Home Blog Page 124

'కుకూ విత్ జాతి రత్నాలు 2' టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. ఇది చాలా అన్యాయం..

Kooku With Jathi Ratnalu 2 Winner
Kooku With Jathi Ratnalu 2 Winner

Kooku With Jathi Ratnalu 2 Winner: స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ షో , ఎంతటి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు వెళ్తుందో అందరికీ తెలిసిందే. ఈ షో లో అన్నీ న్యాయబద్దంగా జరుగుతుండడం తో ఆడియన్స్ లో ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని అందరూ అంటున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో ఈ షోలో కూడా అన్యాయం జరిగింది. సాధారణంగా ప్రతీ రెండు వారాలకు ఒకసారి ‘కుక్ ఆఫ్’ ని నిర్వహించి , ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తుంటారు. కానీ గత నాలుగు వారాలుగా ఎలాంటి ఎలిమినేషన్ ప్రక్రియ జరగలేదు. దీంతో నిన్న గత రెండు వారాలకు కలిపి , తక్కువ స్కోర్ ఉన్న చివరి ఇద్దరు కంటెస్టెంట్స్ ‘కుక్ ఆఫ్’ ప్రక్రియ లో పాల్గొనకుండానే ఎలిమినేట్ అవుతారని షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు నిర్వాహకులు.

దీంతో గత రెండు వారాలుగా తక్కువ తక్కువ స్కోర్ ని నమోదు చేసుకుంటూ వచ్చిన తేజస్విని గౌడ , పల్లవి రామస్వామి ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యినట్టు నిన్నటి ఎపిసోడ్ లో యాంకర్ ప్రదీప్ చెప్పుకొచ్చాడు. నాలుగు వారాలుగా ఎలిమినేషన్ ప్రక్రియ లేనప్పుడు , నాలుగు వారాలకు సంబంధించిన స్కోర్స్ ని కలిపి , తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం న్యాయం కదా, ఇలా గత రెండు వారాల్లో వచ్చిన స్కోర్స్ ఆధారంగా ఎలిమినేట్ చేయడం ఎంత వరకు న్యాయం అనేది ప్రేక్షకుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. ఒకవేళ నాలుగు వారాలకు సంబంధించిన స్కోర్స్ ని కలిపి ఉండుంటే , ఈరోజు తేజస్విని గౌడ ఎలిమినేట్ అయ్యేది కాదని , కచ్చితంగా ఆమెకు అన్యాయం జరిగిందని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే ఈ సీజన్ కి సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా డిమోన్ పవన్ నిలిచాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొదటి ఎపిసోడ్ నుండి , మొన్నటి వీకెండ్ ఎపిసోడ్ వరకు డిమోన్ పవన్ జడ్జీల నుండి మంచి మార్కులు అందుకుంటూ వస్తున్నాడు. ఇతను ఉంటే టాప్ 1 లో ఉంటాడు , లేదంటే టాప్ 3 లో ఉంటాడు. ఈ రెండు కాకుండా చివరి స్థానం లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ లో కూడా లేడు . ఈ రేంజ్ డామినేషన్ చూపిస్తూ వచ్చిన డిమోన్ పవన్ టైటిల్ విన్ అయ్యాడు అనే వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవ్వడంతో , ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

చిక్కుల్లో పడ్డ 'వారణాసి'.. హద్దులు దాటిన బడ్జెట్.. ధైర్యం చెయ్యని ఓటీటీ సంస్థలు..

Varanasi Movie Budget
Varanasi Movie Budget

Varanasi Movie Budget: ప్రస్తుతం ఇండియా లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో , అభిమానులతో పాతాయ్ , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వారణాసి’. రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి. అయితే లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట ఏమిటంటే , ఈ సినిమా బడ్జెట్ రాజమౌళి అంచనాలను సైతం దాటేసింది అని. అంతే కాదు పెట్టిన ఈ పెట్టుబడిని రాబట్టే క్రమంలో రాజమౌళి కి సవాలుగా మారిందని , ఇప్పుడు ఆయన ఈ విషయం లో తీవ్రమైన ఒత్తిడి కి గురి అవుతున్నాడని అంటున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం 1200 నుండి 1400 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి.

రాజమౌళి ఇంత మొత్తం లో బడ్జెట్ ని ఖర్చు చేయించడానికి కారణం , డిజిటల్ రైట్స్ తోనే పెట్టిన పెట్టుబడిని రీకవర్ చేయొచ్చనే ఉద్దేశ్యంతో. కేవలం ఓటీటీ రైట్స్ 500 నుండి 600 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతుంది అంచనా వేసాడు రాజమౌళి. అయితే అప్పటి ఓటీటీ మార్కెట్ కి ప్రస్తుత ఓటీటీ మార్కెట్ కి చాలా తేడా ఉంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, కంటెంట్ కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలకు కూడా ఓటీటీ సంస్థలు కేవలం 150 నుండి 200 కోట్ల మధ్యలోనే ఇస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం 550 కోట్ల రూపాయలకు పైగానే ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ ని డిమాండ్ చేస్తున్నాడు, కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ అంత ఇచ్చేందుకు రెడీ గా లేదు.

దీంతో మిగిలిన షూటింగ్ కి ఖర్చులు తగ్గించే విషయం లో నిర్మాతలు చాలా గట్టి చర్యలు తీసుకుంటున్నారు అట. రాజమౌళి , మహేష్ బాబు వంటి వారు రెమ్యూనరేషన్స్ తీసుకోలేదు. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో వాటాలు పంచుకుంటారట. ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లోపు షూటింగ్ ని పూర్తి చేసి , ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని చెప్పిన డేట్ లో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా , విలన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు.

క్రేజీ ప్రాజెక్ట్ నుండి జూనియర్ ఎన్టీఆర్ 'OUT'.. సూర్య 'IN'..ఈ ట్విస్ట్ ఊహించలేదు బాబోయ్..

NTR Surya Movie Twist
NTR Surya Movie Twist

NTR Surya Movie Twist: ఎన్టీఆర్ అభిమానులకు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త తీవ్రమైన విచారానికి గురి చేస్తోంది. ఎన్టీఆర్ భవిష్యత్తు లైనప్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తోటి హీరోలు వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ వెళ్తుంటే , ఎన్టీఆర్ మాత్రం ఆ రేంజ్ జోరు చూపించడం లేదని అంటున్నారు. చేతిలో ‘డ్రాగన్’ చిత్రం తప్ప మరో క్రేజీ ప్రాజెక్ట్ లేదు. త్రివిక్రమ్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ ఉంటుందని అంటున్నారు కానీ , అది అల్లు అర్జున్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోనీ ఆ సినిమా మిస్ అయ్యినా , ఎన్టీఆర్ ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు కదా, అది చాలని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా ఎన్టీఆర్ నుండి జారిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తమిళ హీరో సూర్య చేతుల్లోకి వెళ్లిందట. రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ సూర్య ని కలిసి ఒక స్టోరీ ని వినిపించాడని , అది సూర్య కి తెగ నచ్చేయడం తో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇది గతం లో నెల్సన్ ఎన్టీఆర్ కి వినిపించిన స్టోరీ నే అట. మరి ఇది ఎన్టీఆర్ నుండి సూర్య చేతుల్లోకి ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సూర్య రీసెంట్ గానే ‘కరుప్పు’ మూవీ తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా సౌత్ మార్కెట్స్ లో రాబట్టిన వసూళ్లను చూస్తుంటే , ఆయన మార్కెట్ ఇసుమంత కూడా చెక్కు చెదరలేదు , సరైన సినిమా పడితే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు అవుతాయని బలంగా నమ్ముతున్నారు ట్రేడ్ విశ్లేషకులు , నిర్మాతలు.

అందుకే ఎన్టీఆర్ తో చేయడం కంటే , సూర్య తో చేస్తే అటు తమిళం లోనూ , ఇటు తెలుగు, కేరళ , కర్ణాటక మార్కెట్స్ లోనూ వసూళ్ల సునామీ ని సృష్టించవచ్చు అని , నెల్సన్ సూర్య కి షిఫ్ట్ అయ్యినట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్ 2’ షూటింగ్ ని పూర్తి చేసాడు. త్వరలోనే రజినీకాంత్ , కమల్ హాసన్ మల్టీ స్టార్రర్ మూవీ ని తెరకెక్కించబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతే సూర్య సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా , నెల్సన్ – సూర్య కాంబినేషన్ లో సినిమా అనే వార్త సూర్య ఫ్యాన్స్ ని సంబరాలు చేసుకునేలా చేస్తే , ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నిరాశలోకి నెట్టేలా చేసింది.

ఆత్మహత్య చేసుకున్న 'చావా' నటి సంచిత.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Sanchita Ugale
Sanchita Ugale

Sanchita Ugale: ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి సంచిత ఉగాలే ఆత్మహత్య చేసుకున్న సంఘటన , యావత్తు సినీ ఇండస్ట్రీ ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ముంబై లోని ఆచోలే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఇంట్లో లేని సమయంలో , 22 ఏళ్ళ వయస్సు గల సంచిత ఫ్యాన్ కి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకొని , ఆత్మహత్య కు గల కారణాలను అన్వేషిస్తున్నారు. పిలుచుల విచారణ లో ప్రస్తుతానికి తేలింది ఏంటంటే సంచిత సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యలో ఆత్మహత్య చేసుకొని ఉండుంటుందని అంచనా వేస్తున్నారు. ఈమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు.

ఎందుకంటే ఘటన జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లేవు. చనిపోయే ముందు సంచిత ఏదైనా ఉత్తరం రాసి ఉంటుందేమో అని పోలీసులు ఆమె రూమ్ మొత్తాన్ని గాలించారు. కానీ అలాంటిదేమి దొరకలేదు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్న పోలీసులు , కుటుంబ సభ్యుల నుండి కూడా కీలక సమాచారం తీసుకున్నారు. అంతే కాకుండా సంచిత సహా నటులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోస్ట్ మార్టం కి మృతదేహాన్ని పంపగా, నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని పోలీసులు ఈ సందర్భంగా మీడియా కి తెలిపారు.

ఇక సంచిత సినీ ప్రస్థానం విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిల్చిన కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా , అక్కడి ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఈ సీరియల్ ద్వారానే ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనేక సీరియల్స్ , టీవీ షోస్ లతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె, గత ఏడాది విడుదలైన బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘చావా’ లో కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె తారాబాయి పాత్రలో కనిపించగా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. అవకాశాలు కూడా ఈమధ్య బాగానే వస్తున్నాయి, కానీ ఏమైందో ఏమో తెలియదు , ఇంత చిన్న వయస్సులో ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఆమెకి ఏమొచ్చిందో అని అభిమానులు బాధపడుతున్నారు. కచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ వల్లే సంచిత ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండుంటుందని అనుకుంటున్నారు నెటిజెన్స్

అమెరికా ఇరాన్ ఒప్పందంతో పాకిస్తాన్ ప్రతిష్ట పెరుగుతుందా?

Pakistan diplomacy

Pakistan diplomacy : అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసింది. ఇప్పుడు అందరి నోట ఏం జరుగబోతోంది.. ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది.. ఈ ఒప్పందం కుదరటంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని ప్రచారం చేసుకుంటోంది. మేం పెద్ద శాంతి దూతమని ప్రచారం చేసుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్ అట శాంతి దూతనట..

పాకిస్తాన్ ఆంతరంగిక సమస్యలే ఇప్పుడు బయటకు ఆదేశం పరిస్థితిని కళ్లకు కడుతోంది. పీఓకే లో అల్లర్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే 70 ఏళ్లు ఈ ఆక్రమిత కశ్మీర్ లోని కశ్మీరీలు పాకిస్తాన్ ను నమ్మారు. వారిని ఆజాద్ కశ్మీర్ పేరుతో వారికి ప్రధాని, అసెంబ్లీ , జ్యూడీషియరీ ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ పై అక్కడి ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. కానీ మెల్ల మెల్లగా వారికి జ్ఞానోదయమైంది. పాకిస్తాన్ పీఓకేను వాడుకుంటున్నారని.. పాకిస్తాన్ లోని కశ్మీరీలు గ్రహించారు.

పీఓకేలోని జాక్ అని ఏర్పాటు చేసుకొని తీవ్ర ఆందోళన చేశారు. విద్యుత్ ఉత్పత్తి అయ్యే చోట మాకు విద్యుత్ ధరలు తగ్గించాలని.. గోధుమ, నిత్యావసరాల ధరలు తగ్గించాలని.. మా మీద మీ పెత్తనం ఏంటని.. 12 స్థానాలను పాకిస్తాన్ నామినేట్ చేసి మమ్మల్ని ఆడిస్తున్నారని వాళ్లు ఆందోళన చేశారు.

అమెరికా ఇరాన్ ఒప్పందంతో పాకిస్తాన్ ప్రతిష్ట పెరుగుతుందా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఓణీల ఫంక్షన్ కు అక్షరాల 6 కోట్లు.. ప్లేట్ భోజనంలో 200 వెరైటీలు

Six Crore Event Andhra Pradesh
Six Crore Event Andhra Pradesh

Six Crore Event Andhra Pradesh: అది మామూలు తిండి కాదు.. ఒక్కో ప్లేట్లో 200 వెరైటీలు.. టిఫిన్ల నుంచి మొదలుపెడితే స్వీట్ల వరకు.. ఫ్రూట్స్ నుంచి డిసర్ట్స్ వరకు… ఇలా ప్రతి ఒక్కటి అద్భుతమే. వెల్కమ్ డ్రింక్ అవకాడో ఇచ్చారు. టిఫిన్లలో తట్ట ఇడ్లీ నుంచి ఉప్మా పెసరట్టు వరకు.. నాన్ వెజ్ లో చికెన్ నుంచి మటన్ వరకు.. ఇలా తిన్న వాళ్లకు తిన్నంత.. అన్నట్టుగా ఆ ఫంక్షన్ సాగిపోయింది.

ఇంతలా సాగిపోయిన అ ఫంక్షన్ పెళ్ళికాదు.. పేరంటం అంతకంటే కాదు.. ఇది జరిగింది ఇక్కడ విదేశాలలో కాదు.. మన ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో.. ఇంత ఆడంబరంగా జరిగిన ఈ ఫంక్షన్ ఓణీల వేడుక.. దీనికోసం పెట్టిన ఖర్చు అక్షరాల ఆరు కోట్లు. మెయిన్ కోర్స్ కోసమే ఒక బుక్ లెట్ ప్రింట్ చేశారంటే.. ఆ వేడుకను ఏ స్థాయిలో చేశారో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆడి పాడేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. వెండి కంచాలలో భోజనాలు వడ్డించారు.. వెల్కమ్ థీమ్ కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. పూల డెకరేషన్ అయితే.. ఒక రేంజ్ లో ఉంది.

కేవలం మెయిన్ కోర్స్ మాత్రమే కాదు.. టిఫిన్స్.. స్నాక్స్ కూడా ఒక రేంజ్ లో పెట్టారు. ఐస్క్రీమ్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు. పీచు మిఠాయి.. అవకాడో జ్యూస్ ఇక్కడ ప్రత్యేకంగా నిలిచాయి. మినప వడలు.. సున్ని ఉండలు.. కారపు పొడులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వెరైటీలను అందించారు. 200 వెరైటీలతో ఫుడ్ సర్వ్ చేశారంటే మామూలు విషయం కాదు..

ఇంతటి స్థాయిలో చేసినందుకు దాదాపు 6 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.. ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. కొందరేమో డబ్బు బాగా ఎక్కువ కావడంతో బలిసి కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరేమో తమ తాహతు తగ్గట్టుగా ఖర్చుపెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ఖర్చులు తగ్గించుకోవాలని.. బంగారాన్ని తక్కువ కొనుగోలు చేయాలని.. ఇతర ఆడంబరాలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు. కొందరేమో ఆ మాటలను పట్టించుకుంటుంటే.. మరికొందరేమో ఏమాత్రం లెక్కపెట్టడం లేదు.. ఇలా 6 కోట్లు పెట్టి ఓణీల ఫంక్షన్ చేశారంటే మామూలు విషయం కాదు. డబ్బున్న వాళ్లకు ఈ ఆరు కోట్లు ఒక లెక్కా.

TV9 వ్యవహారంలో రవి ప్రకాష్ తప్పు లేదా.. చివరికి ఆయన కూడా బాధితుడేనట

Ravi Prakash TV9 Issue
Ravi Prakash TV9 Issue

Ravi Prakash TV9 Issue: ఇప్పటికీ అది ఒక చిదంబర రహస్యం. ఏం జరిగిందో తెలియదు. రవి ప్రకాష్ కోట్లు మోసం చేశాడు అంటారు. కంపెనీ ప్రమోటర్లను ముంచాడు అంటారు. ఆయన వల్ల టీవీ9 యాజమాన్యం నిండా మునిగింది అంటారు. దీనికి సంబంధించిన కేసు కూడా కోర్టులో ఉంది. ఆ మధ్య కోర్టు విచారణకు రవిప్రకాష్ హాజరయ్యారు కూడా. ఇన్నాళ్లకు టీవీ9 ఏర్పాటు.. రవి ప్రకాష్ మోసాలు చేశాడా లేదా తనే బాధితుడిగా మారిపోయాడా.. మధ్యలో శ్రీని రాజు ఎందుకు వెళ్లిపోయారు.. అనేక విషయాలపై క్లారిటీ వచ్చింది.

శ్రీని రాజు, రవి ప్రకాష్ 2004లో టీవీ9 సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ 24 గంటల పాటు వార్తలను ప్రసారం చేస్తూ సరికొత్త ఒరవడి సృష్టించింది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. టీవీ9 ఛానల్ 2004లో ఏర్పాటు అయింది.. దాదాపు 2019 వరకు రవి ప్రకాష్ అందులో ఉన్నారు. ఆ తర్వాత ఆ సంస్థ చేతులు మారింది. ఇప్పుడు మై హోమ్, మెఘా సంస్థలు ఈ చానెల్ ను నిర్వహిస్తున్నాయి. టీవీ9 సంస్థను శ్రీని రాజు అమ్మేశారు. నాడు ఆయన అమ్ముతున్నప్పుడు కొనుగోలుదారులను కూడా రవి ప్రకాష్ తీసుకొచ్చారు.

తనకు వస్తున్న ఒత్తిడులను తట్టుకోలేక శ్రీని రాజు టీవీ9 సంస్థను అమ్మేశారు. ఆ రోజుల్లోనే భారీ అమౌంట్ కు(దాదాపు 200 కోట్లు అంటున్నారు) అమ్మేశారు. వచ్చిన ప్రమోటర్లకు.. రవి ప్రకాష్ కు విభేదాలు వచ్చాయి. ఫలితంగా రవి ప్రకాష్ బయటకి వెళ్లిపోయారు. రవి ప్రకాష్ ఆర్థికంగా అక్రమాలకు పాల్పడడం వల్లే ఇదంతా జరిగిందని నిన్నటి వరకు ప్రచారంలో ఉండేది. పైగా ఆయనను టీవీ 9 సంస్థ నుంచి అవమానకరంగా బయటకి పంపేశారు. ఈ క్రమంలో శ్రీని రాజు ఇన్నాళ్లకు నోరు విప్పారు. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన టీవీ9 నుంచి రవి ప్రకాష్ ఎందుకు వెళ్లిపోయాడు.. ఏం జరిగింది అనే విషయాలను స్పష్టం చేశారు.

శ్రీని రాజు ఈ విషయాలను బయటపెట్టి నేపథ్యంలో రవి ప్రకాష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు..”మీరు ఇన్నాళ్లకు అసలు వాస్తవాలు చెప్పారు. టీవీ9 సంస్థ ఏర్పాటు.. దానిని ఈ స్థాయి దాక తెచ్చిన తీరు గొప్పగా ఉంది. మన ప్రయాణం ముగిసిపోలేదు. వచ్చే రోజుల్లో కూడా సాగుతూ ఉంటుంది. మీరు చెప్పిన విషయాలు అప్పటి రోజులను మదిలో మెదిలేలా చేస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు.. నిజాలు నిలిచి ఉంటాయని” రవి ప్రకాష్ వ్యాఖ్యానించారు. మరోవైపు కొత్త యాజమాన్యం రవి ప్రకాష్ ను మోసం చేసిందని.. అందువల్లే ఆయన బయటికి వెళ్లిపోయారని తెలుస్తోంది. రవి ప్రకాష్ టీవీ నైన్ నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత మోజో అనే పేరుతో టీవీ ఛానల్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దానిని మూసివేశారు. ఇప్పుడు ఆర్ టీవీ పేరుతో ఛానల్ ఏర్పాటు చేశారు.

'పెద్ది' 11 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఆ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అసాధ్యమే ఇక..

Peddi Movie 11 Days Collections
Peddi Movie 11 Days Collections

Peddi Movie 11 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 11 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. 10 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పెంచిన టిక్కెట్ రేట్స్ మీద నడిచిన ఈ చిత్రం , 11 వ రోజున మామూలు రేంజ్ టిక్కెట్ రేట్స్ తో మొదలైంది. టిక్కెట్ రేట్స్ తగ్గడం వల్ల, ఈ చిత్రానికి నిన్న అన్ని ప్రాంతాల్లోనూ హౌస్ ఫుల్ బోర్డ్స్ నమోదు అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కిక్కిరిపోయాయి. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 11 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 7 కోట్ల 65 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఓవరాల్ గా 11 వ రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ప్రాంతాల వారీగా 11 రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 51 కోట్ల 21 లక్షలు , సీడెడ్ ప్రాంతం నుండి 19 కోట్ల 77 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 26 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 12 కోట్ల 7 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన సంచలనం సృష్టించింది. నైజాం ప్రాంతం లో అయితే 11 వ రోజున కూడా 1 కోటి 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే వెస్ట్ గోదావరి నుండి ఈ చిత్రం 11 రోజుల్లో 8 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ ప్రాంతం నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 6 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 9 కోట్ల 65 లక్షలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ కి కంచుకోట గా పిలిచే నెల్లూరు నుండి 5 కోట్ల 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 210 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు , సీడెడ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. కర్ణాటక ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 14 కోట్ల 35 లక్షల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 17 కోట్లు రావాలి. అదే విధంగా తమిళనాడు + కేరళ నుండి 2 కోట్లు , రెస్ట్ అఫ్ ఇండియా + హిందీ కలిపి 11 కోట్ల 10 లక్షలు , ఓవర్సీస్ నుండి 22 కోట్ల 15 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 11 రోజుల్లో 189 కోట్ల 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు 317 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 30 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది.

ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ : ఏం మ్యాచ్ మామ.. డ్రా అయిపోయింది.. నరాలు కట్ అయ్యాయి అంతే..

India A Vs Sri Lanka A
India A Vs Sri Lanka A

India A Vs Sri Lanka A: మామూలు ఉత్కంఠ కాదు.. బంతి బంతికి సమీకరణం మారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు క్రికెట్ మజా లభించింది. రెండు జట్ల ఆటగాళ్లు విజయం కోసం చివరి వరకు పోరాడారు. తమ శాయశక్తులా కృషి చేశారు.

శ్రీలంక వేదికగా ఆఫ్ఘనిస్తాన్, భారత్, శ్రీలంక జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఏ, శ్రీలంక ఏ జట్లు తలపడుతున్నాయి. దంబుల్లా వేదికగా సోమవారం ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్, శ్రీలంక సమానంగా పరుగులు చేశాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసింది. భారత జట్టులో సూర్యాంష్ (72), విప్రజ్ నిగం (51), రుతురాజు (37), తిలక్ వర్మ (23), వైభవ్ సూర్య వంశీ (21) పరుగులు చేశారు. శ్రీలంక జట్టులో మహమ్మద్ షిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. విజయ్ కాంత్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

అనంతరం శ్రీలంక జట్టు చేజింగ్ మొదలుపెట్టింది.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో సాధీర 93 పరుగులు చేశాడు. ఓపెనర్ నిరోషన్ 37 పరుగులు చేశాడు. రెండు జట్ల పరుగులు సమానం కావడంతో సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేసింది.

తొలి బంతికి రెండు పరుగులు, రెండవ బంతికి ఒక పరుగు, మూడవ బంతికి ఒక పరుగు, నాలుగో బంతికి మూడు పరుగులు, ఐదో బంతికి సిక్సర్, ఆరో బంతి నోబాల్.. మరో బంతికి బై రూపంలో ఒక పరుగు వచ్చింది. మొత్తంగా 17 పరుగులు శ్రీలంక జట్టు చేసింది.

ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ మొదలు పెట్టింది. తొలి బంతికి రెండు పరుగులు.. రెండవ బంతికి పరుగు రాలేదు.. మూడోవంతుకి ఒక పరుగు.. నాలుగు బంతికి రెండు పరుగులు.. ఐదో బంతికి ఫోర్.. ఆరో బంతికి ఒక పరుగు కూడా రాలేదు. టీ మీడియా కేవలం సూపర్ ఓవర్లో 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో శ్రీలంక జట్టు గెలుపును అందుకుంది. ఈ మ్యాచ్ సాగిన విధానం అభిమానులకు సరికొత్త క్రికెట్ ఆనందాన్ని అందించింది.

ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో శ్రీలంక మీద ఇండియా విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. శ్రీలంక చేతిలో సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. ఈ సిరీస్ లో టీమిండియా మూడు మ్యాచ్ లు ఆడింది. ఒక విజయం నమోదు చేసింది. రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. రెండు పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక మూడు మ్యాచ్ లలో.. రెండు విజయాలు నమోదు చేసింది. నాలుగు పాయింట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

కాక్రోచ్ చీఫ్ ను బొద్దింకను కొట్టినట్టు కొట్టారు.. వైరల్ వీడియో

Cockroach Janata Party Protest
Cockroach Janata Party Protest

Cockroach Janata Party Protest: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి కి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఆ తర్వాత హైదరాబాదులో ఆదివారం నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు.

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిస్తుండగా.. వామపక్ష.. చీపురు పార్టీ సానుభూతిపరులు మాత్రమే హాజరవుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ నిరసనలకు హాజరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే జమ్ము కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని.. డిమాండ్ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ జెన్ జెడ్ ఉద్యమం అన్నట్టుగా చెబుతున్నప్పటికీ.. అక్కడి కేవలం ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే హాజరవుతున్నారు.

కేంద్రంపై చేస్తున్న విమర్శలలో కాక్రోచ్ జనతా పార్టీ అతి శృతిమించుతోంది. కొంతమంది ఈ ముసుగులో కేంద్రం మీద ఉన్న ఆగ్రహాన్ని మొత్తం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని.. డిమాండ్ చేస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసనలు సాగాల్సి ఉండగా.. అవి వేరే మార్గం సంతరించుకుంటున్నాయి. రాజకీయ నిరుద్యోగులు ఈ నిరసనలు పాల్గొని వారి పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్.. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి వంటి వారు ప్రసంగించారు.. వీరు మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.

కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ నగరంలో నిరసన చేస్తుండగా.. కొంతమంది అక్కడికి వచ్చారు. పాత చెప్పులతో అతని మీద దాడి చేశారు. మన ఇంట్లో దాగి ఉన్న బొద్దింకలను ఎలా అయితే కొడతామో.. అలానే కొట్టారు. పైగా చీడ పురుగు నువ్వు.. ఈ దేశానికి ఎందుకు వచ్చావురా.. అమెరికాలో ఉండి.. ఈ దేశానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నావ్ రా అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరిని చెదరగొట్టారు.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

రోజుకు 3 లవంగాలు.. ఈ ఆరోగ్య సమస్యలు మాయం.. కానీ..

Benefits of eating cloves daily
Benefits of eating cloves daily

Benefits of eating cloves daily: మన వంటింట్లో సులభంగా లభించే లవంగం గురించి పెద్దగా పట్టించుకోం. కానీ ఇది కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు. అనేక ఔషధ గుణాలు కలిగిన సహజ ఆరోగ్య పదార్థం. ఇందులో ఉండే యూజెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 2 నుంచి 3 లవంగాలను పరిమిత మోతాదులో తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా…?

లవంగాల్లో సహజసిద్ధమైన యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. వీటిని నమలడం లేదా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, గొంతులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల సమయంలో లవంగం ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి మెరుగుపడి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో లవంగం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి లవంగం ఉపయోగపడుతుంది. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది. భోజనం తర్వాత ఒకటి లేదా రెండు లవంగాలు నమలడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గవచ్చు. లవంగం నోటి దుర్వాసనను తగ్గించడంలో ప్రసిద్ధి చెందింది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికర బ్యాక్టీరియాను నియంత్రిస్తాయి. దంత నొప్పి, చిగుళ్ల వాపు వంటి సమస్యల సమయంలో కూడా లవంగం ఉపశమనాన్ని అందించగలదు.

లవంగాల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి పరిమిత మోతాదులో లవంగం తీసుకోవడం కొంత మేర ఉపశమనాన్ని ఇవ్వవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇందులోని సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడే అవకాశం ఉంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

తేనెతో కలిపిన లవంగం లేదా లవంగం కలిపిన గోరువెచ్చని నీరు రాత్రి సమయంలో తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడవచ్చు. దీంతో కొందరిలో నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే నిద్రలేమికి ఇది పూర్తిస్థాయి చికిత్స కాదని గుర్తుంచుకోవాలి.

అయితే లవంగం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో మంట, వికారం లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. రక్తం పలుచబడే మందులు వాడేవారు, గర్భిణులు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తీసుకోవడం ఉత్తమం.

వృద్ధుల మతిమరుపు పై ప్రయోగం.. ఇలా చేస్తే మెదడు యవ్వనం.. పూర్తి వివరాలు ఇవే..

Memory loss in Elderly research
Memory loss in Elderly research

Memory loss in Elderly research: వయసు పైబడుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం, పేర్లు మర్చిపోవడం, ఆలోచనల్లో స్పష్టత లోపించడం వంటివి సహజంగా చూస్తుంటాం. అయితే, ఈ మేధోపరమైన క్షీణతను (Cognitive decline) అడ్డుకోవడమే కాకుండా, మెదడును తిరిగి యవ్వనంగా మార్చే అద్భుతమైన రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన ఈ పరిశోధన, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్యలకు సరికొత్త పరిష్కారాన్ని చూపిస్తోంది. ఈ పరిశోధన వివరాల్లోకి వెళితె..

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు, మెదడు పనితీరు కూడా మెరుగవుతుందని మనకు తెలుసు. అయితే ఇది ఎలా జరుగుతుందనే దానిపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేశారు. వ్యాయామం చేసినప్పుడు మన శరీరం నుండి కొన్ని రకాల రసాయనాలు విడుదలవుతాయి. వీటిని ‘ఎక్సర్‌కైన్స్’ (Exerkines) అంటారు. శారీరక శ్రమ ద్వారా లభించే ఈ రసాయనాలే వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా పనిచేసేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ముఖ్యంగా కాలేయం నుండి విడుదలయ్యే ‘జీపీఎల్‌డీ1’ అనే ఎంజైమ్ లేదా ఎక్సర్‌కైన్ మీదే తమ దృష్టిని కేంద్రీకరించారు. సాధారణంగా వయసు పైబడిన వారిలో దీని ఉత్పత్తి తగ్గుతుంది. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వృద్ధులలో.. అలాగే వ్యాయామం చేసే ఎలుకలలో.. ఈ జీపీఎల్‌డీ1 మోతాదులు గణనీయంగా పెరగడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.

ఈ విషయాన్ని నిరూపించడానికి పరిశోధకులు వృద్ధ ఎలుకలతో కొన్ని రోజుల పాటు వ్యాయామం చేయించారు. అలా వ్యాయామం చేసిన ఎలుకల కాలేయం నుండి జీపీఎల్‌డీ1 ఎక్కువగా విడుదలైంది. ఆ తర్వాత వాటికి జ్ఞాపకశక్తి, విషయ గ్రహణ శక్తిని పరీక్షించే టాస్క్‌లను ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఆ వృద్ధ ఎలుకలు కూడా చిన్న వయసు ఎలుకల మాదిరిగానే ఎంతో చురుగ్గా ఆ పరీక్షల్లో నెగ్గాయి. అంటే కాలేయం నుండి వచ్చిన ఆ ఒక్క ఎంజైమ్ వృద్ధ ఎలుకల మెదడును తిరిగి యవ్వన స్థితికి తీసుకెళ్లిందన్నమాట.

శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన ప్రయోగం కూడా చేశారు. వ్యాయామం చేసిన ఎలుకల నుంచి సేకరించిన రక్తాన్ని అస్సలు వ్యాయామం చేయని వృద్ధ ఎలుకల శరీరంలోకి ఎక్కించారు. కేవలం ఈ రక్త మార్పిడి ద్వారానే, వ్యాయామం చేయని ఎలుకలలో కూడా జ్ఞాపకశక్తి పెరిగింది. వాటి మెదడులోని హిప్పోకాంపస్ లో కొత్త నాడులు పుట్టుకొచ్చాయి. దీన్ని బట్టి జీపీఎల్‌డీ1 నేరుగా మెదడును ప్రభావితం చేస్తోందని స్పష్టమైంది.

వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా వంటి తీవ్రమైన మతిమరుపు వ్యాధులతో బాధపడేవారికి ఈ పరిశోధన ఒక కొత్త ఆశను చిగురింపజేస్తోంది. వృద్ధాప్యం లేదా అనారోగ్యం వల్ల శారీరకంగా వ్యాయామం చేయలేని వారికి ఈ జీపీఎల్‌డీ1 ఎంజైమ్‌ను ఒక టాబ్లెట్ లేదా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేలా భవిష్యత్తులో మందులను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సగం మణికొండ ని కొనేంత డబ్బులు సంపాదించిన స్టార్ కమెడియన్.. వీడియో వైరల్..

Chitram Seenu viral video
Chitram Seenu viral video

Chitram Seenu viral video: ఒకప్పుడు కింగ్ లాగా బ్రతికిన ఎంతో మంది స్టార్ నటులు , నేడు సినిమాల్లో అవకాశాల్లో లేక, ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వచ్చిన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ కమెడియన్ చిత్రం శీను. ఒకప్పుడు ఈయన ఏ రేంజ్ బిజీ కమెడియన్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏడాదికి కనీసం 10 నుండి 15 సినిమాల్లో నటించేవాడు. ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ , ఒకప్పటి ఊపు అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు కేవలం ఆయన ఒకటి లేదా రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితం అవుతున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్ లో ఒకడై , లక్షలకు లక్షలు సంపాదిస్తూ , ముందుకు దూసుకెళ్లిన చిత్రం శ్రీను , నేడు ఇలా ఎందుకు అయ్యాడో , ఆరోజుల్లో డబ్బులను ఎలా వృధా చేసాడో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘నాకు రాజీవ్ కనకాల బాగా పరిచయం. మేమిద్దరం బావ బావ అని పిలుచుకుంటూ ఉంటాము. ఒక రోజు ఒకచోట ల్యాండ్ చూశాను , కొంటున్నాను , నువ్వు కూడా కుదిరితే కొనుక్కో అన్నాడు. ఎక్కడ ల్యాండ్ కొంటున్నావ్ బావ? అని అడిగాను. మణికొండ అని చెప్పాడు. అప్పుడు నేను బావ నేను మణికొండ లో ఉండాలా?, చిరంజీవి గారు జూబ్లీ హిల్స్ లో ఉంటాడు కదా, నేను కూడా అక్కడే ఇల్లు కొంటాను అనేవాడిని. ఇప్పుడు తల్చుకుంటే ఆరోజుల్లో ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేశాను అనిపిస్తుంది. ఇప్పుడు నా కెరీర్ లో చాలా బిజీ గా ఉన్నన్ని, భవిష్యత్తులో ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్తాను అనే పొగరు ఆరోజుల్లో నాకు ఉండేది, అలా ఉండకూడదు అని నా అనుభవాలు నాకు నేర్పించింది’ అంటూ చెప్పుకొచ్చాడు చిత్రం శ్రీను.

భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేము , కాబట్టి బాగా సంపాదించే రోజుల్లోనే డబ్బులు దాచిపెట్టుకోవాలని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు డబ్బులను అసలు లెక్క చేసేవారు కాదట , ఇష్టమొచ్చినట్టు ఖర్చులు చేసేవారట?, మీ సంపాదించిన డబ్బులతో సగం మణికొండ ని కొనేవారు అని అప్పట్లో అంటుండేవారు’ అని యాంకర్ అడగ్గా అందుకు చిత్రం శ్రీను సమాధానం చెప్తూ ‘ప్రతీ రోజు నేను 4 నుండి 5 సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో పాల్గొనేవాడిని , అప్పటికి ఉన్న రేటుకు నేను సగం మణికొండని కొనేసి ఉండొచ్చు, చాలా డబ్బులు వృధా చేశాను , అలా చెయ్యకూడదు , ఎప్పుడూ నేను బిజీ గా ఉంటాను , నాకు ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయని అప్పట్లో అనుకునేవాడిని, లక్ష్మి దేవి ని ఎప్పుడూ అలా తక్కువ చేయకూడదు అని అనుభవాలు నేర్పించాయి’ అంటూ చెప్పుకొచ్చాడు చిత్రం శ్రీను.

ఇలా చేస్తే మీకూ డేంజర్.. ఫోన్ త్వరగా పాడవుతుంది!

Phone Brightness
Phone Brightness

Phone Brightness: స్మార్ట్‌ఫోన్‌లు నిత్యజీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. అయితే చాలా మంది స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎప్పుడూ 100 శాతంలో ఉంచి ఫోన్ ఉపయోగించడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది తాత్కాలికంగా స్క్రీన్‌ను స్పష్టంగా చూపించినప్పటికీ దీర్ఘకాలంలో ఫోన్ పనితీరుతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా వాడినప్పుడు ఫోన్ మాత్రమే కాకుండా.. కళ్లకూ అనారోగ్యం అని అంటున్నారు. ఎలాగంటే?

అత్యధిక బ్రైట్‌నెస్ కారణంగా ఫోన్ బ్యాటరీపై అదనపు భారం పడుతుంది. స్క్రీన్ అనేది స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ విద్యుత్ వినియోగించే భాగాల్లో ఒకటి. బ్రైట్‌నెస్‌ను 100 శాతంలో ఉంచితే బ్యాటరీ వేగంగా ఖర్చవడమే కాకుండా, కాలక్రమేణా బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ఫోన్‌ను తరచూ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్ వేడెక్కే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా ఎక్కువసేపు సోషల్ మీడియా వినియోగించే సమయంలో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఫోన్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రాసెసర్ పనితీరు తగ్గి, ఫోన్ నెమ్మదిగా పనిచేయడం, యాప్‌లు హ్యాంగ్ అవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఆరోగ్య పరంగా చూస్తే.. అధిక బ్రైట్‌నెస్ కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువ కాంతిని నిరంతరం చూడడం వల్ల కంటి అలసట, కళ్లలో మంట, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు రావచ్చు. ప్రత్యేకించి చీకటి గదుల్లో లేదా రాత్రి సమయంలో 100 శాతం బ్రైట్‌నెస్‌తో ఫోన్ వాడితే కళ్లపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. నిద్ర నాణ్యతపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఫలితంగా రాత్రివేళల్లో ఫోన్ ఎక్కువసేపు వాడేవారికి నిద్ర పట్టకపోవడం లేదా నిద్ర నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

ఈ సమస్యలను నివారించేందుకు ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్‌ను ఆన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పరిసరాల కాంతికి అనుగుణంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది. దీంతో కళ్లకు సౌకర్యంగా ఉండటమే కాకుండా బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది. అలాగే రాత్రి వేళల్లో డార్క్ మోడ్‌ను ఉపయోగించడం మంచిది. డార్క్ మోడ్ కళ్లపై పడే కాంతి ప్రభావాన్ని తగ్గించి, తక్కువ వెలుతురులో ఫోన్ ఉపయోగించడం సులభతరం చేస్తుంది. బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా కళ్లకు మరింత రక్షణ కల్పించవచ్చు.

మొత్తంగా చూస్తే ఎప్పుడూ 100 శాతం బ్రైట్‌నెస్‌లో ఫోన్ వాడటం మంచిది కాదు. అవసరానికి అనుగుణంగా బ్రైట్‌నెస్‌ను సర్దుబాటు చేసుకోవడం, ఆటో బ్రైట్‌నెస్, డార్క్ మోడ్, బ్లూ లైట్ ఫిల్టర్ వంటి ఫీచర్లను వినియోగించడం ద్వారా ఫోన్ జీవితకాలాన్ని పెంచుకోవడంతో పాటు కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

ఫోల్డబుల్ ఫోన్ల చరిత్రలోనే భారీ బ్యాటరీ.. అదిరిపోయే కెమెరా.. ఈ ఫోన్ గురించి తెలుసా..

Vivo X Fold 6 battery capacity
Vivo X Fold 6 battery capacity

Vivo X Fold 6 battery capacity: చైనా కంపెనీ Vivo తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 6 ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రతినిధులు అధికారిక చైనా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ వివరాల ప్రకారం ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ అదిరిపోయే కెమెరా, మతిపోగొట్టే డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గురించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఫోన్ లోపలి భాగంలో 8.02 అంగుళాల భారీ ఫోల్డబుల్ డిస్ ప్లే కనిపిస్తుంది. ఇది శామ్‌సంగ్ M14 లూమినెసెంట్ మెటీరియల్‌తో రూపొందింది. ఇది ఏకంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో ఎలాంటి వాతావరణంలోనైనా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే చీకట్లో ఫోన్ వాడేవారి కోసం కూడా అల్ట్రా-డార్క్ మోడ్ తో కనిపించి కళ్లకు రక్షణగా ‘TÜV రైన్‌ల్యాండ్ గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 3.0’ సర్టిఫికేషన్‌ను కూడా ఇందులో చేర్చారు.

ఫోల్డబుల్ ఫోన్ల చరిత్రలోనే ఇందులో మొదటిసారిగా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను ప్రవేశపెట్టారు. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కోసం జైస్ అపో సూపర్ టెలిఫోటో లెన్స్ కనిపిస్తుంది. దీనివల్ల సుదూరంగా ఉండే దృశ్యాలను, కన్సర్ట్ వేదికలను ఎంతో స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. అంతేకాదు, రాత్రి వేళల్లో అద్భుతమైన పోర్ట్రెయిట్ల కోసం ఫుల్-ఫోకల్ లెంగ్త్ జూమ్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది.

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ వివో ఈ ఫోన్లో ఏకంగా 6,900mAh భారీ సిలికాన్ ఆనోడ్ బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. శామ్‌సంగ్, గూగుల్ ఫోల్డబుల్ ఫోన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. పర్ఫార్మెన్స్ పరంగా ది బెస్ట్ అనిపించుకునేలా ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్‌సెట్‌ ఉండగా.. గత వెర్షన్ కంటే 111 శాతం మెరుగైన AI పర్ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బ్యాటరీ వినియోగాన్ని 56 తగ్గిస్తుందని అంటున్నారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 Fold ఓఎస్‌తో నడిచే ఈ ఫోన్‌లో ‘అటామిక్ వర్క్‌బెంచ్’, ‘AI లైట్ ఆఫీస్ టూల్’ వంటి ఫీచర్లు ఉన్నాయి.

తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్.. చనిపోయిన కుక్కకు పోస్టుమార్టం.. ఏం తేలిందంటే..

Tuni Gnaneswari missing case update
Tuni Gnaneswari missing case update

Tuni Gnaneswari missing case update: తునిలో మిస్సింగ్ అయిన జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించలేదు. కాకినాడ జిల్లాలోని తుని మండలం చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి 9 రోజుల క్రితం నుంచి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలే విధంగా రోదిస్తున్నారు.

మీడియా ద్వారా ఈ వ్యవహారం సంచలనం కావడంతో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అత్యంత ఆధునికమైన థర్మల్ డ్రోన్ ల సహాయంతో పరిశీలిస్తున్నారు. ఆ పాప మీద అడవి జంతువులు ఏమైనా దాడి చేశాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అలాంటి అవకాశాలు లేవని అధికారుల పరిశీలనలో తేలింది. పైగా అక్కడ అటవీ ప్రాంతాలు లేవు. జంతువుల జాడ కూడా కనిపించడం లేదు. ఒకవేళ ప్రమాదకరమైన పాములు.. కొండచిలువలు సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అవి ఏమైనా దాడులు చేశాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు..

ఇంతవరకు ఈ ప్రాంతంలో అడవి జంతువులు సంచరించినట్టుగాని.. పిల్లల మీద దాడులు చేసిన ఆన వాళ్లు గాని లేవు. అధికారుల బృందాలు పలు కోణాలలో దర్యాప్తు చేపడుతున్నాయి. మరోవైపు జ్ఞానేశ్వరుని చూసిన ఒక వ్యక్తి.. నేరుగా ఆమె తల్లికి చెప్పకుండా గ్రామంలో ఉన్న వ్యక్తులకు చెప్పాడు. దీంతో జ్ఞానేశ్వరి తల్లి అతడి మీద అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆ పాప ఎక్కడ ఉన్నా సరే తమ వద్దకు చేరుకుంటుందని తల్లిదండ్రులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరో అపహరించి ఉంటారని.. వారు భావిస్తున్నారు.

పాపతోపాటు అదేరోజు అదృశ్యమైన కుక్క మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఆ కుక్క గత శనివారం మధ్యాహ్నం కన్నుమూసింది. ఆ కుక్క కళేబరాన్ని ఎస్ సురవరం వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. అనేక నమూనాల సేకరించి విశాఖపట్నంలో ఉన్న ప్రయోగశాలకు పంపించారు. అయితే ఆ కుక్క ఎండవేడికి తిరగడం వల్ల చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. కుక్కపై విష ప్రయోగం జరిగిందనే కోణంలో కూడా పరిశీలన జరిపారని.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కుక్క మీద విష ప్రయోగం జరిగి ఉంటే అప్పుడు.. వేరే కోణాలలో జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.