె ప్రతి సందర్భంలోనూ ట్రెండీగా కనిపిస్తుంటారు. తాజాగా మెట్ గాలా 2026 లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆమె ధరించిన నెక్లెస్ ధర ఏకంగా 142 కోట్లు అంట. ఆమె ధరించిన కాస్ట్యూమ్ కు పోటీగా ఆ నెక్లెస్ నిలిచింది. చుట్టు గులాబీ రంగు లో ఉన్న వజ్రాలతో అలిన ఈ ఆభరణానికి మధ్యలో వంకాయ రంగులు 550 క్యారెట్ల అరుదైన టాంజానియా మేరెలాని డైమండ్ ఉంది. ఈ వజ్రాన్ని క్వీన్ ఆఫ్ మేరేలాని అని పిలుస్తారు.. సుధా రెడ్డి ధరించిన ఈ ఆభరణం ఖరీదు 142 కోట్లు ఉండడంతో.. నేషనల్ మీడియా.. లోకల్ మీడియా ప్రధానంగా ఫోకస్ చేసింది. సుధా రెడ్డికి విపరీతమైన కవరేజీ ఇచ్చింది. సుధా రెడ్డి 142 కోట్ల నక్లెస్ ధరించడం వల్ల ఎవరికి లాభం.. మీడియా ఆ వార్తను ప్రచురించడం వల్ల ఎవరికి ఉపయోగం.. అనే ప్రశ్నలు మీలో వ్యక్తం కావచ్చు. దీనిని బట్టి మీడియా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో మీరే అర్థం చేసుకోవాలి.

Vijay TVK: అడ్డి మారి గుడ్డి దెబ్బ కాదు.. విజయ్ “విజిల్ పోడు” కు ఒక్క డిపాజిటూ పోలేదు..

Vijay TVK: తమిళనాడు ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సొంతం చేసుకోలేకపోయినప్పటికీ.. అతిపెద్ద పార్టీగా టీవీ కే ఆవిర్భవించింది. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. విజయ్ దూకుడు వల్ల ఆయన పోటీ చేసిన రెండు స్థానాలలో విజయం సాధించారు. అధికారానికి కొన్ని సీట్ల దూరంలో నిలిచినప్పటికీ.. అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.. ఇప్పటికే తమిళనాడు గవర్నర్ కు విజయ్ లేఖ రాశారు. మరి కొద్ది రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతారు.

ఇప్పటికే తమిళనాడు పోలీసులు విజయ్ నివాసం వద్ద భద్రతను పెంచారు. సీఎం కాకముందే ఆయనకు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. విజయ్ నివాసం ఉంటున్న ప్రాంతంలో పోలీసులు మూడు అంచల విధానంలో భద్రతను కొనసాగిస్తున్నారు.. విజయ్ మ్యాజిక్ ఫిగర్ సొంతం చేసుకోలేక పోయినప్పటికీ.. తమిళ రాజకీయాలలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ఏ పార్టీకి ఏ స్థాయిలో ఓట్లు వచ్చాయి అనేది ఎన్నికల సంఘం బయటపడుతుంది. ఆ వివరాల ప్రకారం టీవీ కే ఈసారి తమిళ ఎన్నికల్లో సరికొత్త ప్రభంజనం సృష్టించింది.

తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న టీవీకే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు. పెద్ద పెద్ద పార్టీలకు సైతం డిపాజిట్లు దక్కకుండా పోతున్న రోజుల్లో.. టి వి కే పోరాడిన తీరు గొప్పగా అనిపిస్తోంది. గెలిచిన స్థానాలలో టీవీకే పార్టీ విన్నింగ్ మార్జిన్ సగటు 22, 842 ఓట్లుగా ఉండడం విశేషం. ఇదే సమయంలో అన్నా డీఎంకే 15, 164, డీఎంకే 9,310 కంటే కూడా టీవీ కే ఎక్కువ విన్నింగ్ మార్జిన్ సాధించడం విశేషం. ఒక్కో స్థానంలో సగటున డిఎంకె కంటే కూడా 2.5 రెట్లు ఎక్కువ మార్జిన్ తో టివికే ఘనవిజయం సాధించింది.. వాస్తవానికి ఈ ట్రెండ్ పొలిటికల్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. టీవీ కే సృష్టించిన సంచలనం తమిళ రాజకీయాలను కాదు, దేశ రాజకీయాలనే ఆలోచనలో పడేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

“పార్టీ పెట్టి సరిగ్గా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. క్షేత్రస్థాయిలో నిర్మాణం కూడా అంత గొప్పగా సాగినట్లు కనిపించడం లేదు. డీఎంకే కూడా పంచే పథకాలకు భారీగా శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో డీఎంకేకు బలమైన ఓటర్లు ఉన్నారు. అన్నా డీఎంకే స్థాయిని తక్కువ అంచనా వేయడానికి లేదు. అటువంటిది టీవీకే మెరుపు వేగంతో తమిళ రాజకీయాల్లోకి వచ్చేసింది. అంతే వేగంతో అధికారాన్ని అందుకుంది. డబ్బు పంచకుండా.. విమర్శలు చేయకుండా టీవీకే అధికారంలోకి వచ్చింది. రాజకీయాలలో ఇది కొత్త ఒరవడి” అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Vijay Sangeeta Divorce: రెండో భార్యగా నైనా ఉంటా.. విజయ్ సీఎం కాగానే మనసు మార్చుకున్న మొదటి భార్య

Vijay Sangeeta Divorce: తమిళనాడులో విజయ్ త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ.. విజయ్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా ఇప్పటికే తన పార్టీ కీలక నేతల ద్వారా కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డిఎంకె అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ విజయ్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్న విజయ్ ఇప్పటికే మంత్రివర్గం కూర్పు పై ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.

రాజకీయంగా విజయ్ దూకుడు కొనసాగించినప్పటికీ.. కుటుంబ జీవితంలో మాత్రం విజయ్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. విజయ్ భార్య సంగీత ఎన్నికలకు ముందు ఆయనతో విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కారు. ఆయన ఒక నటి తో సంబంధాలు కొనసాగిస్తున్నారని.. అందువల్లే ఆయన నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె ఆ ఫిర్యాదులో కోరారు. సంగీత భారీగా భరణాన్ని కోరిన నేపథ్యంలో.. విజయ్ అంత మొత్తం ఇవ్వలేడని చెప్పినట్టు అప్పట్లో తమిళ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సంగీత కోరిన భరణం మొత్తం ఇస్తానని సంకేతాలు పంపినట్టు కూడా వార్తలు వచ్చాయి.

సంగీత, విజయ్ విడాకుల వ్యవహారం కోర్టు మెట్ల దాకా ఎక్కిన నేపథ్యంలో.. ఈ కేసును మే 15 కు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కోర్టు ఎదుట హాజరవుతారా.. లేదా మినహాయింపు కొడతారా.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చర్చ ఎలా సాగుతుండగానే విజయ్, సంగీత కు సంబంధించిన మరో వ్యవహారం ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది..

విజయ్ ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రధమ మహిళ హోదాను వదులుకోవడానికి సంగీత సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందువల్లే తాను విజయ్ భార్యగా ఉండేందుకు సిద్ధమని సంకేతాలు పంపినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. త్రిష రెండో భార్యగా ఉన్నప్పటికీ తనకు ఇబ్బంది లేదని.. తను విజయ్ తో ఉంటానని సంగీత చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకు సంగీత ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. కొంతమంది గాసిప్ రాయుళ్లు మాత్రం పిచ్చిపిచ్చిగా వార్తలను ప్రసారం చేస్తున్నారు.. వాస్తవానికి విడాకుల కేసు కోర్టు మెట్ల దాకా వచ్చినప్పుడు సంగీత తన నిర్ణయాన్ని ఎలా వెనక్కి తీసుకుంటారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విజయ్ కొడుకు తండ్రితో చాలా రోజులుగా దూరంగా ఉంటున్నాడు. తన పేరులో ఉన్న విజయ్ ని తొలగించుకున్నాడు.. విజయ్ కూతురు దివ్య కూడా తల్లితో ఉంటున్నది. ఆమె విదేశాలలో చదువుతున్నది. తన తండ్రి ఈ స్థాయిలో విజయం సాధించినప్పటికీ జేసన్, దివ్య ఇంతవరకు ఎటువంటి ప్రకటనలు సోషల్ మీడియాలో చేయలేదు. కనీసం తన తండ్రికి శుభాకాంక్షలు చెప్పినట్టు కూడా వార్తలు రాలేదు. విజయ్ భారీ విజయం సాధించిన తర్వాత ఆయన ఇంట్లో సంబరాలు జరిగాయి. అక్కడ దివ్య కనిపించలేదు.. జేసన్ కూడా లేడు. అలాంటప్పుడు విజయ్ తో కలిసి ఉంటానని సంగీత ఎలా అంటారని తమిళ విశ్లేషకులు చెబుతున్నారు.

Kashmiri Pandits Return: కాశ్మీర్లో సైలెంట్ గా ఏదో జరుగుతోంది.. అదొక అద్భుత సంకల్పం

Kashmiri Pandits Return: జమ్మూ–కశ్మీర్‌లో ధ్వంసమైన హిందూ ఆలయాల పునరుద్ధరణ కాశ్మీరీ పండిట్ల సంస్కృతిక, భావమయమైన పునరుజ్జీవనానికి ప్రతీకగా మారుతోంది. ముస్లిం సోదరులు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి చేస్తున్న పునరుద్ధరణ కార్యక్రమం సామాజిక సహజీవనం, సంస్కృతి పునరుద్ధరణ రెండింటికీ కొత్త శకని సూచిస్తోంది.
చారిత్రక నేపథ్యం..
1989–90 సమయంలో కశ్మీర్‌లో ఉగ్రవాద హింస, సామూహిక భయం కారణంగా కాశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున వలస వెళ్లారు. ఆ సమయంలో అనేక హిందూ ఆలయాలు మూసేసి, కొన్ని ధ్వంసమై, ఇంకొన్ని శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడు ఈ ఆలయాలను పునరుద్ధరించడం కేవలం భవనాల రిపేరు కాకుండా, 35–36 ఏళ్ల విరామానికి తర్వాత హిందూ సాంస్కృతిక హెచ్చుతగ్గులను సరిదిద్దే ప్రయత్నంగా కనిపిస్తోంది.

రెండు ఆలయాల పునరుద్ధరణ..
తాజాగా కుప్వాడా జిల్లాలోని చంద్రీగ్రామ్‌ ఆలయం, బారాముల్లా జిల్లాలోని వినాయక ఆలయం పునరుద్ధరణ జరిగింది. ఈ రెండు ఆలయాలు 1989లో కాశ్మీరీ పండిట్లు వలస వెళ్లిన తర్వాత ధ్వంసమై, ఆ ప్రాంతంలో గంటలు మూగబోయాయి. వేదమంత్రాలు ఆగిపోయాయి. ఇప్పుడు విగ్రహాల పునఃప్రతిష్ఠ, హవనం, పూజలతో 36–37 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ గడ్డపై గంటలు మోగడం, వేదమంత్రాలు వినిపించడం గ్రామ సమీకరణను భావపరంగా పునరుజ్జీవింపచేసిందనే భావన కలిగిస్తుంది.

ప్రభుత్వం, ముస్లింల సహకారం..
పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రభుత్వం, లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ యంత్రాంగం మద్దతు ఇస్తున్నారు. ప్రధాన పాత్ర పోషిస్తున్నది కాశ్మీరీ పండిట్లు, స్థానిక ముస్లిం సమాజం. 1989–90 కాలంలో కొంతమంది కాశ్మీరీ పండిట్లను పారిపోనీయడానికి సహకరించిన వ్యక్తులే ఇప్పుడు వారి ఆలయాల పునరుద్ధరణకు సహకరిస్తున్నారు. ఇది విభేదాల నుంచి సహబాధ్యత వైపు మారే ఒక సూచనగా కనిపిస్తోంది. ముస్లిం స్థానికులు ఆలయ భూమి హద్దుల గుర్తింపు, భద్రత, స్థల పరిరక్షణలో చేయూతనిస్తున్నారు.

సాంస్కృతిక పునర్నిర్మాణం..
పునరుద్ధరించిన ఆలయాల్లో పూజలు, హవనం, హోమం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాశ్మీరీ పండిట్లు పాల్గొనే జాతరలు ప్రాముఖ్యం పొందాయి. కాశ్మీరీ హిందూ పండిట్లు ఏటా జాతరలు నిర్వహించాలని నిర్ణయించడం వారి సంస్కృతిక, ధార్మిక జీవనాన్ని పునరుద్ధరించుకునే పథకం లాగా కనిపిస్తోంది. వేదమంత్రాలు, శంఖం శబ్దాలు తిరిగి వినిపించడం కేవలం ధార్మిక చర్యలకు పరిమితం కాక, కశ్మీర్‌ లోయలో హిందూ సాంస్కృతిక వారసత్వం మళ్లీ పునరుజ్జీవిస్తోందనే సందేశం కూడా ఇస్తుంది.

భూముల స్వాధీనం..
ప్రస్తుతం 3,729 కణాల ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆలయాల పరిరక్షణ, భవిష్యత్‌ నిర్వహణ కోసం ప్రభుత్వం చాలా ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందనే భావన కలిగిస్తుంది. వేడుకల తర్వాత ఆలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వం స్వీకరించడం ద్వారా భద్రత, నిర్వహణ, నిధుల ప్రవాహం క్రమబద్ధం అవుతుంది; ఇది కాశ్మీర్‌లో హిందూ ధర్మం పై ప్రత్యక్ష ప్రభుత్వ మద్దతు ఉందనే సందేశాన్ని పంపుతుంది.

Today 6 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం..

Today 6 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా మెరుగైన ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మాటల మాట్లాడేటప్పుడు తొందర పడొద్దు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. స్నేహితుల సహకారంతో విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో తమ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు నైపుణ్య ప్రదర్శనతో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఉంటాయి. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బంధువుల సహాయంతో అప్పులు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉంటుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో ఈరోజు అధిక లాభాలు పొందుతారు. మీకు సంబంధం లేని వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది. శని దేవుడి అండదండలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అనవసరమైన పనులకు దూరంగా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన ప్రాజెక్టులను చేపడుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉన్నటువంటి వ్యాపారాలు అత్యధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో అప్పులను తీరుస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా రంగాల్లో కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి అండదండలతో ఉద్యోగులు తమ కార్యకలాపాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం లో గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను సకాలంలో పోల్చి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక ముఖ్యమైన వ్యక్తి కలవడంతో వ్యాపారులకు కలిసి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య ఉండడంతో వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో మానసికంగా సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

RB Choudary Death: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దుర్మరణం.. శోకసంద్రంలో టాలీవుడ్

RB Choudary Death: ప్రముఖ లెజండరీ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందడం ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని శోకసంద్రం లోకి నెట్టేసింది. రాజస్థాన్ లో ఒక కారు యాక్సిడెంట్ లో ఆయన చనిపోయినట్టు తెలుస్తోంది . తెలుగు , తమిళం , హిందీ భాషల్లో 100 కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన చరిత్ర ఆయనది. విక్టరీ వెంకటేష్ , మెగాస్టార్ చిరంజీవి లతో ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించాడు. అదే విధంగా నేటి తరం స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’, రామ్ చరణ్ తో ‘రచ్చ’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసాడు. ఇలా వరుసగా మంచి సినిమాలు తీయడం వల్ల, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా , ఈ బ్యానర్ నుండి వస్తే చాలు సూపర్ హిట్ అనే రేంజ్ లో ఆడియన్స్ లో ఒక ముద్ర పడింది.

అలాంటి సినిమాలను నిర్మించిన ఆయన నేడు తిరిగి రాని లోకాలకు పయనం అవ్వడం దురదృష్టకరం. ఆయన లేని లోటు ఎవ్వరూ పూడవలేనిది. ఇక ఆయన కుమారుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన జీవా కూడా తమిళనాడు లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన హీరో గా నటించిన ‘రంగం’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం వంద రోజులకు పైగా ఆడింది. ప్రస్తుతానికి ఈ హీరో ఫార్మ్ లో లేడు కానీ, మంచి కమర్షియల్ సినిమా చేస్తే భారీ కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆర్బీ చౌదరి మరణం పై తెలుగు , సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ట్వీట్లు వేస్తూ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఆర్బీ చౌదరి తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.

Santiago Martin: మయన్మార్ లో కూలీ.. తమిళనాడు ఎన్నికల్లో మూడు సీట్లు..

Santiago Martin: ఈసారి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ తర్వాత స్థాయిలో మీడియాను ఆకర్షించిన వ్యక్తి పేరు శాంటియాగో మార్టిన్. ఇతడేమీ మామూలు వ్యక్తి కాదు. అన్ని రాజకీయ పార్టీలకు కావలసిన వాడు. భారీగా డబ్బున్నవాడు. అంతకుమించి పలుకుబడి ఉన్నవాడు. ఈ స్థాయి వ్యక్తిని మయన్మార్ లో కూలి అని ఎలా ప్రస్తావించారని.. మీకు అనుమానం రావచ్చు. దాని నివృతి కోసం ఈ స్టోరీ చదివేయండి.

లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబం నుంచి ఈసారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మార్టిన్ సతీమణి లీమారోస్ లాల్ గుడి నియోజకవర్గం నుంచి అన్న డీఎంకే తరఫున పోటీ చేసి గెలిచారు. ఈమె అన్న డీఎంకే పార్టీకి మహిళా విభాగ సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మార్టిన్ అల్లుడు అధవ్ అర్జున టీవీకే కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఇతడు విక్కీ వక్కం తాళం నుంచి విజయం సాధించారు. మార్టిన్ కుమారుడు చార్లెస్ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ కామరాజు నగర్ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన లాచీయ జననాయక కట్చి పార్టీ తరఫున పోటీ చేశారు.

మార్టిన్ ఇప్పుడంటే ఆగర్భ శ్రీమంతుడు. కానీ ఒకప్పుడు ఆయన మయన్మార్లో కూలి. 1988లో మన దేశానికి తిరిగి వచ్చాడు. తమిళనాడు రాష్ట్రంలో లాటరీ వ్యాపారం ప్రారంభించాడు. ఆ తర్వాత దానిని కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు విస్తరించాడు. ఆ తర్వాత ఈశాన్య భారతదేశం వెళ్లిపోయాడు. అక్కడ ప్రభుత్వాలతో కలిసి లాటరీ స్కీమ్ లు నిర్వహించాడు. భూటాన్, నేపాల్ ప్రాంతాలలో కూడా ఈ వ్యాపారాలు సాగించాడు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, టెక్స్టైల్, హాస్పిటాలిటీ రంగాల్లోకి ప్రవేశించాడు. ఈయన ఆధ్వర్యంలో ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనసాగుతోంది. దీనికి వరల్డ్ లాటరీ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఉంది. క్యాసినో, ఆన్లైన్ గేమింగ్ వంటి వాటిని ఇది నిర్వహిస్తూ ఉంటుంది.

మార్టిన్ లాటరీ స్కీమ్ లతో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అయితే అందులో మోసాలకు పాల్పడ్డాడు. వేలకోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. నీతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అతని కార్యాల మీద దాడులు చేశాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన ఆదాయంతో మార్టిన్ కోట్లు ఖర్చుపెట్టి ఆయా రాజకీయ పార్టీల బాండ్లు కొనుగోలు చేశారు. 2019, 24 కాలంలో అనేక రాజకీయ పార్టీలకు ఈయన విరాళాలు ఇచ్చాడు.

Southern India Challenge BJP: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి సవాల్‌ గా దక్షిణాది

Southern India Challenge BJP: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన కమలదళం, ఉత్తర, ఈశాన్య భారత్‌లో తన పట్టును మరింత పటిష్టం చేసుకుంది. అయితే, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం పార్టీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. కర్ణాటక మినహా మిగిలిన దక్షిణ భారత రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణ ఇంకా ఒక సవాలుగానే మిగిలిపోయింది.

దక్షిణాదిలో బీజేపీకి సవాళ్లు..
తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ద్రవిడ ఆత్మగౌరవ వాదం, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వం బీజేపీ జాతీయ అజెండాకు అడ్డంకిగా మారుతున్నాయి. ‘యునైటెడ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ సౌత్‌ ఏషియా’ వంటి భావనలు ప్రాంతీయ ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, జాతీయ పార్టీల విస్తరణను నిరోధిస్తున్నాయి.

వ్యూహాత్మక లోపాలు..
కేరళ, తమిళనాడులో బీజేపీ అమలు చేసిన వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పును తీసుకురాలేదు. తమిళనాడులో పార్టీ సొంతంగా ఎదగలేక అన్నాడీఎంకేపై ఆధారపడటం, కేరళలో పోలరైజేషన్‌ రాజకీయాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం వంటివి పార్టీకి ప్రతికూలంగా మారాయి.

ప్రజావ్యతిరేకత..
స్థానిక సమస్యలను గుర్తించడంలో, క్షేత్రస్థాయి నేతలను ప్రోత్సహించడంలో పార్టీ చేస్తున్న పొరపాట్లు, ప్రతిపక్షాలకు కలిసొస్తున్నాయి. ఏపీలో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ కంటే ఆ ప్రాంతీయ పార్టీకే ఎక్కువ లాభం చేకూరుతోందనే విశ్లేషణలు ఉన్నాయి.

దక్షిణాదిలో విస్తరించాలంటే బీజేపీ తన వ్యూహాలను క్షుణ్ణంగా సమీక్షించుకోవాలి. జాతీయ అజెండాతో పాటు, రాష్ట్రాల ప్రత్యేక సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. కుల, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని వర్గాలను కలుపుకుపోయేలా కార్యాచరణ ఉండాలి. తమిళనాడులో ’తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) వంటి కొత్త శక్తుల ఆవిర్భావం, రాజకీయాల్లో వస్తున్న మార్పులను బీజేపీ గమనించాలి. సంప్రదాయ రాజకీయ శక్తులపైనే ఆధారపడకుండా, యువతను ఆకర్షించే సరికొత్త రాజకీయ అజెండాను సిద్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే దక్షిణాదిలో బీజేపీ తన కమల జెండాను రెపరెపలాడించగలదు.

Karimnagar Jewellery Robbery: కరీంనగర్ టు మహారాష్ట్ర.. వయా ధర్మపురి.. బంగారం దొంగలు తప్పించుకున్న రూట్ దొరికింది

Karimnagar Jewellery Robbery: తెలంగాణలోని కరీంనగర్ నగర నడిబొడ్డున పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన సాయుధ దోపిడీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పట్టపగలే ఐదుగురు దుండగులు తుపాకులతో షోరూమ్‌లోకి చొరబడి, సిబ్బందిని తుపాకులతో బెదిరించి కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది గాయపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

దొంగల కోసం గాలింపు..
దోపిడీకి పాల్పడిన దొంగల కోసం పోలీసులు 20 బృందాలుగా గాలిస్తున్నారు. ఇప్పటికే దొంగలు రాష్ట్రం దాటినట్లు పోలీసులు గుర్తించారు. వారు ఏమార్గంలో ప్రయాణించారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. నిందితులు పరారైన పల్సర్ బైక్‌ను ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో పోలీసులు గుర్తించారు. బైక్‌తోపాటు సమీపంలోనే హెల్మెట్‌ను కూడా వదిలివెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్న పోలీసులు, గోదావరి తీర ప్రాంత గ్రామాలతో పాటు అటవీ పరిసరాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మహారాష్ట్రకు పరార్‌..
పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తాజాగా ధర్మపురి పుష్కర ఘాట్ వద్ద దోపిడీకి ఉపయోగించిన పల్సర్ బైక్ మరియు హెల్మెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ద్వారా దుండగుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. నిందితులు సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గోదావరి మార్గం మీదుగా మహారాష్ట్రకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ముమ్మరంగా తనిఖీలు
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పర్యవేక్షణలో బీర్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని స్థానికులు, వ్యాపారవేత్తలు కోరుతున్నారు. నిందితుల గాలింపు కోసం స

Jammu Kashmir Transformation: జమ్ము కాశ్మీర్ మారిపోయింది.. నరేంద్ర మోడీ కూడా ఊహించలేదు..

Jammu Kashmir Transformation: మన స్వస్థలాన్ని వదిలి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుంది.. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ మన పురిటి గడ్డకు వస్తే ఎంతటి ఆవేదన ఉంటుంది.. ఆ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేం. అప్పట్లో సునామీ వచ్చినప్పుడు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలామంది బతుకు జీవుడా అనుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత సునామీ వచ్చిన రోజున గుర్తుకు తెచ్చుకొని చెన్నై వస్తుంటారు. తమ వాళ్ళు కళ్ళముందే చనిపోవడంతో.. ఆ బాధను తట్టుకోలేక.. సముద్రాన్ని చూసి విలపిస్తుంటారు. ప్రకృతి విలయం వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అటువంటిది సాటి మనుషులు దారుణానికి పాల్పడితే.. మారణ హోమానికి కారణమైతే.. వారి వల్ల ఆప్తులను కోల్పోయి.. కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు వెళ్తే.. ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుంది. ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది. అటువంటి బాధను దశాబ్దాలుగా మోశారు కాశ్మీర్ పండిట్లు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ము కాశ్మీర్లో ఎన్నికలు జరిగిన తర్వాత.. అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ.. జమ్ము కాశ్మీర్లో ఒకప్పటి మాదిరిగా పరిస్థితి ఒకప్పటి మాదిరిగా లేదు. తాజా పరిస్థితులు అక్కడ మారిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లు జమ్ము కాశ్మీర్ తిరిగి వస్తున్నారు. అక్కడ మూతపడిన మందిరాలను తెలుస్తున్నారు. గుడులను శుభ్రపరుస్తున్నారు. ఆలయాలను పూర్తిగా పునర్నిర్మిస్తున్నారు. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. కాశ్మీర్ పండిట్లకు స్థానికంగా ఉన్న ముస్లింలు కూడా సహకరిస్తున్నారు. 19 89, 90 కాలంలో ఏ ముస్లింలు అయితే కాశ్మీరీ పండిట్లను కాశ్మీర్ నుంచి వెళ్లగొట్టారో.. వారే ఇప్పుడు కాశ్మీర్ పండిట్లకు సహకరిస్తున్నారు.

ఇటీవల నార్త్ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో చందిగ్రామ్ మందిరాన్ని పున ప్రతిష్టించారు.. దీనికోసం స్థానికంగా ఉన్న ముస్లింలు కాశ్మీర్ పండిట్లకు సహకరించారు.. బారా ముల్లా జిల్లాలోని కచ్వా ప్రాంతంలో వినాయకుడి ఆలయాన్ని కూడా బాగు చేశారు. ఈ ఆలయాన్ని వదిలి వెళ్ళిన తర్వాత పూర్తిగా నాశనమైపోయింది. అక్కడి అధికారులు చుట్టూ కంచె మాత్రమే నిర్మించారు. కాశ్మీర్ పండిట్లు ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. ఫలితంగా ఆలయం ఇటీవల పున ప్రారంభమైంది.

ఆలయాలను పునరుద్ధరించడం మాత్రమే కాకుండా.. గతంలో ఉన్న లెక్కలను సైతం కాశ్మీరీ పండిట్లు, హిందువులు బయటికి తీస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆలయాల కోసం గతంలో ఉన్న 3,729 కనాల్స్ భూమిని కేటాయించినట్టు తెలుస్తోంది. గతంలో మాదిరిగా ముస్లింలు లేరు. గతంలో మాదిరిగా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం లేదు. మొత్తంగా చూస్తే జమ్ము కాశ్మీర్లో ఒకప్పటి వాతావరణం కనిపిస్తోంది. అందువల్లే గతంలో నిర్వహించినట్టుగానే జాతరలు,. వేడుకలు జరుపుకుంటామని కాశ్మీర్ హిందువులు, పండిట్లు పిలుపునిస్తున్నారు.. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముఖ్యంగా శ్రీనగర్లోని హిందువులు ఒకప్పుడు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కృష్ణాష్టమి, శ్రీరామనవమి, దుర్గాష్టమి వంటి వేడుకలు ఘనంగా జరుపుకుంటామని కాశ్మీరీ పండిట్లు చెబుతున్నారు.

వాస్తవానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇక్కడ వారు కలలో కూడా ఊహించలేదు. తాము తమ సొంత ప్రాంతాలకు వెళ్తామని కాశ్మీర్ పండిట్లు ఏమాత్రం అంచనా వేయలేదు. లాల్ చౌక్ ప్రాంతంలో జాతీయ జెండా ఎగురుతుందని ఏ భారతీయుడు కూడా అంచనా వేయలేదు. కానీ ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే జమ్ము కాశ్మీర్ లో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఇది మార్పునకు సంకేతం. రేపటి అందమైన భవిష్యత్తుకు సజీవమైన ముఖచిత్రం.

Vijay Court Case Before Oath: ప్రమాణ స్వీకారం కాకముందే.. కోర్టుకు విజయ్.. ఏం జరుగుతోంది..

Vijay Court Case Before Oath: తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయడం లాంచనమే. ఇప్పటికే ఆయన గవర్నర్ కు లెటర్ రాశారు. దానికి గవర్నర్ ఒప్పుకున్నారు. దీంతో విజయ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇది విజయ్ అభిమానుల్లో.. టీవీకే శ్రేణులలో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విజయ్ కి సంబంధించిన ఒక వ్యవహారం ఇప్పుడు మీడియాలో చర్చకు దారితీస్తోంది.

ఎన్నికలకు ముందు విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకుల కోరింది. ఆయన ఒక సినీ నటితో సంబంధంలో ఉన్నట్టు ఆమె అందులో ఆరోపించింది. ఎన్నికలకు ముందు సంగీత ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో విజయ్ రాజకీయ భవితవ్యం ఒకరకంగా ప్రశ్నార్ధకంలో పడింది. అయితే విజయ్ కి సంబంధించిన ఈ వ్యక్తిగత వ్యవహారాన్ని తమిళ ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. విజయ్ పార్టీకి ఏకం లగా 108 సీట్లు కట్టబెట్టారు.

ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. విజయ్ విడాకుల కేసు ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఈ కేసును చంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు విచారించింది. జూన్ 15 కు వాయిదా వేసింది.. నాడు సంగీత, జై తమ ముందు హాజరుకావాలని పేర్కొంది.. విజయ్ ప్రమాణస్వీకారం త్వరలో చేస్తుండడం.. ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏలబోతున్న నేపథ్యంలో.. చెంగల్పట్టు కోర్టు ఆయనకు మినహాయింపు ఇస్తుందా.. అనే ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది.

ఒకవేళ వ్యక్తిగతంగా హాజరు కాకపోతే విమర్శలు తప్పవు. హాజరైతే విడాకుల కోసం కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి అనే ప్రచారం కూడా జరుగుతుంది. విజయ్ , త్రిష సంబంధం అధికారికంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో ఆ బంధానికి ప్రజల నుంచి గ్రీన్సిగ లభించింది అని టీవీ కే కార్యకర్తలు అంటున్నారు.. సంగీత ఏదో జరుగుతుందని భావించారని.. చివరికి విజయ్ గెలవడంతో ఆయన భార్యహోదాని కూడా కోల్పోయారని టీవీ కే కార్యకర్తలు అంటున్నారు. మరికొందరేమో సంగీత మంచి నిర్ణయం తీసుకుందని.. ఆత్మ గౌరవాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదని ఆమెను సమర్థించారు..

విజయ్ సంగీత కోరినంత భరణం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అందువల్లే ఎన్నికల ముందు సంగీత నిశ్శబ్దంగా ఉన్నారని సమాచారం. ఒకవేళ త్రిష గనుక విజయ్ రాజీనామా చేసే స్థానం నుంచి పోటీ చేస్తే.. అప్పుడు కథ వేరే విధంగా ఉంటుంది. ఒకవేళ ఆమె తిరుచి ఈస్ట్ నుంచి గెలిస్తే జయలలిత, ఎంజీఆర్ ఎపిసోడ్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

West Bengal Election Results: బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ గెలిచిందట.. సీఎం పదవికి మమత రాజీనామా చేయదట

West Bengal Election Results: కిందపడినా నాదే పై చేయి అని వాదించే వాళ్ళతో మాట్లాడలేం. నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని వాళ్ళతో మాట్లాడే సాహసం చేయలేం. మమతా బెనర్జీ కూడా ఇదే టైపు. ఎప్పుడైతే తను కమ్యూనిస్టులను ఢీ కొట్టి అధికారంలోకి వచ్చిందో.. అప్పుడే ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా తుంగలో తొక్కింది. తన పార్టీ కార్యకర్తలను గుండాలుగా మార్చింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సార్వభౌమ అధికారాన్ని తాకట్టు పెట్టింది. కనీసం ఎటువంటి ఆధారాలు పరిశీలించకుండా అడ్డగోలుగా బంగ్లాదేశ్ ప్రజలకు ఆధార్ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. అంతేకాదు భారత్ అనేది అందరికీ నివాసయోగ్యమైన దేశమని వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్ ప్రజలు ఈ దేశంలో భాగమని నెత్తిలేని మాటలు మాట్లాడింది.

ఆర్థికంగా అవకతకలకు పాల్పడుతున్నారు.. డబ్బును రకరకాల ఖాతాలకు మళ్లిస్తున్నారు అనే అభియోగాలతో ఐ ప్యాక్ బృందం కార్యాలయాలపై కేంద్ర అధికారులు దాడులు చేస్తే నెత్తి నోరు మొత్తుకుంది మమత. చివరికి అధికారులకు అడ్డుగా నిలబడింది. తాను ఒక ముఖ్యమంత్రి అనే సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. అంతేకాదు పరిపాలనలో మేనల్లుడి జోక్యం పెరిగిపోయి.. వ్యవస్థలు మొత్తం నాశనమవుతున్నా పట్టించుకోని మమతా బెనర్జీ.. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోగానే మహానటి మాదిరిగా నటిస్తోంది. పైగా బెంగాల్ రాష్ట్రంలో లూటీ చేసి గెలిచారట. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయదట.

లోక్ భవన్ కు వెళ్ళదట.. వెస్ట్ బెంగాల్లో బిజెపి విజయం కోసం ఎన్నికల సంఘం, కేంద్రం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా కుట్ర చేశాయట. లెక్కింపు కేంద్రాలలో ఆమె పార్టీ కార్యకర్తలను దారుణంగా కొట్టారట. దేశంలో ఒకే పార్టీ ఉండాలని బిజెపి చూస్తోందట.. ఇలాంటి ఫెడరల్ పోకడలు మమతలో ఉన్నాయి కాబట్టే కదా బెంగాల్ ప్రజలు భవానిపూర్ ప్రాంతంలో ఓడించింది. నువ్వు వద్దు.. నీ పరిపాలన వద్దు.. అంటూ తన్ని తరిమేసింది.

బెంగాల్ రాష్ట్రాన్ని గొప్పగా పాలించానని చెబుతున్న మమత 2021లో ఎందుకు పడిపోయింది.. అప్పుడు బిజెపి ఇబ్బంది పెట్టిందా.. సిఆర్పిఎఫ్ బలగాలు టి ఎం సి కార్యకర్తలను కొట్టాయా.. లేకపోతే రిగ్గింగ్ చేశాయా.. నాడు నందిగ్రామ్ ప్రాంతంలో ఓటమిపాలైంది. తట్టుకోలేక భవాని పూర్ వచ్చింది. అక్కడ కూడా జనాలు కాండ్రించి ఉమ్మడంతో ఓడిపోయింది. ఇప్పటికైనా మమత నేల మీదికి రావాలి. 71 సంవత్సరాల వయసులో తదుపరి శేష జీవితాన్ని హాయిగా గడపాలి. ఇప్పటికే చాలామంది టీఎంసీ ఎమ్మెల్యేలు బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఎవరు పార్టీలో ఉంటారు తెలియని పరిస్థితి. అలాంటప్పుడు పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు మమత చేయాలి. బిజెపికి ఎదురు వెళ్లే వ్యవహారాలకు పాల్పడితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. కోడి ఎంత బలిసినా సరే.. చికెన్ షాప్ ముందుకు వెళ్లి తొడ కొట్టకూడదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mahesh Babu Namrata Relationship: మహేష్ బాబు నమ్రత ఇన్ని సంవత్సరాలైన కలిసి మెలిసి ఉండటానికి కారణం ఇదే…

Mahesh Babu Namrata Relationship: ఒక్కపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎవ్వరు పట్టించుకునేవారు కాదు…కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే తెలుగు సినిమాలు టార్చ్ బేరర్ గా మారిపోయాయి… మన స్టార్ హీరోలు సైతం వైవిద్య భరితమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం మొన్నటి వరకు తెలుగుకే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి పాన్ ఇండియాలో సైతం పెద్దగా మార్కెట్ లేని మహేష్ బాబును పాన్ వరల్డ్ లోకి తీసుకెళ్తున్న ఘనత రాజమౌళికే దక్కింది…మహేష్ బాబు ఏ సినిమా చేయాలన్నా కూడా తన భార్య అయిన నమ్రతనే కథలను విని అది మహేష్ బాబుకి సెట్ అవుతుందా? లేదా అనే విషయాలను పరిశీలించిన తర్వాత ఆ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మహేష్ బాబు నమ్రతల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఇద్దరు కలిసిమెలిసి జీవిస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అంటూ చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోతున్నారు. కానీ వీళ్లు మాత్రం రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య బాండింగ్ ఇంకా బలంగా మారుతుంది తప్ప వీక్ అవ్వడం లేదు. ఎందుకని వాళ్ళు అంత స్ట్రాంగ్ గా కలిసి మెలిసి బతుకుతున్నారు.

దానికి గల కారణాలను కూడా కొంతమందికి చెబితే విడిపోయే జంట కూడా కలిసే అవకాశాలు ఉంటాయి కదా అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికైతే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరి నిర్ణయాలకు మరొకరు గౌరవాన్ని ఇస్తూ ఒక విషయాన్ని ఇద్దరు కలిసి చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారట.

అందువల్లే వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు రావడం లేదట… అందువల్లే వీళ్ళ మధ్య బాండింగ్ బాగా కుదిరింది. అందరు అలానే ఉంటే ఎవ్వరి మధ్య విభేదాలు రావు. ఎవ్వరు విడిపోరు అంటూ చాలామంది వీళ్లను ఉదాహరణగా తీసుకొని విడిపోయే జంటలకు సలహాలనైతే ఇస్తున్నారు…

Telugu Heroes Dominating Bollywood: బాలీవుడ్ ను డామినేట్ చేసే నలుగురు తెలుగు హీరోలు వీళ్ళే…

Telugu Heroes Dominating Bollywood: డిఫరెంట్ సినిమాలను చేస్తూన్న హీరోలందరు సూపర్ హిట్లను అందుకుంటున్నారు. స్టార్ హీరోలైతే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి ఒక ఇద్దరికి మాత్రం సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఎవరికీ దక్కని క్రేజ్ ను కూడా వాళ్లు దక్కించుకోవడం విశేషం…ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతుండటం విశేషం…ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ గొప్ప విజయం సాధించిన ఘనత కూడా వీళ్ళకే దక్కుతుంది. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన వాళ్ళలో వీళ్లు మొదటి స్థానంలో ఉంటారు…

ఈ నలుగురు హీరోల్లో ఎవరు నెంబర్ వన్ హీరోగా మారబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఇండియాలో చాలామంది హీరోలు తమ సత్తా చాటుతున్నప్పటికి మన హీరోలకు దక్కుతున్న గౌరవం ఇతర భాషల హీరోలకు దక్కడం లేదు. దానివల్లే మన వాళ్ళతో సినిమాలు చేయడానికి చాలామంది మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఎట్టకేలకు మన హీరోలు ఈ సంవత్సరం టాప్ హీరోలుగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారే అవకాశం కూడా మన హీరోలకే ఉందని చాలామంది చెబుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీని డామినేట్ చేయగలిగే కెపాసిటి మన హీరోలకు మాత్రమే ఉంది…

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న మన హీరోలు వాళ్ళ మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2000 కోట్ల మార్క్ కు చేరువలో ఉన్నారు. ఇక ఇప్పుడు 2500 కోట్ల వరకు వల్ల మార్కెట్ ను విస్తరించుకునే అవకాశం కూడా ఉంది…చూడాలి మరి వీళ్లలో ఎవరు టాప్ లోకి వెళ్తారు… ఎవరు డీలా పడిపోతారు అనేది…