Home Blog Page 109

ప్రముఖ నగల దుకాణంలో బంగారం చోరీ.. పోలీసుల విచారణలో దిమ్మ తిరిగిపోయే నిజాలు..

Khan Sir Arrest
Khan Sir Arrest

Ghaziabad Jewellery Shop Theft: అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. ఘజియాబాద్ నగరం. ఇక్కడ ఒక ప్రముఖ సంస్థ నగల దుకాణాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఇక్కడ భారీగా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఈ నగల దుకాణంలో ఇటీవల చోరీ జరిగింది. ఆ చోరి కూడా భారీ స్థాయిలో జరిగింది. సుమారు నాలుగు కోట్ల విలువైన నగలు మాయమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగారు. అనేక ఆధారాలను పరిశీలించారు.. ఆ తర్వాత వారి విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఆ నిజాన్ని తట్టుకోలేక ఆ నగల యజమాని ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ప్లాన్ ప్రకారం

నగల దుకాణంలో నితిన్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఉద్యోగంలో చేరాడు. అయితే అతడు ఉద్యోగం కోసం అందులో చేరలేదు. పక్క ప్రణాళిక ప్రకారమే అందులో చేరాడు. విధులను పక్కనపెట్టి బంగారు నగలు ఎక్కడ దాస్తున్నారు.. వాటి తాళాలు ఎక్కడ ఉంటున్నాయి.. సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి.. అనే విషయాలను పరిశీలించాడు. సరిగా ఈనెల 12న షోరూమ్ లో పనిచేసే సిబ్బందికి అతడు దావత్ ఇచ్చాడు. తనకు పెళ్లి కుదిరిందని.. అందువల్లే ఈ విందు ఇస్తున్నానని చెప్పాడు. ఆ పార్టీకి తనకు కాబోయే భార్య కాజల్.. అతడి తండ్రి హాజరయ్యారు. ఈ క్రమంలో షోరూం తాళాలను పర్యవేక్షించే క్యాషియర్ గౌతమ్ కు ఎక్కువ మోతాదులో మద్యం తాగించాడు.. అతడిని ఇంటి వద్ద దింపి.. తాళం చేతులు తీసుకున్నాడు.

వెంటనే మరుసటి రోజు తన స్నేహితులతో కలిసి నితిన్ నగల దుకాణానికి వచ్చాడు. ఆ తాళం చెవిలతో షట్టర్ ఓపెన్ చేశాడు. పావుగంట సమయంలోనే దాదాపు నాలుగు కోట్ల విలువైన ఆభరణాలు మొత్తం దోచుకున్నాడు. అయితే షో రూమ్ వద్ద ఎటువంటి అలారం వ్యవస్థ లేదు. దీంతో నితిన్ పని ఈజీ అయిపోయింది. అయితే సెక్యూరిటీ గార్డ్ ఉదయం ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నితిన్ ను అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితురాలితో పెళ్లి కోసమే తాను నగలు చోరీ చేసినట్టు అతడు ఒప్పుకున్నాడు. నితిన్, అతడి ప్రేయసి, ఆమె తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

స్నేహితురాలితో పెళ్లి కోసం ఈ స్థాయిలో బంగారాన్ని చోరీ చేసిన నితిన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే బంగారం ఎందుకు.. కష్టపడి పని చేసుకుని భార్యను సాక వచ్చు కదా.. ఇప్పుడు దొంగతనాలకు అలవాటు పడ్డావు.. రేపటి నాడు ఏదైనా చేస్తావని చాలామంది అతడిని విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రేమించే అర్హత లేదని.. కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.

కోట్ల మందికి ఆదర్శనీయుడు.. ఈగో పెరిగి జైలు పాలయ్యాడు.. మామూలు స్టోరీ కాదు ఇది

Khan Sir Arrest
Khan Sir Arrest

Khan Sir Arrest: ఆయన పాఠం చెబితే మామూలుగా ఉండదు. విశ్లేషణ చేస్తే అంచనాలకు అందదు. బిజెపిని తిడతారు. కాంగ్రెస్ పార్టీని ఏకిపారేస్తారు. ప్రజలకు మంచి చేయని ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టకుండా తిట్టేస్తుంటారు. ఆయన అనర్గళంగా పాఠాలు చెబుతూనే ఉంటారు. వందల మంది విద్యార్థులను సైతం ఒక్కడే పర్యవేక్షిస్తారు. విద్యార్థులలో ఏదైనా మార్పు కనిపిస్తే మొహమాటం లేకుండా బయటికి పంపిస్తారు. నిర్లక్ష్యానికి మించిన దరిద్రం లేదని.. వినే ఓపిక లేనప్పుడు సాధించే సత్తా ఉండదని ఆయన అంటుంటారు. ఆయన మరెవరో కాదు ఖాన్ సార్..

బీహార్ రాష్ట్రంలో ఖాన్ పేరు తెలియని వారు ఉండరు. యూట్యూబ్ చూసేవారికి కూడా ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు తక్కువ ఫీజులో ఆయన శిక్షణ ఇస్తూ ఉంటారు. వర్తమాన అంశాల నుంచి మొదలు పెడితే ఆర్థిక శాస్త్రం వరకు ఇలా అన్నింటి మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉంటుంది. బీహార్ రాష్ట్రంలో ఖాన్ సార్ అకాడమీలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఆయన గురించి జాతీయ.. అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే ఇంతటి విద్వత్తు ఉన్న ఆయన.. ఈగో వల్ల దారి తప్పారు. సప్త సముద్రాలు దాటి.. మురికిగుంటలో పడ్డట్టు.. ఇప్పుడు జైలు గోడల మధ్య ఉండిపోయారు.

బీహార్ లో ఖాన్ సార్ కు పోటీగా రోషన్ ఆనంద్ అనే విద్యావంతుడు అకాడమీ పెట్టాడు. ఖాన్ కంటే తక్కువ ధరకు కోచింగ్ ఇస్తానంటూ ముందుకు వచ్చాడు. దీంతో ఈ రెండు అకాడమీ లలో పనిచేసేవారు పోటాపోటీగా పోస్టర్లు వేశారు. అంతేకాదు ఒకరి పోస్టర్లను మరొకరు చించేశారు. దీంతో ఇద్దరి మధ్య ఈగో పెరిగిపోయింది.. ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని స్థాయికి అది దిగజారింది. ఈ నేపథ్యంలో రోషన్ ఆనంద్ తన కార్యాలయం మీదికి వచ్చి దాడి చేశారని ఖాన్ సార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించకుండానే ఖాన్ సార్ మీద ఉన్న నమ్మకంతో రోషన్ ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.

పోలీసుల దర్యాప్తులో ఖాన్ సార్ అనుచరులు కాల్పులు జరిపినట్లు తేలింది. దీంతో వాళ్లు ఖాన్ సార్ ను అదుపులోకి తీసుకున్నారు.ఖాన్ సార్ కు యూట్యూబ్లో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన పాఠాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయినప్పటికీ కేవలం ఈగో వల్ల.. ఖాన్ సార్ తన స్థాయిని కోల్పోయారు. చివరికి జైలు గోడల మధ్య ఉండిపోయారు. అందుకే అంటారు ఎంత చదివినా సరే.. ఎంత విజ్ఞానం ఉన్నా సరే.. మనిషి వివేచన కోల్పోకూడదు అని.. అది కోల్పోయి ఖాన్ సార్ చివరికి ఇలా మారిపోయారు.

డిజిటల్ విధానంలో సంతకాలు.. ఇరాన్, అమెరికా మధ్య శాంతి నిజంగానే వర్ధిల్లుతుందా..

Iran US Peace Deal
Iran US Peace Deal

Iran US Peace Deal: అమెరికాకు సంబంధం లేని యుద్ధం ఇది. అమెరికా వేలు పెట్టకుండా ఉండాల్సిన పరిణామం ఇదే. ఒకరోజు భాగవతానికి మూతి మీసాలు తీసుకున్నట్టు.. ఇజ్రాయిల్ దేశంతో ఉన్న అనుబంధాన్ని మనసులో పెట్టుకొని యుద్ధంలోకి దిగింది అమెరికా. చివరికి నష్టాన్ని మూటకట్టుకొని.. మోయలేని భారంతో తలవంచుకుంది. అగ్రరాజ్యం కాబట్టి ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. కానీ తెరవెనుక జరిగింది అందరికీ తెలుసు.

ఇరాన్ మహా మొండిగా యుద్ధాన్ని కొనసాగించింది. నష్టపోయినప్పటికీ వెన్ను చూపించలేదు. ప్రపంచ దేశాలు సపోర్ట్ చేయకపోయినప్పటికీ.. తనకు తానుగా స్వీయ శక్తితో యుద్ధాన్ని కొనసాగించింది. అమెరికాకు కొరకరాని కొయ్యలాగా మారిపోయింది.. దీంతో అమెరికా మధ్య మార్గంలో భాగంగా పాకిస్తాన్ దేశాన్ని రంగంలోకి దించింది. శాంతి చర్చలు అంటూ ప్రవచనాలు వల్లించింది. చివరికి ఇరాన్ అయిష్టంగానే పీస్ డీల్ కు ఒప్పుకుంది.

ఇప్పటికే హార్మోజ్ తెరుచుకుంది. G7 సమ్మిట్ లో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని చెప్పారు. మొత్తానికి రెండు దేశాల మధ్య ఇంతటి రక్తపాతం జరిగిన తర్వాత శాంతి కుదిరింది. ఈ శాంతి అవగాహన ఒప్పందంపై ఇరాన్, అమెరికా దేశాలు సంతకాలు చేశాయి. అయితే పూర్తి డిజిటల్ విధానంలోనే ఈ ప్రక్రియ పూర్తయింది. అదే కాదు యుద్ధం ముగిసినట్టు ఆ రెండు దేశాలు ప్రకటించాయి.. ఇరాన్ అంతర్గత వ్యవహారాలలో ఇకపై అమెరికా జోక్యం చేసుకోదు. 60 రోజుల్లో శాంతి ఒప్పందంపై తుది నిర్ణయం జరుగుతుంది. ఎటువంటి చార్జీలు లేకుండానే హర్మజ్ నుంచి సరుకు రవాణా జరుగుతుంది. మిల్ట్రీ ఆపరేషన్లు మొత్తం అమెరికా నిలిపివేయాల్సి ఉంటుంది. అయితే లెబనాన్ విషయంలో మాత్రం అమెరికా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. బహుశా అక్కడ మిలిటరీ ఆపరేషన్లు కొనసాగించే అవకాశం ఉంది.

డిజిటల్ విధానంలో సంతకాలు పూర్తి అయిన నేపథ్యంలో శాంతి వెల్లి విరుస్తుందా.. లేక కథ మళ్ళీ మొదటి వస్తుందా.. అనే అనుమానాలు అంతర్జాతీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల భారీగా నష్టం జరిగిన నేపథ్యంలో ఇరాన్ పునర్నిర్మాణానికి చాలా సమయం పడుతుంది. సుప్రీమ్ లీడర్లను ఇరాన్ కోల్పోయింది. సైన్యాన్ని కూడా నష్టపోయింది. భారీగా నష్టాన్ని చవి చూసింది. గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మళ్లీ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రచారానికి గాంధీ, అంబేద్కర్.. గెలిచాక.. టిప్పు సుల్తాన్, రజకార్లు.. థూ మీ రాజకీయం తగలబడ..

Gandhi Ambedkar Politics
Gandhi Ambedkar Politics

Gandhi Ambedkar Politics: ఇటీవల కాలంలో కొంతమంది కుహనా మేధావులు.. కుహనా రాజకీయ నాయకులకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్.. జాతిపిత మహాత్మా గాంధీ మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొస్తున్నది. అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేయడం.. జయంతి.. వర్ధంతిల సమయంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేయడం.. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం.. వంటివి చేస్తున్నారు. ఇంకా కొందరైతే మహాత్మా గాంధీ జయంతి.. వర్ధంతి రోజు సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వారి మీద జనాలకు సహజంగానే ప్రేమ కలగడం ఖాయం. ఎందుకంటే మనదేశంలో అంబేద్కర్.. గాంధీ మహాత్ముడిని ప్రేమించని వారు ఉండరు.

మహనీయులను తలచుకోవడం.. వారి సేవలను గుర్తుంచుకోవటం.. వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం గొప్ప కార్యక్రమం. కానీ ఇది ప్రేమతో చేస్తున్నది కాదు. గౌరవంతో చేస్తున్నది అంతకంటే కాదు. కేవలం రాజకీయ ప్రాపకం కోసం కొంతమంది ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారు.. అంతేకాదు ఎన్నికల్లో ప్రచారానికి మహనీయుల ఫోటోలను వాడుకుంటున్నవారు.. ఆ తర్వాత దేశ వ్యతిరేక శక్తులను తలచుకుంటున్నారు. వారి ఫోటోలను ఏకంగా అధికారిక కార్యాలయాలలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటువంటి సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో మాలేగాన్ డిప్యూటీ మేయర్ షాన్ ఏ హింద్ ఇటీవల తన అధికారిక కార్యాలయంలో టిప్పు సుల్తాన్ ఫోటో పెట్టుకుంది. ఇది మీడియాలో పడి సంచలనంగా మారింది. దీనిపై మీడియా ప్రతినిధులు ఆమె వివరణ కోరడానికి ప్రయత్నించారు. “నా కార్యాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అందువల్లే టిప్పు సుల్తాన్ ఫోటో గోడకు మీకు కనిపించి ఉన్నట్టుంది. దాన్ని నాకు కొంతమంది తెలిసినవాళ్లు బహుమతిగా ఇచ్చారు” అని చెప్పింది..”కేవలం టిప్పు సుల్తాన్ ఫోటో మాత్రమే గోడకు ఉంది.. అంబేద్కర్.. మహాత్మా గాంధీ ఫోటోలు ఎక్కడ అని'” మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే..”టిప్పు సుల్తాన్ ఫోటో మాత్రమే మా వాళ్ళు గోడకు ఉంచారు.. మిగతా ఫోటోలు పక్కన పెట్టారు.. పునరుద్ధరణ పనులు పూర్తికాగానే ఏర్పాటు చేస్తామని” ఆమె బదులిచ్చింది.

కానీ ఆ డిప్యూటీ మేయర్ కు ఎన్నికలలో ప్రచారం వరకే మహాత్మా గాంధీ కావాలి. అంబేద్కర్ కావాలి. ఎన్నికల్లో గెలిచింది కాబట్టి తన స్వభావాన్ని ఆమె ప్రదర్శిస్తుంది. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడటా.. మైసూర్ షేర్ అట.. ఇదే మాట డిప్యూటీ మేయర్ అంటుంటే.. అక్కడి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆ డిప్యూటీ మీద ఉండేది మహారాష్ట్ర కాబట్టి.. మరాఠా యూదుడు శివాజీ.. లేదా ఇంకా ఇతర దేశభక్తుల ఫోటోలు పెట్టుకోవాలి. కానీ టిప్పు సుల్తాన్ ఫోటో పెట్టుకోవడం నిజంగా ఆశ్చర్యకరం.

ఈమె మాత్రమే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నప్పుడు దానికి రివైవల్ డే అని పేరు పెడుతుంది. అంతేకాదు ఆ దినోత్సవం సందర్భంగా రజాకార్లను స్మరించుకుంటూ ఉంటుంది. వాస్తవానికి ఎంఐఎం పార్టీ వ్యవస్థాపక దినం జరుపుతున్నప్పుడు ఆ పార్టీ ఏర్పాటుచేసిన వ్యక్తి ఫోటో పెట్టుకోవాలి. ఆయన గురించి స్మరించుకోవాలి. అంతేగాని రజాకార్లను స్మరించుకోవడం ఏంటో.. ఎంఐఎం నేతలకే తెలియాలి. అన్నట్టు ఈ తరహా నాయకులను ఎంకరేజ్ చేస్తున్న మిగతావాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి.

చూడ్డానికి దేవదూతలా ఉంటాడు కానీ మోడీ ఓ కిల్లర్.. పక్కనే ఉండి పొగిడిన ట్రంప్

Donald Trump And Narendra Modi
Donald Trump And Narendra Modi

Donald Trump And Narendra Modi: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా చూశారా.. అందులో విక్టరీ వెంకటేష్ కుటుంబాన్ని ఉద్దేశించి రావు రమేష్..”మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి తెలియవు రా బాబు.. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ పరిగెడుతూ ఉంటే.. మీరేంట్రా ఎలా ఉన్నారు.. వాడు అంత ఆవేశంగా ఉన్నాడు. వాడిని అలా వదిలేయకండిరా.. ఎక్కడైనా చూపించండి” అని ఒక డైలాగ్ అంటాడు.. ఈ డైలాగ్ ఫుల్ ఫేమస్. ఇది ఇప్పుడు ట్రంప్ కు వర్తించేలా ఉంది. ఎందుకంటే అతడి వ్యవహార శైలి అలా ఉంది.

ఏ మనిషికైనా కోపం ఉంటుంది.. ఇతర గుణాలు కూడా ఉంటాయి. కానీ ట్రంప్ వాటన్నింటిని ఏకకాలంలో ప్రదర్శిస్తూ ఉంటాడు. తాను అమెరికా అధ్యక్షుడి ని అనే గర్వం అతనిలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే కోప్పడతాడు. అంతలోనే నవ్వుతుంటాడు. క్షణంలోనే మారిపోతుంటాడు. ప్రేమను ప్రదర్శిస్తాడు. ఏం చేస్తాడో తెలియదు.. ఎందుకు అలా ఉంటాడో తెలియదు. ఇరాన్ దేశంతో యుద్ధం అంటాడు.. అంతటితోనే ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి అంటాడు.. మాతో పోటీ పడితే యుద్ధం తప్పదు అంటాడు.. ఇజ్రాయిల్ తనకు మిత్ర దేశమంటాడు. తాను లేకపోతే ఇజ్రాయిల్ బతికి బట్ట కట్టేది కాదు అంటాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో షేడ్స్ అతనిలో ఉన్నాయి.

తాజాగా g7 సమ్మిట్ లో ట్రంప్ మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. ఈసారి అతడి కన్ను నరేంద్ర మోడీ మీద పడింది. భారత ప్రధాని హోదాలో ఆయన అక్కడికి వెళ్లిన క్రమంలో.. ట్రంప్ మరోసారి తన చంచల స్వభావాన్ని ప్రదర్శించాడు..”చూసేందుకు దేవదూతలా ఉంటాడు. కానీ మోడీ ఒక కిల్లర్.. నాకు మంచి స్నేహితుడు. కానీ కఠినంగా ఉంటాడు. నవ్వుతూనే ఉంటాడు గాని.. చేసేది చేస్తుంటాడు. త్వరలోనే ఇండియాలో పర్యటిస్తాను. ట్రేడ్ డీల్ ముగింపు దశలో ఉంది” ఇలా మాట్లాడాడు ట్రంప్.

ఆమధ్య పాకిస్తాన్ దేశంతో అంట కాగాడు ట్రంప్. ఇప్పుడు భారత్ తో చెలిమి కోసం తాపత్ర పడుతున్నాడు. ప్రధానమంత్రిని జోకే పనిలోపడ్డాడు. ట్రేడ్ డీల్ అంటూ తెరపైకి ఏవేవో విషయాలను తీసుకొస్తున్నాడు. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు గ్లోబల్ మీడియా సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఇలా ట్రంప్ ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. ఇతనికి ఏమైంది అనే కోణంలో అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అంటే.. మామూలు విషయం కాదు. ఈ కథనం ప్రారంభంలో రావు రమేష్ డైలాగులను ప్రస్తావించాం కదా.. అవి నిజజీవితంలో ట్రంప్ కు వర్తించే విధంగా ఉన్నాయి.

పవన్ వచ్చాడు.. చనిపోతుందనుకున్న పాప బతికింది.. ఈ అద్భుతం ఎక్కడ జరిగింది అంటే..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: హనుమకొండలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నిరంజన్ ను పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతే కాదు త్వరలో ఓజీ 2 చిత్రంలో నటించాలని అతడికి ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాకతో నిరంజన్ ఆనందంతో కనిపించాడు. అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న అతడు.. పవన్ కళ్యాణ్ ను చూడాలని.. తన కోరికను వ్యక్తం చేశాడు. అభిమానుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్.. వెంటనే నిరంజన్ వద్దకు వచ్చాడు. భద్రకాళి అమ్మవారి ప్రసాదం.. అక్షింతలు పట్టుకొని అతడికి ఇచ్చాడు.

కేవలం నిరంజన్ విషయంలోనే కాదు.. తన అభిమానులు.. ఆపదలో ఉంటే ఎక్కడ దాకైనా పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటారు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఖమ్మం నగరంలో కార్తీక్ న్యూరో హాస్పిటల్ లో.. శ్రీజ అనే బాలిక మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. అప్పటికీ ఆమె ఆ చేతనంగా మారిపోయింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. శ్రీజ తండ్రి కేటీపీఎస్ లో ఉద్యోగి.

శ్రీజకు పవన్ కళ్యాణ్ ను చూడాలని కోరిక. తన కుమార్తె చివరి కోరికను నెరవేర్చాలని శ్రీజ తండ్రి పవన్ కళ్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్.. ఖమ్మం నగరం వచ్చారు. కార్తీక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీజను చూసి కన్నీరు పెట్టుకున్నారు. కోలుకుంటావని ఆమె చెవిలో చెప్పారు. ఆమె తల్లిదండ్రులకు ధైర్య వచనాలు కల్పించారు. చాలాసేపు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. నాడు కార్తీక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ అసాధారణ్ తో పవన్ మాట్లాడారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

పవన్ పరామర్శించి వెళ్లిన తర్వాత శ్రీజ కొద్ది రోజులకే కోలుకుంది. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయింది. ఇప్పుడు ఆమె ఉన్నత చదువులు చదువుతోంది. అంతేకాదు అప్పట్లో జనసేన పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ను శ్రీజ కలిసింది. పార్టీకి తన వంతుగా విరాళం కూడా ఇచ్చింది.. అభిమానులు కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ కరిగిపోతారు. ఎంత దాకా అయినా వచ్చి వారిని పరామర్శిస్తారు. మిగతా హీరోలకు హిపోక్రసీ ఉంటుంది. కాని పవన్ అదేమీ చూపించడు. తాను డౌన్ ఎర్త్ కాబట్టి అలానే ఉంటాడు. అప్పుడు శ్రీజ.. ఇప్పుడు నిరంజన్.. అభిమానులు మాత్రమే మారారు.. వారి కష్టాల్లో అండగా ఉండేందుకు వచ్చిన పవన్ మాత్రం అలానే ఉండిపోయారు.

ఆ‘రేంజ్’ సారీలో అందాల రాశి

Rashi Singh orange saree
Rashi Singh orange saree

కేవలం గంటలో అభిమాని నిరంజన్ కోరినవి కొనిచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: నేడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటన గురించే చర్చ సాగింది. 17 ఏళ్ళ యువకుడు చాలా కాలం నుండి ట్రీట్మెంట్ లేని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అతను బ్రతికేది చాలా తక్కువ కాలం అని డాక్టర్లు సైతం చెప్పుకొచ్చారు. అలాంటి సమయం లో తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ ని చూడడం అని ఆ యువకుడు కోరగా , నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ విషయాన్నీ తెలియజేయడం కోసం ఆ కుర్రాడి తల్లిదండ్రులు , బంధు మిత్రులు పడిన కష్టం మామూలుది కాదు. ఎట్టకేలకు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి తెలిసేలా చేశారు. దీంతో వెంటనే ఆయన నేడు వరంగల్ కి వెళ్లి , ఆ కుర్రాడిని కలిసి , అతనితో , అతని కుటుంబం తో చాలా సమయం గడిపాడు.

దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ చూపించిన చొరవ , ప్రేమ ని చూసి ఆయన అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా చలించిపోయారు. ఇకపోతే ఆ కుర్రాడు పవన్ కళ్యాణ్ ని ఒక ఐపాడ్, రామ్ చరణ్ వద్ద ఉన్నటువంటి పుడుల్ జాతికి చెందిన పెంపుడు కుక్కని కావాల్సిందిగా కోరాడు. వీటిని పవన్ కళ్యాణ్ వరంగల్ నుండి వెళ్లిన గంటలోపే ఆ కుర్రాడికి అందేలా చేసాడు. దీంతో ఆ కుర్రాడు పడిన ఆనందాన్ని చూస్తే ఎవరికైనా కళ్ళలో నీళ్లు తిరగక తప్పదు. ఉన్నది తక్కువ ఆయుష్షు , అయినప్పటికీ తనకు దొరికినటువంటి చిన్న చిన్న కానుకలకు అతను పడిన ఆనందాన్ని చూస్తుంటే , ప్రతీ ఒక్కరు జీవితం యొక్క విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఈ కుర్రాడు ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాడో తెలియదు కానీ , ఉన్నన్ని రోజులు కచ్చితంగా ఈరోజు జరిగిన సంఘటనలను తలచుకొని ఆనందంగా బ్రతుకుతాడు.

ఇకపోతే నిరంజన్ ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ , 5 లక్షల రూపాయిలు సహాయం చేస్తానని అధికారికంగా ప్రకటించాడు. అదే విధంగా ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘పంజా’ చిత్రాన్ని సెప్టెంబర్ 2 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు కైలాష్ ఫిలిమ్స్ సంస్థ. ఈ సందర్భంగా నిరంజన్ కి తక్షణమే లక్ష రూపాయిల సాయం అందించాడు. అంతే కాకుండా, పంజా చిత్రం నుండి వచ్చే వసూళ్ళలో 5 శాతం ఆ కుర్రాడికి సహాయం గా అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న నిరంజన్ లేటెస్ట్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

ఒకప్పుడు రైలు టికెట్ చివరన రంధ్రాలు ఉండేవి...వీటిని ఏమంటారో తెలుసా..

Railway Ticket Sprocket Holes
Railway Ticket Sprocket Holes

Railway Ticket Sprocket Holes: మన భారతదేశంలో రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి పూర్వ కాలం నుంచే అన్ని రకాలా సౌకర్యాలను అందించేవారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ వద్ద ఇచ్చే కాగితపు టిక్కెట్లను గమనిస్తే.. వాటి ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలు కనిపించేవి. చాలామంది వాటిని కేవలం డిజైన్‌లో భాగమని భావించేవారు. కానీ వాస్తవానికి ఆ రంధ్రాలు ఉండడానికి వేరే కారణాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అవి కనిపించడం లేదు. ఒకప్పుడు ఆ రంధ్రాలను ఎందుకు ఉంచారు? ఇప్పుడు వాటిని ఎందుకు తొలగించారు?

భారతీయ రైల్వే టిక్కెట్ కాగితాల ఇరువైపులా వరుసగా ఉండే ఈ చిన్న రంధ్రాలను సాంకేతిక పరిభాషలో ‘స్ప్రోకెట్ హోల్స్’ అని పిలుస్తారు. ఇవి కాగితాన్ని ప్రింటర్‌లో సరిగ్గా ముందుకు నడిపించేందుకు ఉపయోగపడేవి. కాగితం పక్కల ఉన్న ఈ రంధ్రాల్లో ప్రింటర్‌లోని ప్రత్యేక దంతాలు ఇమిడిపోయి కాగితాన్ని సమాన వేగంతో లాగేవి. గతంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో ప్రధానంగా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు ఉపయోగించేవారు. ఈ ప్రింటర్లు నిరంతరంగా ఉండే పొడవైన కాగితాలపై ముద్రణ చేసేవి. కాగితం వంకరగా పోకుండా, ఇరుక్కుపోకుండా, అక్షరాలు సరిగ్గా ముద్రించబడేలా స్ప్రోకెట్ హోల్స్ సహాయపడేవి. దీంతో వేగవంతమైన, ఖచ్చితమైన ప్రింటింగ్ సాధ్యమయ్యేది.రైల్వే టిక్కెట్లను భారీ సంఖ్యలో ముద్రించాల్సి ఉండేది. రోజుకు వేలాది టిక్కెట్లు జారీ చేసే సమయంలో ప్రింటింగ్‌లో అంతరాయం కలగకుండా ఉండేందుకు స్ప్రోకెట్ హోల్స్ ఉన్న ప్రత్యేక టిక్కెట్ రోల్స్‌ను ఉపయోగించేవారు. దీంతో టిక్కెట్లు సరిగ్గా వరుసగా ముద్రించబడటంతో పాటు ప్రింటర్‌లో కాగితం చిక్కుకుపోయే సమస్యలు కూడా తగ్గేవి.

కాలక్రమేణా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ల స్థానంలో అధునాతన థర్మల్ ప్రింటర్లు, లేజర్ ఆధారిత ప్రింటింగ్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రింటర్లలో కాగితాన్ని లాగేందుకు స్ప్రోకెట్ వ్యవస్థ అవసరం ఉండదు. ప్రత్యేక రోలర్ల సాయంతో కాగితం స్వయంచాలకంగా ముందుకు కదులుతుంది. అందువల్ల కాగితాలపై రంధ్రాలు ఉండాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోయింది. స్ప్రోకెట్ హోల్స్ ఉన్న కాగితాల తయారీకి అదనపు ప్రక్రియ అవసరమవుతుంది. కొత్త తరహా థర్మల్ టిక్కెట్లలో ఈ అవసరం లేకపోవడంతో కాగితం తయారీ వ్యయం తగ్గింది. అలాగే కాగిత వినియోగం కూడా మరింత సమర్థవంతంగా మారింది. రైల్వే శాఖకు దీని వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గాయి.

ప్రస్తుతం చాలా మంది ప్రయాణికులు ఆన్‌లైన్ బుకింగ్, మొబైల్ టిక్కెట్లు, SMS టిక్కెట్లు, QR కోడ్ ఆధారిత ఈ-టిక్కెట్లను ఉపయోగిస్తున్నారు. దీంతో సంప్రదాయ కాగితపు టిక్కెట్ల వినియోగం కూడా గణనీయంగా తగ్గింది. రైల్వే స్టేషన్లలో జారీ చేసే టిక్కెట్లు సైతం ఆధునిక థర్మల్ ప్రింటర్ల ద్వారా ముద్రించబడుతున్నాయి. అప్పటి ప్రింటింగ్ సాంకేతికతకు అవి వెన్నెముకలాంటివి. అయితే సాంకేతిక పరిణామంతో డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు చరిత్రలో కలిసిపోవడంతో స్ప్రోకెట్ హోల్స్ కూడా క్రమంగా కనుమరుగయ్యాయి. నేటి యువతకు అవి కనిపించకపోయినా, భారతీయ రైల్వే టిక్కెట్ల పరిణామక్రమంలో అవి ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచిపోయాయి.

OTT లోకి 'కల్కి 2' వెబ్ సిరీస్.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ కి దండం పెట్టొచ్చు..

Kalki 2
Kalki 2

Kalki 2: మన టాలీవుడ్ లో ఒక సినిమాని వేరే లెవెల్ లో ప్రమోట్ చేయాలంటే రాజమోళి తర్వాతే ఎవరైనా అని అంటుంటారు ట్రేడ్ విశ్లేషకులు. సినిమా తీయడానికి ఆయన రెండేళ్లు , మూడేళ్లు తీసుకుంటే, ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి మూడు నెలల సమయం తీసుకుంటాడని అంటుంటారు. ఈ అంశం లో రాజమౌళి ని కొట్టే డైరెక్టర్ ఎవ్వరూ లేరని నిన్న మొన్నటి వరకు అనుకునేవారు. కానీ ఇప్పుడు నాగ్ అశ్విన్ రాజమౌళి ని మించిన ప్రమోషనల్ స్ట్రాటజీ ని ‘కల్కి 2’ చిత్రం కోసం ఉపయోగించబోతున్నాడు. ‘కల్కి’ చిత్రం విడుదల సమయం లో నాగ్ అశ్విన్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఒక చిన్న వెబ్ సిరీస్ చేసాడు గుర్తుందా?. ప్రభాస్ కి , బుజ్జి కి మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది అనే బ్యాక్ స్టోరీ ని ఈ యానిమేషన్ సిరీస్ లో చూపించాడు.

సరిగ్గా ‘కల్కి 2’ కి కూడా ఇలాంటి యానిమేషన్ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రం లోని క్యారెక్టర్స్ అన్నిటికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ని ఒక వెబ్ సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నాడట. ఒక్కో ఎపిసోడ్ నిడివి గంటకు పైగా ఉంటుందని సమాచారం. భైరవ జననం దగ్గర నుండి , సుప్రీమ్ యాస్మిన్ జననం వరకు, ప్రతీ క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ ని చూపిస్తాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. అశ్వర్దమా బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందట. మహాభారతం కాలం నుండి , కాళీ కాలం వరకు ఆయన అనుభవించిన నరకం , సమాజం లో జరిగే దుర్మార్గాలను చూసి కుమిలిపోవడం వంటివి ఈ సిరీస్ లో చూపిస్తారట. అదే విధంగా కల్కి కి జన్మనిస్తున్న ‘SUM 30’ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ చాలా గట్టిగా పేలుతుందట.

ఇవన్నీ వెబ్ సిరీస్ లో చూపిస్తే , ‘కల్కి’ సిరీస్ కి ఆడియన్స్ మరింత గట్టిగా కనెక్ట్ అవుతారని, బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఎక్కువ అద్భుతాలను నెలకొల్పుతుందని బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్రం మొదలై రెండు కీలక షెడ్యూల్స్ ని పూర్త చేసుకుంది. సెప్టెంబర్ నెల నుండి నాన్ స్టాప్ గా విరామం లేకుండా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని అంటున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకోగా , ఇప్పుడు ఆమె స్థానం లోకి అలియా భట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

'స్పిరిట్' చిత్రం లో పవన్ కళ్యాణ్ 'ఓజీ' సాంగ్.. సందీప్ వంగ సరికొత్త ప్రయోగం..

Spirit Movie
Spirit Movie

Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో , అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ వంగ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా, ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అనేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఉన్నటువంటి క్రేజ్ ‘వారణాసి’ కి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి క్రేజ్ ఉన్న సినిమాకు ఓపెనింగ్స్ ఊహిస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయ్. ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో వచ్చినా , అది బాగా వైరల్ అయిపోతుంది. ఇంతటి క్రేజ్ ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా చూడలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ‘స్పిరిట్’ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లోనే కాదు , పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

అదేమిటంటే ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ ట్రాక్ మ్యూజిక్ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ OST ని ఇన్ స్టాగ్రామ్ లో లక్షల సంఖ్యలో నెటిజెన్స్ వినియోగించారు. అందులో ‘ముంబై స్ట్రోమ్’ అనే మ్యూజిక్ ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనిని ‘స్పిరిట్’ మూవీ లో ఒక సన్నివేశం లో ఉపయోగించాలని డైరెక్టర్ సందీప్ వంగ ఆలోచిస్తున్నట్టు సమాచారం. సందీప్ వంగ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ‘ఓజీ’ చిత్రం లోని ఈ ట్రాక్ ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ఇది పవన్ ఫ్యాన్స్ , ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఈ రెండు ఫ్యాన్ బేసుల మధ్య రిలేషన్ సోషల్ మీడియా లో కానీ , బయట కానీ చాలా గొప్పగా ఉంది.

కానీ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. ‘స్పిరిట్’ చిత్రానికి పాన్ వరల్డ్ రేంజ్ లో మంచి క్రేజ్ ఉంది. అలాంటి సినిమాకు మొత్తం ఒరిజినల్ కంటెంట్ ఉండాలి కానీ , పక్క సినిమాకు సంబంధించిన కంటెంట్ ని ఉపయోగించాల్సిన అవసరం ఏముంది, క్వాలిటీ ప్రోడక్ట్ లేకపోతే హైప్ బాగా తగ్గిపోతుంది అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిప్తి దిమిరి నటిస్తుండగా, విలన్స్ గా వివేక్ ఒబెరాయ్ , ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రభాస్ పుట్టినరోజున గ్లింప్స్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

సొంత భర్త ముందు సమంత పరువు తీసేసిన యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న వీడియో..

Maa Inti Bangaram 13 Days Collections
Maa Inti Bangaram 13 Days Collections

Samantha Maa Inti Bangaram Movie: కొంత గ్యాప్ తర్వాత సమంత మన ముందుకు ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం తో ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ పై సమంత నిర్మాతగా వ్యవహరించింది. ఈ చిత్రానికి కథ సమంత భర్త రాజ్ నిడిమోరు అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా సమంత నాన్ స్టాప్ గా మూవీ టీం తో కలిసి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు , ఎక్కడ చూసినా ఈమె మాత్రమే కనిపిస్తోంది. ఆ రేంజ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చింది సమంత. ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ సుమ పాపం సమంత పరువు ని తీసినంత పని చేసింది. అది కూడా స్వయంగా తన భర్త రాజ్ నిడిమోరు ముందే జరగడం గమనార్హం.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు సమంత కొన్ని కమర్షియల్ యాడ్ వీడియోస్ లో నటించింది. అప్పటికి ఆమెకు వయస్సులు కేవలం 16 ఏళ్ళు మారమేనంట. ముఖం అసలు గుర్తు పట్టలేని విధంగా ఉంది. దీన్ని చూసి రాజ్ నిడిమోరు కూడా షాక్ కి గురయ్యాడు. ఇది ఇప్పటి వరకు నేను కూడా చూడలేదే , ఎప్పటిది ఇది అంటూ సమంత వైపు చూసి ప్రశ్నించగా , ఆమె తల దించుకొని పగలబడి నవ్వుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో సమంత ఫన్నీ మూమెంట్స్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇకపోతే ఈ చిత్రం గురించి ఆమె రివీల్ చేసిన కొన్ని విషయాలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మా నిర్మాణ సంస్థ ద్వారా బలమైన లేడీ ఓరియెంటెడ్ సినిమాలను అందించడమే మా టార్గెట్ అని , అందులో భాగంగానే ఈ సినిమాని తీసినట్టు చెప్పుకొచ్చింది.

అంతే కాదు , ఈ చిత్రం కథ ని తన భర్త రాజమౌళి సాయి పల్లవి కోసం రాసుకున్నది , ఈ కథ నేను విన్న తర్వాత సాయి పల్లవి చేస్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ ఆమె చాలా బిజీ గా ఉండడంతో డేట్స్ సర్దుబాటు అవ్వలేదు, దీంతో కొన్ని మార్పులు చేసే నేనే హీరోయిన్ గా నటించాల్సి వచ్చింది అట. ఈ విషయాన్ని స్వయంగా సమంత నే చెప్పుకొచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా , సమంత కెరీర్ లో మరో మైల్ స్టోన్ లాగా నిలుస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే ఆమె రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊపందుకుంది , నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 1 లక్షా 50 వేల గ్రాస్ వసూళ్లు , అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by low_budget_logic (@low_budget_logic)

రేపే మొదలు కానున్న వెంకటేష్ - కళ్యాణ్ రామ్ - అనిల్ రావిపూడి మూవీ..టైటిల్ ఏంటి ఇలా ఉంది..

Venkatesh And Kalyan Ram
Venkatesh And Kalyan Ram

Venkatesh And Kalyan Ram: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో ఒక మల్టీ స్టార్రర్ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు రామానాయుడు స్టూడియోస్ లో జరగనున్నాయి. వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , హీరోయిన్స్ కీర్తి సురేష్ , కృతి శెట్టి వంటి వారితో పాటు , డైరెక్టర్ అనిల్ రావిపూడి మరియు ఇతర నటీనటులు , టెక్నీషియన్స్ అందరూ కూడా రేపటి ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా విచ్చేసి , ముహూర్తపు షాట్ కి క్లాప్ కొడుతాడనే టాక్ ఉంది కానీ , మేకర్స్ నుండి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.

అనిల్ రావిపూడి సినిమా అంటే, కచ్చితంగా సంక్రాంతికి వస్తుంది అనేది మెంటల్ గా జనాలు కూడా ఫిక్స్ అయిపోతారు అనేది అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమాని జనవరి 13 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కాదు ఈ చిత్రానికి టైటిల్ కూడా ‘జనవరి 13న విడుదల’ అని లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇది చాలా ఓవర్ గా ఉంది కదూ, ఇంకెన్ని రోజులు ఇలాంటి సంక్రాంతి సెంటిమెంట్ టైటిల్స్ పెడుతావు?, ఆడియన్స్ కి ఎదో ఒకరోజు విసుగు వచేస్తాది అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ అనిల్ రావిపూడి ని ట్యాగ్ చేసి మండిపడుతున్నారు. మరి టైటిల్ నిజంగా అదేనా?, లేదా భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది చూడాలి. ఈమధ్య కాలం లో అనిల్ రావిపూడి తన సినిమాలకు వరుసగా భీమ్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు ఆయన జీవీ ప్రకాష్ కుమార్ ని ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. దీనికి కూడా రీసెంట్ గానే తన క్రియేటివ్ ప్రమోషనల్ బ్రెయిన్ తో , అనిల్ ఎంతటి ఫన్నీ పద్దతిలో ప్రకటించాడో మనమంతా చూశాము. ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం పై ఆడియన్స్ లో ఇంకా ఎంతటి హైప్ క్రేజ్ క్రియేట్ అవుతుందో చూడాలి. తనకి మొదటి సినిమా అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ , వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన వెంకటేష్ లతో కలిసి చేయబోతున్న ఈ మల్టీస్టార్రర్ చిత్రం అనిల్ రావిపూడి కి ఎంతో స్పెషల్, దీనిని ఏ లెవెల్ కి తీసుకెళ్తాడో చూడాలి.

'పెద్ది' 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. నాన్ ఫెస్టివల్ సీజన్ లో అరుదైన రికార్డు..

Peddi 20 Days Worldwide Collections
Peddi 20 Days Worldwide Collections

Peddi 13 Days Box Office: ‘పెద్ది’ జోరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఆడియన్స్ కి కొత్త సినిమాలు లేకపోవడం తో , ‘పెద్ది’ తప్ప మరో ఛాయస్ లేకుండా పోయింది. అందుకే ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా తిరుగులేని షేర్స్ నమోదు అవుతున్నాయి. ఈ రేంజ్ లాంగ్ రన్ ని చూసి మన ఇండస్ట్రీ ఎన్నేళ్లు అయ్యిందో, రామ్ చరణ్ సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు , బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఎక్కడ మొదలై , ఎక్కడ ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు అని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. అలా ఎందుకు అంటారో రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం ఒక ఉదాహరణ. 13 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి , ప్రాంతాల వారీగా ఇప్పటి వరకు ఎంత వసూళ్లు వచ్చాయి అనేది వివరంగా చూద్దాం.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 13 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. నాన్ ఫెస్టివల్ సీజన్ లో ఇలా నాన్ స్టాప్ గా 13 రోజులు 1 కోటి కి పైగా షేర్ వసూళ్లు నమోదు అవ్వడం , చరిత్ర లో ఇదే తొలిసారి. రామ్ చరణ్ స్టార్ పవర్ కి ఇదొక శాంపిల్ మాత్రమే. ఇక ప్రాంతాల వారీగా 13 రోజుల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలించి చూస్తే, నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 52 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ నుండి 20 కోట్ల 17 లక్షలు , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 77 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 26 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 8 కోట్ల 68 లక్షలు షేర్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కృష్ణ జిల్లా నుండి 9 కోట్ల 78 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల 57 లక్షల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 142 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 216 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర/ తెలంగాణ తీసుకుంటే , కర్ణాటక నుండి 14 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 5 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 11 కోట్ల 65 లక్షలు , ఓవర్సీస్ నుండి 22 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 193 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 326 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ బ్రేక్ ఈవెన్ నెంబర్ ని అందుకోవడానికి మరో 26 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది.

మెట్రోను అనవసరంగా తలకెత్తుకున్న రేవంత్.. దించలేక కిషన్ రెడ్డిపై నిందలు

Hyderabad Metro
Hyderabad Metro

Hyderabad Metro:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయంలో ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ, తర్వాత కేంద్రం అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ డైవర్షన్‌గా మారిందని విమర్శలు వస్తున్నాయి. అయితే వాస్తవాలు, ఆర్థిక సవాళ్లు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలను పరిశీలిస్తే ఈ విషయం మరింత సంక్లిష్టంగా కనిపిస్తుంది.

మెట్రో టేకోవర్‌ నేపథ్యం..
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–1ను ఎల్‌అండ్‌టీ నిర్వహిస్తోంది. ఇది నష్టాల్లో ఉండటం, ఆర్థిక భారం కారణంగా లీజ్‌ వదులుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుని, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ద్వారా 100 శాతం ఈక్విటీని సొంతం చేసుకుంది. ఇందుకు సుమారు రూ.1,461 కోట్లు ఖర్చు అయింది. ఎల్‌అండ్‌టీకి చెల్లించాల్సిన బకాయిలు, రుణాలు క్లియర్‌ చేయడం ఈ టేకోవర్‌కు ముఖ్య కారణం. ఇది ఫేజ్‌–2 విస్తరణకు మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎవరూ సూచించకుండానే టేకోవర్‌ చేశారని, రాజకీయ నేపథ్యం ఉందని విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వంపై రుణ భారం..
రూ.13,600 కోట్ల వరకు ఉన్న రుణాలు, ఇవి ఇంతకు ముందు బ్యాంకుల నుంచి 8.25% వడ్డీకి తీసుకున్నవి. ప్రభుత్వం ఇప్పుడు ఐఆర్‌ఎఫ్‌సీ (ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) ద్వారా రీఫైనాన్సింగ్‌ చేయాలని చూస్తోంది. దీనిలో 4% వడ్డీకి జపాన్‌ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) నిబంధనల ప్రకారం రుణం తీసుకోవాలని సూచిస్తోంది. ఇలా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా దెబ్బతింటుంది. ఉద్యోగుల జీతాలు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కొరత ఏర్పడవచ్చు. రాష్ట్ర హామీతో రుణం తీసుకుంటే అది రాష్ట్ర బడ్జెట్‌పై భారం అవుతుంది. ఇది టేకోవర్‌ను ఆర్థికంగా సవాలుగా మార్చింది.

సెకండ్‌ ఫేజ్‌ కోసం డిమాండ్‌..
మెట్రో ఫేజ్‌–2 (సుమారు 123 కి.మీ.,రూ.38,595 కోట్లు) కోసం రేవంత్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు, ఆమోదాలు కోరుతున్నారు. ఇంతకు ముందు 50:50 భాగస్వామ్యంగా ఒప్పందం జరిగిందని చెబుతున్నారు. కానీ యూనియన్‌ మినిస్టర్‌ గిరి కిషన్‌ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అసలు ఉద్దేశం బకాయిలు చెల్లించడం..
ఫేజ్‌–2కు నిధులు తీసుకురావడం ద్వారా టేకోవర్‌ బకాయిలు చెల్లించాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. కిషన్‌ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు, ఆర్థిక బాధ్యతలు తీసుకోవడం లేదు అని ఆరోపిస్తున్నారు. వాదనలు వస్తున్నాయి. ఇది కేంద్ర–రాష్ట్ర రాజకీయాల్లో భాగమైంది.

ప్రజా రవాణా మెరుగుపర్చాలని..
మెట్రో ఫేజ్‌–2 విస్తరణ ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించవచ్చు. అయితే ఆర్థిక భారం, రుణాలు, కేంద్ర నిబంధనలు ఇది సులభం కాదని చూపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం టేకోవర్‌ను గొప్ప విజయంగా చిత్రించి, తర్వాత కేంద్రం మీద బాధ్యత వేయడం రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో కిషన్‌రెడ్డి, కేంద్రం వైపు నుంచి రాష్ట్రం నిబంధనలు పాటించాలని, ఆర్థిక బాధ్యత తీసుకోవాలని ఒత్తిడి చేయడం సహజం. ఈ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్రాలు కలిసి చేయాల్సినది. రాజకీయ ఆరోపణలు, డైవర్షన్‌లు పక్కన పెట్టి, ఆర్థిక వాస్తవాలు, ప్రజా ప్రయోజనం ఆధారంగా ముందుకు సాగాలి. హైదరాబాద్‌ వంటి నగరానికి మెట్రో విస్తరణ అవసరం ఉంది, కానీ అది రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా జరగాలి.

ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల్లో రాజకీయాలు అనివార్యం. కానీ ప్రజలు ఫలితాలు చూడాలని కోరుకుంటారు. మెట్రో విస్తరణ, మెరుగైన రవాణా. రెండు పక్షాలు సహకరించి, సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పుడే ఈ టేకోవర్‌ నిజమైన అభివృద్ధికి దారితీస్తుంది.

టీజీ టి20 టోర్నీ.. చిక్కుల్లో విజయ్ దేవరకొండ.. ఏం జరిగింది

Vijay Deverakonda Cricket League Issue
Vijay Deverakonda Cricket League Issue

Vijay Deverakonda Cricket League Issue: ఇటీవల వివాహం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. పైగా తన సొంత జిల్లాలో విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందజేశాడు. చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైగా భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. విజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో పెద్దపెద్ద ప్రాజెక్టులున్నాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం టీజీ టీ20 టోర్నీకి ప్రచారకర్తగా కొనసాగుతున్నాడు. ఇతడితోపాటు దగ్గుబాటి వెంకటేష్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. క్రికెటర్లు సిరాజ్, తిలక్ వర్మ టీజీ టి20 టోర్నీలో కీలకంగా ఉన్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టిజి టి 20 టోర్నీ నిర్వహిస్తోంది. ఇటీవల వేలం కూడా జరిగింది. మరికొద్ది రోజుల్లో టోర్నీ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీజీ టి20 టోర్నమెంట్కు ఎటువంటి అనుమతి లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తాజాగా బాంబు పేల్చింది. అంతేకాదు టీజీ టి20 టోర్నీకి ఎండార్స్మెంట్ చేసుకోవడానికంటే ముందు.. దానికి అనుమతి ఉందో లేదో చూసుకోవాలని టిసిఏ జనరల్ సెక్రెటరీ వ్యాఖ్యానించడం సంచలనానికి కారణమవుతోంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి అంటే

టోర్నమెంట్ ప్రకటించడానికి 45 రోజుల ముందు బీసీసీఐ నుంచి అనుమతులు తీసుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తు కాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగితే క్రిమినల్ కేసులు నమోదు అవుతుంటాయి. అనుమతి లేని టోర్నీలలో తిలక్.. సిరాజు వంటి ప్లేయర్లకు ఆడాలని బీసీసీఐ అనుమతులు ఇచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండార్స్మెంట్ చేసుకునే ముందు ఈ టోర్నీ న్యాయబద్ధంగా జరుగుతోందా.. అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. మరోవైపు ఖమ్మం టీం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడికి సంబంధం గురించి కూడా సరికొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

వరంగల్ జట్టులో జూపల్లి కృష్ణారావు కొడుకు వ్యవహారం గురించి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సరికొత్త ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టీజీ టి20 టోర్నీ ఫ్రాడ్ అని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫీజులకే ఐదు నుంచి 6 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని మండిపడుతోంది. ఈ డబ్బులతో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో క్రికెట్ ను అభివృద్ధి చేయవచ్చని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు చెబుతున్నారు. ఈ నోటీసుల నేపథ్యంలో విజయ్ దేవరకొండ నుంచి మొదలుపెడితే రాయుడు వరకు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.