Home Blog Page 282

బాలయ్య కథ తో రవితేజ.. ఇది కదా ఊర మాస్ కాంబినేషన్ అంటే.. పూర్తి వివరాలు ఇవే..

Ravi Teja Transgender Role
Ravi Teja Transgender Role

Balakrishna story for Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు నేటి తరం యూత్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా తనని తాను మార్చుకున్నట్టుగా అనిపిస్తోంది. ‘ధమాకా’ తర్వాత రవితేజ చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఒకప్పుడు 40 నుండీ 50 కోట్ల రూపాయిల రేంజ్ లో ఉండే రవితేజ మార్కెట్ , ఈ ఫ్లాప్స్ కారణంగా 10 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఆయన గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల రూపాయలకు జరిగితే , కేవలం 11 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టింది , దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు రవితేజ మార్కెట్ ఏ రేంజ్ లో పడిపోయింది అనేది.

అయితే రవితేజ ని ఈ ఫ్లాప్స్ బాగా అలర్ట్ చేశాయి. అందుకే ఇకపై ఆయన చేసే ప్రతీ సినిమా మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన ప్రముఖ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ‘సరిపోదా శనివారం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న వివేక్ ఆత్రేయ తన తదుపరి చిత్రాన్ని బాలయ్య బాబు తో చెయ్యాలని అనుకున్నాడు. బాలయ్య కి కథ వినిపించగా, ఆయనకు తెగ నచ్చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయితే కానీ, మన సినిమా సెట్స్ మీదకు వెళ్ళదని బాలయ్య క్లారిటీ ఇవ్వడం , సమయం వృధా చేయకుండా వివేక్ ఆత్రేయ అదే స్టోరీ ని రవితేజ కి వినిపించాడు. రవితేజ కి కూడా ఈ స్టోరీ తెగ నచ్చేసింది. వెంటనే ఈ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వం లో ‘ఇరుముడి’ అనే చిత్రం చేస్తున్నాడు. తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన ఈ సినిమాని రవితేజ ఎంచుకోవడం తో , ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియా భావాన్ని శంకర్ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

వర్క్ ఫ్రం హోం అనేది ఇక ఫ్యూచర్ కాదు… అది ఇప్పుడు రియాలిటీ

Telugu Desam Party Rajya Sabha Selection
Telugu Desam Party Rajya Sabha Selection

Chandrababu work from home statement: పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనదేశంలోనూ కనిపిస్తోంది. అందుకే ముందస్తు సన్నాహంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు సూచనలు చేశారు. ఇందన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని.. ఇలా పలు రకాల సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రధాని సూచనలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాలను పాటించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంపై మాట్లాడారు సీఎం చంద్రబాబు.

కొవిడ్ తర్వాత
కరోనా వచ్చిన తరువాత వర్క్ ఫ్రం హోం అనేది వెలుగులోకి వచ్చింది. కంపెనీలు ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు.. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు గాను అప్పట్లో వర్క్ ఫ్రం హోం అమలు చేశారు. అయితే ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం అమలవుతూనే ఉంది. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం అంటూ ఒక సర్వే చేపట్టింది. ఇంట్లో ఉండి ఉపాధి పొందేందుకు వీలుగా ఈ సర్వే సాగింది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చూసింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 8 అంశాల్లో పొదుపు పాటించాలని పిలుపునివ్వడంతో.. వర్క్ ఫ్రం హోం ను పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. గజగదానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంటి నుంచే పని..
వర్క్ ఫ్రం హోం అనేది రియాలిటీ. ఇంటి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి ఉంటుంది. దీనికి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం విశేషం. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానం తెస్తామని.. తద్వారా దుబారా ఖర్చును తగ్గిస్తామన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా తమ కాన్వాయ్ వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా సెక్యూరిటీ తగ్గించుకునే పనిలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ప్రపంచ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే కంటే మన దేశంతో పాటు సొంత రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా పొదుపు మంత్రం పై కీలక సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హిందువులకు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన కమెడియన్ అలీ.. వీడియో వైరల్..

Comedian Ali apology to Hindus
Comedian Ali apology to Hindus

Comedian Ali apology to Hindus: ప్రముఖ కమెడియన్ అలీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. రీసెంట్ గానే ఆయన ఒక సబ్బుకు సంబంధించిన కమర్షియల్ యాడ్ లో నటించాడు , అందులో ఆయన హిందువుల మనోభావాలను దెబ్బ తీసాడని సోషల్ మీడియా లో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇది బాగా వైరల్ అవ్వడం తో హిందూ సంఘాలు కూడా అలీ పై మండిపడ్డాయి. పూర్తి వివరాల్లోకీ వెళ్తే అలీ రీసెంట్ గా ఘర్ సోఫ్ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ లోని బ్యాక్ గ్రౌండ్ పవిత్రమైన లక్ష్మీ దేవి మంత్రాలు వినిపించాయి. దీనిపై హిందూ సంఘాలు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేందుకు అలీ కి ఏ హక్కు ఉందని , తక్షణమే ఇతన్ని సినీ ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే దీనిపై అలీ కాసేపటి క్రితమే క్షమాపణలు చెప్తూ వివరణ ఇచ్చాడు , అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘ఘర్ సోఫ్ యాడ్ లో దేవుడు చేసిన మనుషులు చిత్రం లోని ఒక చిన్న బిట్ ని రీ క్రియేట్ చేశాము. అది కొంతమందిని బాధ పెట్టిందని తెలిసింది. అందుకే ఇప్పుడు ఆ యాడ్ ని తొలగించాము , ఎవరికైనా బాధ కలిగి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అలీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక అలీ సినిమాల విషయానికి వస్తే, ఒకప్పుడు ఈయన టాప్ మోస్ట్ కమెడియన్ , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ఎందుకో ఇప్పుడు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. అంతే కాకుండా రాజకీయాల నుండి కూడా ఆయన తప్పుకున్నాడు , గతం లో ఆయన వైసీపీ పార్టీ లో కొనసాగిన సంగతి తెలిసిందే.

ఇక సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోవడం తో ఇప్పుడు అలీ బుల్లితెర పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ప్రస్తుతం స్టార్ మా చానెల్ లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతుంది. వీటితో పాటు ఆయన పలు రియాలిటీ షోస్ కి కూడా జడ్జీ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో అలీ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఆ మూవీతో చిరంజీవి ని డామినేట్ చేసిన బాలయ్య...ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించాడు..

Balayya dominated Chiranjeevi
Balayya dominated Chiranjeevi

Balayya dominated Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవ్వరికి లేని క్రేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను చేశాడు. 1992 ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ అయిన ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి 16.5 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది… ఇక ఈ క్రమంలోనే చిరంజీవిని బీట్ చేసే హీరోలు ఎవ్వరు లేరని అందరు అనుకున్నారు. కానీ బాలయ్య బాబు సైతం అదే సంవత్సరం ఘరానా మొగుడు రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత అంటే మే 9 వ తేదీ 1992 లో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాను రిలీజ్ చేశాడు.

ఈ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి ఘరానా మొగుడు ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాస్తు 17.5 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం అనేది ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు చిరంజీవి మధ్య ఎప్పటికప్పుడు పోటీ ఉంటూనే వస్తుంది.

కానీ చిరంజీవి చాలా సందర్భాల్లో తనను తాను వైవిధ్యంగా ప్రదర్శించుకొని ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడంతో బాలయ్య బాబు కంటే ఒక అడుగు ముందు వరుసలో ముందుకు దూసుకెళ్తూ వచ్చాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరి సినిమాలు వస్తున్నాయంటే చాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్ అయితే నెలకొంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికే చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. బాలయ్య బాబు సైతం మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ బీ,సీ సెంటర్లో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నాడు… చూడాలి మరి రాబోయే సినిమాలతో వీళ్లిద్దరు ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటారనేది తెలియాల్సి ఉంది…

'పెద్ది' మూవీలో శివరాజ్ కుమార్ పాత్రను మిస్ చేసుకున్న ఇద్దరు నటులు వీళ్లే...

Peddi movie Shivraj Kumar role
Peddi movie Shivraj Kumar role

Peddi movie Shivraj Kumar role: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్తపుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రామ్ చరణ్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళుతున్నాడు. గత సంవత్సరం ‘గేమ్ చేంజర్’ సినిమా తో కొంతవరకు డీలా పడిన ఆయన ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు అయితే ఈ పాత్ర కోసం మొదట వేరే హీరోలను అనుకున్నారట.

కానీ అనుకోని కారణాల వల్ల ఫైనల్ గా శివరాజ్ కుమార్ కి ఆ పాత్ర చేసే అవకాశం దక్కింది. అతని కంటే ముందు ఉపేంద్ర, విక్రమ్ లాంటి నటులతో ఈ క్యారెక్టర్ చేయించాలని అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరు హ్యాండ్ ఇవ్వడంతో శివరాజ్ కుమార్ తో ఈ పాత్రను చేయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా శివరాజ్ కుమార్ సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

ఇక అతను కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోగా పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడనే చెప్పాలి. అలాంటి నటుడు ఈ సీన్లో ఉండటం వల్ల కన్నడ సినిమా ఇండస్ట్రీ మార్కెట్ కి బాగా ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే అతన్ని ఈ క్యారెక్టర్ లో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తనదైన రీతిలో సక్సెస్ ను సాధించాల్సిన సమయమైతే ఆసన్నమైంది.

ఇక బుచ్చిబాబు ఈ సినిమాలో రామ్ చరణ్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బుచ్చిబాబు ఈ సినిమాని ఏ రేంజ్ సక్సెస్ గా నిలుపుతాడు. తద్వారా ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

నైజాం ప్రాంతం లోని ఆ థియేటర్స్ లో 'పెద్ది' విడుదల కష్టమేనా..? ఇంత అన్యాయమా..

Peddi movie Nizam release issue
Peddi movie Nizam release issue

Peddi movie Nizam release issue: టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతానికి పీకల్లోతు కష్టాల్లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 శాతం కి పైగా థియేటర్స్ సినిమాలు లేక మూత పడ్డాయి అంటే నమ్ముతారా?, కానీ అదే నిజం. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత , ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో ఒక్కటి కూడా సూపర్ హిట్ అవ్వలేదు. పెద్ద సినిమాలు ఆడకపోయినా కనీసం చిన్న సినిమాలైనా బయ్యర్స్ ని ఆదుకునేవి, కానీ ఇప్పుడు అది కూడా జరగడం లేదు. ఇంతటి దారుణమైన స్థితిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం మీదనే ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు , ఆశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి , ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా వచ్చింది కాబట్టి.

ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని , రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడనే టాక్ నడుస్తోంది. అయితే ఇండస్ట్రీ బాగుపడే సమయం లో , దిల్ రాజు వర్గం నైజాం ప్రాంతం లో చేస్తున్న తిరుగుబాటు , ఇప్పుడు ‘పెద్ది’ విడుదలపై అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నాయి. ‘పెద్ది’ చిత్రం నైజాం థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కొనుగోలు చేయడం వల్లే ఈ సమస్య. దిల్ రాజు , మైత్రీ మూవీ మేకర్స్ మధ్య నైజాం ప్రాంతం లో కోల్డ్ వార్ ఎంతో కాలం నుండి నడుస్తోంది , ఆ సంస్థ నుండి విడుదల అవుతున్న సినిమా కాబట్టే, అడ్డంకులు క్రియేట్ చేయాలనీ దిల్ రాజు గ్యాంగ్ ఇప్పుడు కమీషన్ బేసిస్ మీద సినిమాలను నడపాలని డిమాండ్ ని తీసుకొచ్చారని , ‘పెద్ది’ చిత్రానికి అడ్డంకులు బలంగా ఏర్పాటు చేయాలనీ ఈ గ్యాంగ్ ఫిక్స్ అయ్యిందని అంటున్నారు.

ఇండస్ట్రీ లో ఈ కమీషన్ బేసిస్ మీద సినిమాలను నడపాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది , కానీ సరిగ్గా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి విడుదల అయ్యేటప్పుడే ఈ సమస్యలను తీవ్రవతం చేయాలనే ఆలోచన రావడం కచ్చితంగా టార్గెట్ కిందకే వస్తుంది. ఈ నెల ప్రారంభం లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి విడుదలైన ‘జెట్ లీ’ చిత్రాన్ని దిల్ రాజు ప్రాపర్టీస్ మరియు ఏషియన్ ప్రాపర్టీస్ లో విడుదలని బ్యాన్ చేశారు. ఆ కారణంగా ఆ చిత్రం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రాన్ని కూడా వాళ్ళ థియేటర్స్ లో బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు గ్యాంగ్ ఆడుతున్న ఈ హై డ్రామా కు కౌంటర్ గా నేడు మైత్రీ మూవీ మేకర్స్ , సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలకు చెందిన నిర్మాతలు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నారు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

సాయి భగీరథ్‌ కనిపించడం లేదు.. బండి సంజయ్‌ కుమారుడిపై హైదరాబాద్ లో పెద్దఎత్తున పోస్టర్లు.. కలకలం

Bandi Sai Bhageerath missing
Bandi Sai Bhageerath missing

Bandi Sai Bhageerath missing: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసింది. ఈ కేసు విచారణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి సిట్‌ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సాయి భగీరథ్‌ కూడా హనీట్రాప్‌ కేసు పెట్టాడు. తాజాగా తనపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోక్సో కేసు పెట్టిన అమ్మాయి మైనర్‌ కాదని కేసు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణలో సాయి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేయలేదు. దీంతో కొంతమంది సాయి భగీరథ్‌ ఎక్కడున్నా చెప్పాలని వెరైటీ ప్రచారం చేపట్టారు.

మెట్రోలో ప్రయాణికులకు విజప్తి..
హైదరాబాద్‌ మెట్రో రైలులో కొందరు సాయి భగీరథ్‌ ఫొటో పట్టుకుని తిరుగుతూ సాయి భగీరథ్‌ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొడుకు అని అతనిపై పోక్సో కేసు నమోదైందని, కానీ భగీరథ్‌ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడని వివరిస్తున్నారు. కనిపిస్తే 100 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరుతున్నారు. పోక్సో చట్టం కింద నిందితుడిగా ఉన్న ఆయన గురించి పోలీసులకు సమాచారం అందించమని విజ్ఞప్తి చేస్తున్నారు.

రాత్రి పోస్టర్లు..
ఇదే కాకుండ బండి సంజయ్‌ ఆయన కొడుకుతో కలిసి దిగన ఫొటోలతో హైదరాబాద్‌లో పోస్టర్లు వేశారు. కీలక ప్రాంతాల్లో అందరికీ కనిపించేలా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్‌ మాళ్ల వద్ద రాత్రి కొందరు ఈ పోస్టర్లు అంటించారు. కనబడడం లేదని, కనిపిస్తే పోలీసులకు చెప్పాలని పోస్టర్లలో పేర్కొన్నారు.

చట్టం, సామాజిక కోణాలు
ఇటువంటి పబ్లిక్‌ ప్రచారం చట్టవ్యవస్థను ప్రభావితం చేయవచ్చు, ఎందుకంటే పోక్సో కేసుల్లో రహస్యం అవసరం. పోలీసులు ఈ పోస్టర్ల వెనుక ఎవరో దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంది. సామాజికంగా, ఇది రాజకీయ కుటుంబాలపై ప్రజల అసంతృప్తిని తెలియజేస్తుంది. ఇలాంటి విధానాలు పోలీస్‌ పనిని సులభతరం చేయవచ్చు కానీ, దుర్వినియోగ అవకాశాలు కూడా ఉన్నాయి.

పోలీసులు ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, పోస్టర్ల సృష్టికర్తలు కూడా దొరుకుతారు. ఇది బండి సంజయ్‌ రాజకీయ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుంది. ప్రజలు సమాచారం అందించడం ద్వారా న్యాయం సాధించే అవకాశం పెరుగుతుంది.

గ్రాండ్ గా రీ లాంచ్ అయిన iBOMMA..కొత్త సినిమాల పైరసీ షురూ..

iBOMMA Relaunch
iBOMMA Relaunch

iBOMMA Relaunch: కొన్ని నెలల క్రితం నుండి నేషనల్ లెవెల్ లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన పేరు ఇమ్మడి రవి. iBomma అనే వెబ్ సైట్ ని రన్ చేస్తూ, అందులో కొత్త సినిమాలన్నీ అప్లోడ్ చేస్తూ సినీ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనాత్మకంగా మారిన అంశం. ఇతను అరెస్ట్ అయ్యాకా అందరూ ఊపిరి పీల్చుకున్నారు , ఎందుకంటే ఇక నుండి పైరసీ జరగదు అనే నమ్మకం సినీ నిర్మాతల్లో కలిగింది. కానీ ఇతను అరెస్ట్ అవ్వడం వల్ల సినీ ఇండస్ట్రీ కి ఎలాంటి మేలు జరగలేదు. పైరసీ సినిమాలు HD క్వాలిటీ తో ఇంటర్నెట్ లో ప్రత్యక్ష్యం అవుతూనే ఉన్నాయి. ఇక ఇతను బైలు మీద బయటకు వచ్చిన తర్వాత తన iBomma సైట్ ని రీ లాంచ్ చేశాడు . ఇదే ఇప్పుడు సంచలనాత్మకంగా మారిన అంశం.

ఇంటర్నెట్ లో bappam అనే లింక్ ని క్లిక్ చేస్తే నేరుగా iBomma సైట్ ఓపెన్ అవుతుంది. అందులో 2026 వ సంవత్సరం లో విడుదలైన కొత్త సినిమాలన్నీ దర్శనమిచ్చాయి. 10 రోజుల క్రితం విడుదలైన ‘గాయపడ్డ సింహం’, ‘జెట్ లీ’ ‘కర ‘ సినిమాలు ఇందులో ఉన్నాయి. దీని అర్థం రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు విడుదలైన మొదటి రోజే హై క్వాలిటీ తో మా iBomma సైట్ లో అప్లోడ్ చేస్తామని చెప్పకనే చెప్తున్నట్టు లెక్క. పోలీస్ స్టేషన్ లో అన్ని నెలలు గడిపిన తర్వాత కూడా రవి ఇలాంటి చర్యకు పాల్పడ్డాడు అంటే , అతని ధైర్యం చూడండి ఎలా ఉందో అని కొందరు కామెంట్ చేస్తుంటే , మరికొందరు మాత్రం రవి ప్రమేయం లో లేకుండా వేరే వాళ్ళు క్రియేట్ చేసుంటారు , అనవసరం గా రవి ని ఇరికించారని అంటున్నారు, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

రాజకీయాలకు బొత్స గుడ్ బై

Botsa Goodbye to Politics
Botsa Goodbye to Politics

Botsa Goodbye to Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కానీ.. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఆయన శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకోలేకపోయారు. అయితే శాసనమండలిలో వైసిపి పక్ష నాయకుడిగా బొత్సకు మాత్రం ప్రతిపక్ష హోదా ఉంది. ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా ఆయనది. అయితే గత కొంతకాలంగా బొత్స సైలెంట్ గా ఉన్నారు. కనీసం రాజకీయాల గురించి మాట్లాడడం లేదు కూడా. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆ మధ్యన విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి బోరున విలపించారు. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలపై బొత్స ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికోసం టిడిపి మంత్రి అచ్చెనాయుడు కామెంట్స్ చేసేసరికి మీడియా ముందుకు వచ్చి బోరున విలపించారు. అప్పటినుంచి ఆయన పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు.

తరచూ అనారోగ్య సమస్యలు..
గత ఎన్నికల తర్వాత బొత్స అనారోగ్యం భారిన పడుతున్నారు. గతంలో సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలు జరిపారు. ఆ సమయంలో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయారు. ఇంకోసారి అసెంబ్లీలో అస్వస్థతకు గురయ్యారు. చాలా రోజులపాటు హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. వచ్చిన తర్వాత కూడా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పై గతంలో చేసిన ఆరోపణలను టిడిపి గుర్తు చేస్తే కన్నీటి పర్యంతం అయ్యారు. అటు తరువాత పొలిటికల్ గా కనిపించకుండా మానేశారు. అందుకే ఇప్పుడు బొత్స పై విస్తృత చర్చ నడుస్తోంది. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పదవి నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటన నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీనిపై సీనియర్లతో చర్చిస్తారని సమాచారం.

రాజకీయాల్లో సుస్థిర స్థానం..
ఏపీ రాజకీయాల్లో బొత్సది ప్రత్యేక స్థానం. విజయనగరం జిల్లాలో ఓ సామాన్య నేతగా పొలిటికల్ అరంగేట్రం చేసిన బొత్స అనతి కాలంలోనే రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. బలమైన నాయకుడు కావడంతో జగన్మోహన్ రెడ్డి సైతం ప్రత్యేకంగా ఆహ్వానించి పార్టీలోకి తెచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున బొత్సతోపాటు ఆయన కుటుంబం గెలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కుటుంబంలో ఐక్యత లేదు. ఆపై బొత్స నిత్యం అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు సైతం బొత్సకు విశ్రాంతి ఇవ్వాలని కోరుతున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డిని. త్వరలో దీనిపై జగన్మోహన్ రెడ్డి సైతం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడి పదవి కోసం అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పోటీ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

బిజెపి, కాంగ్రెస్ విషయంలో మారిన జగన్ వైఖరి

Jagan political strategy change
Jagan political strategy change

Jagan political strategy change: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం కలవరపాటుకు గురిచేస్తోంది. అదే కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడం. మరోవైపు బిజెపి పెద్దలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం. ఈ రెండు పరిణామాలతో ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. కేంద్ర పెద్దలు ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. మొన్ననే వారిద్దరి ఇళ్లకు వెళ్లి మరి ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త సంకేతాలు పంపారు. తమకు బలమైన మిత్రులుగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బిజెపి విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గుతూ వచ్చింది. అసలు తత్వం బోధపడడంతో ఏం చేయాలో ఆ పార్టీకి తెలియడం లేదు. బిజెపి చంద్రబాబును బలమైన మిత్రుడిగా నమ్ముతుండడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుచించడం లేదు. కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడం కూడా ఆ పార్టీకి నచ్చడం లేదు.

నాలుగు చోట్ల కాంగ్రెస్..
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వరుసగా అధికారంలోకి రాగలిగింది. ఎందుకంటే ఐదు రాష్ట్రాలకు గాను నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముందుగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. తరువాత తెలంగాణలో పాగా వేసింది. ఇప్పుడు కేరళలో అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పక్షంగా ఉంది. అయితే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ క్రమేపి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం చూస్తుంటే ఆయనకు మింగుడు పడటం లేదు. ఒకవైపు చంద్రబాబు కేంద్ర పెద్దల ద్వారా రాజకీయంగా బలపడుతున్నారు. ఇంకో వైపు తాను వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. ఈ రెండు పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టనివ్వడం లేదు. అందుకే ఇప్పుడు ఏదో ఒక జాతీయ పార్టీతో నేరుగా స్నేహం చేసుకోవడం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిజెపితో కటీఫ్ చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలవడం మేలు అనేది విశ్లేషకుల మాట.

సాక్షిలో రాహుల్ కథనాలు..
అయితే ఇటీవల పరిస్థితి మారింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విషయంలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యతిరేక భావనతో ఉండేవారు. అటువంటిది తమిళనాడులో విజయ్ గెలుపుతో.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో.. రాహుల్ గాంధీతో విజయ్ కు ఉన్న కెమిస్ట్రీ ని హైలెట్ చేస్తూ సాక్షిలో వరుసగా కథనాలు వచ్చాయి. అసలు రాహుల్ ఫోటోను గాని.. అనుకూల వార్తను కానీ ప్రచురించేందుకు ఇష్టపడని సాక్షి.. రాహుల్ను హైలెట్ చేయడం చూస్తుంటే మాత్రం తెరవెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. మొన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. చంద్రబాబు ఇంటికి వెళ్లి గంటన్నర పాటు గడిపారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బిజెపి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. గతం మాదిరిగా కాంగ్రెస్ పార్టీ పట్ల ద్వేషం తగ్గడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

అత్యంత దయనీయమైన పరిస్థితిలో సూర్య 'వీరభధ్రుడు'..అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే..

Veerabhadrudu Collections
Veerabhadrudu Collections

Suriya Veerabhadrudu advance bookings: సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా తమిళ హీరో సూర్య పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల తర్వాత అత్యధిక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న సూపర్ స్టార్ ఇతను. ఇక మన టాలీవుడ్ లో అయితే ఒకప్పుడు ఇతని సినిమాకు మన స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్స్ , ఫుల్ రన్ కలెక్షన్స్ వచ్చేవి. అంతటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ , ఇప్పుడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో దారుణమైన పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు సూర్య సినిమాలకు యూత్ ఆడియన్స్ లో ఆసక్తి బాగా తగ్గిపోయింది. ఈ నెల 14 న విడుదల అవ్వబోతున్న ‘కరప్పు’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యంత దారుణమైన గ్రాస్ నమోదు అయ్యింది.

ముఖ్యంగా ఓవర్సీస్ ప్రాంతం లో టికెట్స్ అసలు అమ్ముడుపోవడం లేదు. నార్త్ అమెరికా మొత్తం మీద ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ ఎంతో తెలుసా?, అక్షరాలా 6 వేల డాలర్లు మాత్రమే. మన టాలీవుడ్ శ్రీ విష్ణు కి కూడా 2 లక్షల డాలర్లు ప్రీమియర్స్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండి వస్తున్న గ్రాస్ ఇది. అలాంటిది సూర్య లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి కేవలం 6 వేల డాలర్లు రావడం అనేది ఎంతటి అవమానకరమైన విషయంలో మీరే అర్థం చేసుకోండి. ఇక ఇండియా లో రాష్ట్రాల వారీగా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ వసూళ్లు ఎంతో ఒకసారి వివరంగా మీ ముందు ఉంచబోతున్నాము. ముందుగా తమిళనాడు విషయానికి ఈ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 4 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే నమోదు అయ్యాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

సూర్య స్థాయికి ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కేవలం 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదైంది. ఒకప్పుడు సూర్య కి తెలుగు రాష్ట్రాల నుండి మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేవి, అలాంటిది ఇప్పుడు కోటి గ్రాస్ కూడా బుకింగ్స్ ద్వారా నమోదు అవ్వలేదు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రము నుండి 60 లక్షల రూపాయిలు గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, కేరళ నుండి 50 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా వచ్చాయి. చూస్తుంటే ఈ చిత్రానికి రీసెంట్ గా విడుదలైన ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ కంటే తక్కువ గ్రాస్ నమోదు అవ్వొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఎట్టకేలకు రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త చెప్పిన 'పెద్ది' టీం.. ఇక ప్రతీ రోజు పండగే..

Peddi team latest announcement
Peddi team latest announcement

Peddi team latest announcement: గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు ‘పెద్ది’ మూవీ టీం పై ఎంతటి తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారో చూస్తూనే ఉన్నాం. సినిమాకు పట్టుమని 20 రోజులు కూడా లేవని , కానీ టీం ప్రొమోషన్స్ ని అసలు పట్టించుకోవడం లేదని , ఆ కారణం ఈ చేత ఈ చిత్రం పై ఏర్పడిన హైప్ మొత్తం డైల్యూట్ అయ్యిందని , ఆ ప్రభావం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై స్పష్టంగా కనిపిస్తుందని , రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ చేంజర్’ కంటే కూడా ఈ సినిమాకు తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుందని , ఇప్పటికైనా మేకర్స్ నిద్రలో నుండి మేలుకొని ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టాలని , లేదంటే ఓపెనింగ్స్ పై చాలా దారుణమైన ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

కొంతమంది అభిమానులు అయితే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటాము అంటూ కూడా బెదరించడం గమనార్హం. అందుకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి. అయితే అభిమానుల నుండి ఎదురు అవుతున్న అసంతృప్తి ని మేకర్స్ గమనించారు. వెంటనే స్పందిస్తూ ప్రొమోషన్స్ కి సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 18 న ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేయబోతున్నామని , ఈ ఈవెంట్ లో అనేక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ నెల 23 న భోపాల్ లో అతి పెద్ద మ్యూజికల్ నైట్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నామని , ఈ ఈవెంట్ లో సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ ని విడుదల చేయడం తో పాటు , సంగీత దర్శకుడు AR రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఉండబోతుందని చెప్పుకొచ్చారు.

ఈ రెండు ఈవెంట్స్ కూడా నార్త్ ఇండియా లో ఈ చిత్రం పై హైప్ ఏర్పడడానికి కారణం అవుతాయని , ప్రపంచవ్యాప్తంగా కూడా బజ్ మరోసారి క్రియేట్ అవుతుందని , అభిమానులు కంగారు పడాల్సిన అవసరమే లేదని , కచ్చితంగా ఈ చిత్రం మొదటి రోజున 100 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరోపక్క ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందు , అనేక ఇంటర్వ్యూస్ ని కూడా ప్లాన్ చేశారట. బాలీవుడ్ లోని ప్రముఖ టీవీ షోస్ కి కూడా పెద్ది టీం వెళ్లి ప్రొమోషన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రొమోషన్స్ లేవు అని అభిమానుల పడుతున్న బాధకు ఈ నెల 18 న తెరపడనుంది. అప్పటి నుండి ప్రతీ రోజు మేకర్స్ ప్రొమోషన్స్ తో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నారు.

పొదుపు మంత్రం.. తన కాన్వాయన్ ను తగ్గించుకున్న మోడీ

PM Modi convoy reduced
PM Modi convoy reduced

PM Modi convoy reduced: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ టీవీలో హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. అందులో ఇంధన పొదుపు ఒకటి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వినియోగం తగ్గించాలని సూచించారు. వర్క్ ఫ్రం హోం చేయాలన్నారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో, తన కాన్వాయ్‌లో ఉపయోగించే వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ఆదేశించారు. ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లుగా, ఇది సాధారణ పెట్రోల్-డీజిల్ వాహనాలను తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని పెంచడానికి దిశానిర్దేశం. భారతదేశంలో వార్షికంగా 2 వేల కోట్ల లీటర్ల పెట్రోల్-డీజిల్ వాడకం జరుగుతున్న నేపథ్యంలో, ఇటువంటి చర్యలు లక్షలాది కోట్ల రూపాయల ఆదాను తీసుకొస్తాయని నిపుణులు అంచనా. పొదుపు తన నుంచే మొదలు పెట్టాలని మోడీ కీలక ఆదేశాలు ఇచ్చారు.

భద్రతా ప్రోటోకాల్‌తో సమతుల్యత..
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్ పీ జీ) ఈ ఆదేశాన్ని అమలు చేస్తూ, ప్రధాని భద్రతా ప్రోటోకాల్‌కు ఎటువంటి భంగం రాకుండా చూస్తోంది. అధునాతన ఈవీలు గట్టి బాడీలు, రాడార్ సెన్సార్లు, డ్రోన్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో సిద్ధమవుతాయి. ఇది మాత్రమే కాకుండా, కాన్వాయ్‌లో 30-40 వాహనాలను 15-20కి తగ్గించడం ద్వారా రోడ్డు ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది.

పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలు..
ఈ చర్య ఇంధన ఆదాతో పాటు పర్యావరణానికి లాభదాయకం. ఒక ఈవీ వాహనం సంవత్సరానికి 5-7 టన్నుల CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది. భారతదేశం 2030 నాటికి 30 శాతం ఈవీలకు మారాలనే లక్ష్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఆర్థికంగా, పెట్రోల్ ధరలు రూ.100కి పైబడిన ఈ సమయంలో, కాన్వాయ్ ఖర్చు 40 తగ్గుతుంది.

ఈ నిర్ణయం దేశవ్యాప్త ఈవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వేగవంతం చేస్తుంది, ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ టెక్నాలజీలో పెట్టుబడులు పెరుగుతాయి. సవాళ్లుగా రహస్యత, ఛార్జింగ్ సమయాలు, సైబర్ సెక్యూరిటీ మిగిలాయి. అయినప్పటికీ, ఇది ప్రభుత్వ వాహనాలు, పౌరుల వాహనాలకు ఆదర్శంగా మారి, ‘గ్రీన్ మొబిలిటీ’కి ఊతమిస్తుంది.

23 నెలల్లో 19 జాతీయ అవార్డులు.. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ అద్భుతాలు..

Pawan Kalyan Pithapuram Students Free Education
Pawan Kalyan Pithapuram Students Free Education

Pawan Kalyan Panchayat Raj awards: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పాలన పరంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖ లో అద్భుతాలు జరుగుతున్నాయి. 2024 వ సంవత్సరం లో దేశం లోనే 24 వ స్థానంలో ఉన్నటువంటి పంచాయితీ రాజ్ శాఖ, పవన్ కళ్యాణ్ చేపట్టిన అద్భుతమైన సంస్కరణల కారణంగా మొదటి స్థానానికి చేరుకొని సంచలనం సృష్టించింది. గడిచిన 23 నెలల్లో ఈ శాఖకు 19 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఇది సాధారణమైన విషయం కాదు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు. నిజాయితీ తో పని చేసే నాయకుడు సాధించే ఫలితాలు ఎంతటి అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు. ప్రతీ నెల ఈ శాఖకు ఎదో ఒక అవార్డు వస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు వచినటువంటి ఆ 19 అవార్డులు ఏంటో ఒకసారి చూద్దాం పదండి:

సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజగవర్గాన్ని దేశం లోనే టాప్ 3 పంచాయితీగా గుర్తించారు. అందుకు గుర్తుగా నానాజీ దేశముఖ్ పురస్కార్ అనే అవార్డుని అందించారు. అదే విధంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన శృంగవరం అనే పంచాయితీ కి దేశం లోనే మొదటి స్థానం దక్కింది. ‘పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్’ జాబితాలో ఈ అవార్డు ని కేటాయించారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలోని కందులపల్లి గ్రామా పంచాయితీ కి ‘క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయత్’ క్యాటగిరీ లో మొదటి స్థానం దక్కింది. చిత్తూరు జిల్లాలో ఇలాంటి పంచాయితీలు ఎన్నో అభివృద్ధి చెందడం వల్ల ‘పంచాయత్ క్షమత నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్’ అనే మరో జాతీయ అవార్డు దక్కింది. ఇకపోతే కేవలం ఈ ఒక్క నెలలోనే మరో మూడు జాతీయ పురస్కారాలు దక్కాయి.

ఆత్మా నిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డు క్యాటగిరీ లో చిత్తూరు జిల్లాకు చెందిన కానీపాకం కి 2 వ స్థానం లో నేషనల్ అవార్డు దక్కింది. కానీపాకం లో ఈ స్థాయి అభివృద్ధి గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఇలా వివిధ శాఖల్లో పంచాయత్ రాజ్ కి జాతీయ అవార్డుల వెల్లువ కురుస్తూనే ఉంది. దేశం లోనే ప్రస్తుతం ప్రతీ ఒక్కరు పంచాయత్ రాజ్ శాఖ ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని అభివృద్ధి చేసే పరిస్థితి కి ఈ శాఖ ని తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ శాఖలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ పంచాయత్ రాజ్ శాఖని వృద్ధి చేస్తున్న విధానం పై ప్రశంసల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలియజేసారు.

వైసీపీలో మహిళా నేతలకు కలిసి రావట్లే

YSRCP DSC 2025 Allegations
YSRCP DSC 2025 Allegations

YSRCP Women Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు మామూలుగా ఉండవు. ఆయన అవసరం మేరకు మాత్రమే రాజకీయం చేస్తారు. అవసరం ఉంటేనే ప్రోత్సహిస్తారు. లేకుంటే మాత్రం ఇట్టే పక్కన పడేస్తారు. తాజాగా బుల్లితెర నటి, యాంకర్ శ్యామల విషయంలో కూడా అదే జరుగుతోంది. గత పది నెలలుగా ఆమె పార్టీ కార్యాలయం వైపు కనిపించడం లేదు. కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెట్టడం లేదు. ఆమెను దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టేసినట్లేనని ప్రచారం నడుస్తోంది. ఒక వర్గం ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వైసిపిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె తనంతట తాను ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగన్ పట్ల విధేయతను ప్రదర్శించారు. అప్పటినుంచి ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మహిళా నేతలు పెద్దగా కలిసి వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కువ రోజులు ఆ పార్టీలో పని చేయలేరు కూడా.

* కొండా సురేఖకు డ్యామేజ్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు తెలంగాణకు చెందిన కొండా సురేఖ దంపతులు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ధైర్యంగా ఆయన వెంట అడుగులు వేసింది మాత్రం కొండా సురేఖ. రాజశేఖర్ రెడ్డి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సైతం మాట తప్పడు, మడమతిప్పడు అని భావించి చేరారు. కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు కోసం కేసీఆర్ తో ఒప్పందం చేసుకున్న తీరును తట్టుకోలేకపోయారు కొండా సురేఖ. జగన్ వెంట నడిచి ఆమె చాలా రాజకీయంగా నష్టపోయారు. మళ్లీ 2023 లో రేవంత్ రూపంలో ఆమె పొలిటికల్ కెరీర్ ప్రారంభం అయింది. ఇప్పటికీ ఆమె జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ద్వేషంతో ఉంటారు. రాజకీయంగా వాడుకుని వదిలేసే తత్వం అని విమర్శిస్తుంటారు.

* వాసిరెడ్డి పద్మ ఆవేదన..
వాసిరెడ్డి పద్మ పరిస్థితి కూడా అదే. ప్రజారాజ్యం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పద్మ. ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండేవారు. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. మంచి పొలిటికల్ కెరీర్ ఇస్తారని భావించారు. కచ్చితంగా చట్టసభలకు పంపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వాసిరెడ్డి పద్మ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాయిస్ బలంగా వినిపించేవారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. ఆ పదవి ద్వారా వాసిరెడ్డి పద్మతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నం చేశారు. అయితే చట్టసభలకు పంపుతాను అన్న జగన్మోహన్ రెడ్డి హామీని బలంగా నమ్మారు పద్మ. అందుకే అప్పట్లో దూకుడుగా ఉండేవారు రాజకీయ ప్రత్యర్థులపై. కానీ 2024 ఎన్నికల్లో టికెట్ అడిగితే కనీసం పట్టించుకోలేదు కదా.. చాలా తక్కువ చేసి మాట్లాడారట. అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసారు వాసిరెడ్డి పద్మ.

* శ్యామలకు పొమ్మన లేక పొగ..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు మాజీ మంత్రి రోజా. అయితే ఆమెకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అవమానాలు తట్టుకొని ఉండి పోవాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ఆమెను సొంత పార్టీ వారే ఓడించారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదిపారు. అయినా సరే ఏం చేయలేని నిస్సహాయత ఆమెది. ఈసారి కూడా నగిరి టిక్కెట్ ఆమెకు ఇచ్చే అవకాశం లేదని ప్రచారం నడుస్తోంది. ఆ కారణంతోనే ఆమె ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసి జగన్ కళ్ళల్లో ఆనందం చూస్తున్నారన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి బుల్లితెర అవకాశాలు పోగొట్టుకున్నారు. దీంతో ఆమెకు అధికార ప్రతినిధి అనే ట్యాగ్ ఇచ్చి అవకాశం కల్పించారు. ఆమెను ఇప్పుడు పొమ్మన లేక పొగ పెడుతున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ఉన్న వాదన. ఆమె సైతం సెల్ఫీ వీడియో విడుదల చేసి దానికి బలం చేకూర్చారు. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కనట్లే..

కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. ఏపీ నుంచి ఛాన్స్ వారికే..

Central Cabinet Expansion
Central Cabinet Expansion

Central Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం.. ప్రభుత్వాలు కొలువు తీరడం జరిగిపోయింది. ఇక 2029 సార్వత్రిక ఎన్నికలపై బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఫోకస్ పెట్టింది. బిజెపితోపాటు ఎన్డీఏ ను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. అందుకే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈసారి యువతకు ప్రాధాన్యం ఇచ్చి 2029 ఎన్నికలపై గురిపెట్టనున్నారు. ఎన్డీఏ లోని మిత్రులకు ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ప్రధానంగా ఈసారి జనసేనకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరు నివేదిక ప్రధాని నరేంద్ర మోడీ కి చేరింది. దానికి అనుగుణంగా కొత్తవారికి ఛాన్స్ ఇస్తారు ప్రధాని నరేంద్ర మోడీ.

* ప్రధాని విదేశీ పర్యటన..
ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి ఈనెల 20న చేరుకోనున్నారు. వచ్చిన వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు ఛాన్స్ ఇవ్వచ్చు అనే సమాచారం ఉంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఏపీ నుంచి ఈసారి జనసేనకు ఒక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. అప్పట్లోనే జనసేనకు ఒక మంత్రి పదవి ఇస్తామంటే పవన్ కళ్యాణ్ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే ఈసారి మాత్రం మంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు ఏపీ నుంచి ఒక మంత్రి పదవి ఖాయమని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.

* ఆశావహులు అధికం..
తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. అయితే ఈసారి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు ఖాయమని తెలుస్తోంది. టిడిపికి కానీ మరో మంత్రి పదవి ఇస్తే.. హిందూపురం ఎంపీకి కానీ.. చిత్తూరు ఎంపీ కి కానీ ఛాన్స్ ఇస్తారని సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు బిజెపి ఎంపీ కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి అవకాశం దొరికే పరిస్థితి కనిపిస్తోంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సైతం ఆశావహుడుగా ఉన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ పై ఒక క్లారిటీ వస్తుంది. చూడాలి అవకాశం ఎవరికి దక్కుతుందో..

తల్లికి వందనం.. ముహూర్తం ఫిక్స్!

Thalliki Vandanam Scheme
Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ప్రస్తుతం విద్యార్థుల వివరాలతో కూడిన సమాచారం సచివాలయాలకు చేరుతుంది. వారు పరిశీలన చేసి ఓకే చేశాక తల్లుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు తల్లికి వందనం నిధులు కూడా జమ చేసేందుకు సన్నాహాలు చేయడం శుభపరిణామం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

* అప్పట్లో అమ్మ ఒడి పేరుతో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అమ్మ ఒడి పేరిట ఈ పథకం అమలు చేసేవారు. కూటమి ప్రభుత్వం దానిని తల్లికి వందనం పథకం గా మార్చింది. గత విద్యా సంవత్సరంలో 78 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేసింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి నగదు సాయం చేసింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అలా కాదు. ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే అప్పట్లో వర్తించేది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ఏడాది ఒక్కో ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉన్న అందించి అనుకున్నది అమలు చేశారు చంద్రబాబు. ఈ ఏడాది కూడా అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మూడు వారాల ముందే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభం అయింది. సచివాలయాల వారీగా జాబితాలు చేరాయి. సచివాలయ ఉద్యోగులు పరిశీలనలు చేస్తున్నారు.

* జూన్ 12న విడుదల..
వేసవి సెలవుల అనంతరం జూన్ 12న విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఆ సమయానికి జాబితాల పరిశీలనతో పాటు అర్హుల జాబితాను సచివాలయాల వారీగా ప్రదర్శించనున్నారు. అర్హులకు మాత్రమే అందిస్తారు. తల్లిదండ్రులకు సంబంధించి మాగాణి మూడు ఎకరాలు లోపు, మెట్టు పది ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ఆదాయపు పన్ను చెల్లించకూడదు. విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపు ఉండాలి ప్రతి నెల. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అర్హులు కాదు. ఒకవేళ అన్ని అర్హతలు ఉండి తల్లికి వందనం రాకుంటే.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రక్రియ ప్రారంభమైన దృష్ట్యా జూన్ 12న కానీ.. జూన్ 19న కానీ తల్లికి వందనం నిధులు జమ చేసే అవకాశం ఉంది.